
బిందెల షెడ్డులో అగ్ని ప్రమాదం
గుత్తి: మండలంలోని బాచుపల్లి జంగాల కాలనీలో నివాసముంటున్న జంగాల పుల్లయ్యకు చెందిన బిందెల షెడ్డులో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షెడ్డులో ఉంచిన చిన్న గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తు పేలింది. దీంతో మంటలు చెలరేగాయి. షెడ్డు లోపల ఉంచిన బైక్, బిందెలతో పాటు కోళ్లూ కాలిపోయాయి. అర్ధరాత్రి కావడంతో మంటలు ఆర్పడం సాధ్యం కాలేదు. దీంతో రూ.5 లక్షలు వరకు నష్ట పోయినట్లు బాధితుడు వాపోయాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
‘కౌలు రైతుల సమస్యలు పరిష్కరించండి’
వజ్రకరూరు: ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రూ.10 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కౌలు రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ వజ్రకరూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. సంఘం నాయకులు మాట్లాడుతూ... కౌలు రైతులు గుత్తలు ముందుగానే చెల్లించి పంటలు పండిస్తున్నారన్నారు. నూతన కౌలు చట్టం అమలు చేసి కౌలు రైతులందరికీ గ్రామసభల ద్వారా సీసీఆర్సీ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాధారణ రైతులకు వర్తించే అన్ని సౌకర్యాలతో పటు ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూర్చాలన్నారు. అనంతరం డిమాండ్ల కూడిన వినతి పత్రాన్ని రెవెన్యూ అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా అద్యక్షుడు రంగారెడ్డి, జిల్లా నాయకుడు వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి కృష్ణమూర్తి, రైతుసంఘం జిల్లా ఉపాద్యక్షుడు విరూపాక్షి పాల్గొన్నారు.

బిందెల షెడ్డులో అగ్ని ప్రమాదం