క్లినిక్‌ల ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు | - | Sakshi
Sakshi News home page

క్లినిక్‌ల ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు

Jun 6 2025 6:03 AM | Updated on Jun 6 2025 6:03 AM

క్లిన

క్లినిక్‌ల ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు

భద్రాచలం అర్బన్‌: ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లు విచ్చలవిడిగా ఫీజులు దండుకుంటున్న నేపథ్యంలో గత నెల 26న ప్రచురితమైన ‘దేవుడా ఇదేం పరీక్ష’ అనే కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు ధరలు తగ్గిస్తూ ఐటీడీఏ పీఓ రాహుల్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణయించిన ధరలు మాత్రమే వసూలు చేయాలని నిర్వాహకులకు సూచించారు.

ప్రైవేట్‌ ఆస్పత్రుల తనిఖీ..

భద్రాచలం అర్బన్‌: భద్రాచలం పట్టణంలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రులను బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఈమేరకు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఓ నర్సింగ్‌హోమ్‌కు రూ.లక్ష జరిమానా విధించారు. అంతేకాక మరికొన్ని ఆస్పత్రులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. నిబంధనలకు పాటించని ప్రైవేట్‌ ఆస్పత్రులపై చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ భాస్కర్‌నాయక్‌ హెచ్చరించారు. కాగా, ఈ తనిఖీ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. సీజ్‌ చేయాల్సిన సదరు ఆస్పత్రిని ఓ రాజకీయ నాయకుడి అండతో అధికారులు జరిమానాతో సరిపుచ్చినట్లు సమాచారం.

ఆర్టీసీ డ్రైవర్‌కు రివార్డు

అశ్వాపురం: మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ మహేశ్‌ ఇటీవల అమలాపురం డ్యూటీకి వెళ్లి వస్తున్న క్రమంలో బస్సులో ఓ ప్రయాణికుడి మర్చిపోయిన రూ.లక్షను అదేరోజు డిపోలో అందించాడు. ఈ మేరకు మహేశ్‌ నిజాయితీని గుర్తించిన ఆర్టీసీ అధికారులు గురువారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ భవన్‌లో ఆర్టీసీ చైర్మన్‌ సజ్జనార్‌ చేతులమీదుగా రాష్ట్ర ఆర్టీసీ సేవా రివార్డ్‌ను అందజేసి ఘనంగా సన్మానించారు.

ఏబీడీసీ డ్రైవ్‌లు నిర్వహించాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో ఏబీడీసీ డ్రైవ్‌లు నిర్వహించాలని కలెక్టరేట్‌ జితేష్‌ వి.పాటిల్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఏబీడీసీ డ్రైవ్‌, భూభారతి రెవెన్యూ సదస్సులు, బక్రీద్‌ పండుగ ఏర్పాట్లు, ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా, బడిబాట గ్రామసభల నిర్వహణ, వనమహోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో గురువారం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. డ్రైవ్‌పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నానరు. అజోల్లా పెంపకం, బయోచార్‌, కంపోస్టింగ్‌, డిగ్గింగ్‌ సోక్‌ పిట్‌, పామ్‌ పౌండ్‌ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.

మేడేపల్లి పంచాయతీకి పురస్కారం

ముదిగొండ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మండలపరిధిలోని మేడేపల్లి గ్రామపంచాయతీ రాణించడంతో రాష్ట్రస్థాయి అవార్డు ఎంపికై ంది. పర్యావరణం పరిరక్షణకు అమలు చేసిన విధానాలు, సేంద్రియ ఎరువు తయారి, తడి,పొడి చెత్త వేరు చేయడం, వ్యర్థ పదార్థాల నిర్వహణ వంటి అంశాలను అమలు చేసినందుకు గాను ఎంపికై ంది. ఈమేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని టీజీపీసీబీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ చేతులమీదుగా పంచాయతీ కార్యదర్శి రమ్య గురువారం పురస్కారంతో పాటు ప్రశంసాపత్రం అందుకున్నారు. దీంతో మండల అధికారులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

ఐటీఐలో ప్రవేశాలకు

దరఖాస్తు చేసుకోండి

ఖమ్మంసహకారనగర్‌: నగరంలోని ప్రభుత్వ ఐటీఐలో చేరేందుకు ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ కన్వీనర్‌, ప్రిన్సిపాల్‌ ఎ.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలని, రూ.100 వెరిఫికేషన్‌ రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు.

క్లినిక్‌ల ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు1
1/2

క్లినిక్‌ల ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు

క్లినిక్‌ల ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు2
2/2

క్లినిక్‌ల ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement