
సొంతింటి కల.. నెరవేరేలా!
ఇల్లెందు: గత ప్రభుత్వ హయాంలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటే పేదలు తమ కష్టాలు తీరినట్లేనని భావించారు. కానీ చాలామంది కలలు తీరకుండానే ఆ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. ఆతర్వాత అధికారంలోకి కొలువుదీరిన కాంగ్రెస్ పేదల సొంతింటి కల నెరవేర్చేలా ఇందిరమ్మ ఇంటి పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇల్లెందు పట్టణంలోని 24 వార్డుల్లో తొలి విడతగా 357 మంది ఇళ్లు మంజూరయ్యాయి. అయితే, తొలుత నిర్మించుకోవాల్సి ఉండడం.. ఆతర్వాత ప్రభుత్వం దఫాలుగా రూ.5లక్షల మేర బిల్లులు ఇస్తామని చెప్పడంతో నిరుపేదలు ఆలోచనలో పడ్డారు. పెట్టుబడి ఎలా అనే ఆవేదనలో ఉన్న నేపథ్యాన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అధికారులు సమాలోచనలు చేసి ఏపీకి చెందిన ఓ కాంట్రాక్టర్ను సంప్రదించగా మూకుమ్మడిగా ఇళ్ల నిర్మాణానికి అంగీకరించాడు.
రూపాయి పెట్టకుండానే...
గత రెండు నెలలుగా ఎమ్మెల్యే కోరం కనకయ్య, అధికారులు.. ఇళ్ల నిర్మాణం విషయమై ఏపీకి చెందిన ఓ కాంట్రాక్టర్తో సమాలోచనలు చేశారు. దీంతో లబ్ధిదారులు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే తానే ఇంటి నిర్మాణం చేపడతానని.. ప్రభుత్వం నుంచి దశల వారీగా వచ్చే బిల్లులు తీసుకునేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అంతేకాక ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షల్లోనే ఇంటి నిర్మాణం పూర్తయ్యేలా డిజైన్ సిద్ధం చేయించారు. ఆ కొలతల ప్రకారం ఇల్లెందు పట్టణంలో తొలి దఫా మంజూరైన 357 మంది ఇళ్లు నిర్మించాలనే నిర్ణయానికి ఇరువర్గాలు అంగీకారానికి వచ్చాయి.
అవగాహన.. ఒప్పందం
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్కు ముందుకొచ్చిన నేపథ్యాన రెండు రోజులుగా పట్టణ, మండల వ్యాప్తంగా లబ్ధిదారులను ఓ చోటుకు చేర్చి ప్రొజెక్టర్ ద్వారా ఇంటి నిర్మాణ డిజైన్.. అందుకు ఉపయోగించే సామగ్రి వివరాలపై అవగాహన కల్పించారు. దీంతో ఇల్లు మంజూరైనా చేతిలో చిల్లిగవ్వ లేక ఏం చేయాలో పాలుపోని స్థితి ఎదుర్కొన్న పేదలు సంతోషం వ్యక్తమవుతోంది. కాంట్రాక్టర్ ప్రకటించిన డిజైన్.. ప్రభుత్వం నుంచి బిల్లు వచ్చాకే తీసుకుంటానన్న మాటతో అంతా ఆనందంగా అంగీకరించారు.
మాకూ పని ఇవ్వండి
ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్ ముందుకు రాగా అవసరమైన మేసీ్త్రలను తానే సమకూర్చుకునే అవకాశముంది. కేవలం కూలీలను మాత్రమే స్థానికులను తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. దీంతో తాము ఉపాధి కోల్పోతామని స్థానిక మేసీ్త్రలు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కాంట్రాక్టర్తో చర్చించినట్లు తెలిసింది. చివరకు స్థానిక మేసీ్త్రలు కొందరికై నా అవకాశం ఇచ్చేలా చర్చలు జరుపుతుండగా.. నిర్ణయం వెలువడాల్సి ఉంది.
మూకుమ్మడిగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక
ఇల్లెందులో కట్టడానికి ముందుకొచ్చిన కాంట్రాక్టర్
పనుల అప్పగింతకు 357 మంది లబ్ధిదారుల నిర్ణయం
ఎలా సాధ్యం?
ఇంటి నిర్మాణానికి దశల వారీగా ప్రభుత్వం రూ.5లక్షలు మంజూరు చేస్తుంది. లబ్ధిదారులు ఒక్కొక్కరుగా నిర్మించుకునేందుకు సామగ్రి కొనుగోలు చేస్తే భారం పడే అవకాశముంది. అదే కాంట్రాక్టర్ 357 ఇళ్ల నిర్మాణానికి ముందుకురావడంతో సిమెంట్, ఐరన్తో పాటు విద్యుత్ సామగ్రి, దర్వాజాలు, తలుపులు, కిటికీలు ఇలాంటివన్ని మూకుమ్మడిగా కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేసే అవకాశముంది. తద్వారా ధర తగ్గి కాంట్రాక్టర్ ప్రతీ ఇంటి ఉంచి కొంత మొత్తం మిగిలే అవకాశముంది. ఇక రూ.5లక్షలకు మించి వెచ్చించగలిగే స్థోమత ఎవరికై నా ఉంటే డిజైన్లో మార్పులు, ఉపయోగించే సామగ్రిలో మార్పులు చేసి అందుకు అయ్యే అదనపు నగదు తీసుకునేలా అంగీకారం కుదుర్చుకోనున్నారు. కాగా, ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో ఇళ్ల కోసం ప్రజాపాలన సభల్లో 7,200 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని సొంత స్థలం ఉన్నవారు, స్థలం లేని వారు.. ఇలా రకరకాలుగా వర్గీకరించి 1,900 మందితో జాబితా రూపొందించారు. ఇందులో తొలి దశలో 357 మందికి ఇళ్లు మంజూరయ్యాయి. అత్యధికంగా కొన్ని వార్లుల్లో 30మంది, తక్కువగా ఇంకొన్ని వార్డుల్లో ఐదుగురు చొప్పున లబ్ధిదారులు ఉన్నారు.
మాలాంటి వారికి మేలు
ఇల్లు మంజూరైనా నిర్మాణానికి చేతిలో చిల్లి గవ్వ లేదు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇంతలోనే కాంట్రాక్టర్ ఇంటి నిర్మాణం చేసి ఇస్తామనే చర్చలు జరిగాయి. ఇదే జరిగితే మా కల నెరవేరినట్లే. ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లు కాంట్రాక్టర్కే ఇస్తాం. వేగంగా ఇల్లు కట్టించి ఇస్తే చాలు.
– స్వప్నబాయి పాసీ, కొత్త కాలనీ, ఇల్లెందు
సద్వినియోగం చేసుకోవాలి
ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారు నిర్మించుకోలేకపోతే రద్ద య్యే ప్రమాదం ఉంది. అలా జరగకుండా కాంట్రాక్టర్ను ఏర్పాటు చేసి ప్రభుత్వ లెక్కల ప్రకారం అదే నిధులతో ఇల్లు పూర్తి చేయించాలనే ఆలోచనకు వచ్చాం. ఈ అవకాశాపికప సద్విని యోగం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం.
– కోరం కనకయ్య, ఎమ్మెల్యే, ఇల్లెందు

సొంతింటి కల.. నెరవేరేలా!

సొంతింటి కల.. నెరవేరేలా!

సొంతింటి కల.. నెరవేరేలా!