
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ
అశ్వారావుపేటరూరల్: అదుపుతప్పి ఓ లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఏపీ వైపు నుంచి అశ్వారావుపేట వైపు విద్యుత్ సామగ్రి లోడుతో వస్తున్న లారీ సరిహద్దు చెక్పోస్టు వద్ద ఆగింది. ఈ క్రమంలోనే రోడ్డు పక్కన పార్కింగ్ చేసేందుకు లారీని రివర్స్ చేస్తున్న క్రమంలో అదుపుతప్పి వెనుక ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగి, వైర్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచింది. లారీ డ్రైవర్, క్లీనర్ సరక్షితంగా బయటపడ్డారు. విద్యుత్ సిబ్బంది మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునఃరుద్ధరించారు.
నాటుసారా స్వాధీనం
పాల్వంచ: ఆటోలో ఆరు లీటర్ల నాటుసారా తరలిస్తుండగా పట్టణంలోని దమ్మపేట సెంటర్ వద్ద ఎకై ్సజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భూక్యా వీరేందర్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుక్కునూరు మండలం వేలేరు గ్రామం నుంచి తీసుకొస్తుండగా పట్టుకున్నట్లు సీఐ ఎం.ప్రసాద్, ఎస్ఐ సరిత తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.