జాతీయస్థాయి రెజ్లింగ్‌ పోటీలకు గురుకుల విద్యార్థినులు | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి రెజ్లింగ్‌ పోటీలకు గురుకుల విద్యార్థినులు

Published Fri, Nov 17 2023 1:44 AM

విద్యార్థినులతో ప్రిన్సిపాల్‌ మేరీ మంజుల, పీడీ మహబూబీ  - Sakshi

విజయపురిసౌత్‌: స్థానిక డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థినులు దీపిక భువన, ప్రియాంకలు ఈ నెల 11న విజయవాడలో జరిగిన అండర్‌–19 రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీలలో బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ మేరిమంజుల గురువారం తెలిపారు. అలాగే అదే రోజు జరిగిన రెజ్లింగ్‌ పోటీలలో గౌతమి సిల్వర్‌ మెడల్‌, బ్యూలా బ్రాంజ్‌ మెడల్‌ సాధించినట్లు ప్రిన్సిపాల్‌ చెప్పారు. ఈ నెల 11న అండర్‌–19 రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలలో బి.అంజలి, స్నేహ బంగారు పతకాలు సాధించినట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు. పోటీలలో విజేతలను ప్రిన్సిపాల్‌ మేరీ మంజుల, వైస్‌ ప్రిన్సిపాల్‌ రాజ్యలక్ష్మి, పీడీ మహబూబీ, పీఈటీ నసీమ, ఉపాధ్యాయినులు చెంచు లక్ష్మి, పుష్పలీల అభినందించారు.

Advertisement
 
Advertisement