
జెడ్పీలో ఆరుగురికి పదోన్నతి
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లాలోని పరిషత్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆరుగురికి పదోన్నతి కల్పిస్తూ జెడ్పీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు ల్యాబ్ అసిస్టెంట్, ఓ రికార్డు అసిస్టెంట్కు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. వీరిలో భీమయ్య (గుమ్మఘట్ట), ఫకృద్ధీన్ (సిద్దరాంపురం), లక్ష్మన్న (నాగసముద్రం), సాదిక్ బాషా (తగరకుంట), హరికృష్ణ (ముదిగుబ్బ), వెంకటేశులు (కళ్యాణదుర్గం) ఉన్నారు. వీరికి పదోన్నతుల ఉత్తర్వులను జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అందజేసి, అభినందించారు. జిల్లా పరిషత్ యాజమాన్యం కింద పనిచేసే ఉద్యోగులకు శనివారం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఈఓ వెంకట సుబ్బయ్య తెలిపారు. చైర్పర్సన్ సమక్షంలో ఉదయం 9:30 గంటలకు కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుందన్నారు.
డీసీఎంఎస్ పర్సన్ ఇన్చార్జ్గా నెట్టెం వెంకటేశులు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) పర్సన్ ఇన్చార్జ్గా నెట్టెం వెంకటేశులు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్సన్ ఇన్చార్జ్గా నెట్టెం వెంకటేశులును ప్రకటిస్తూ పాలక వర్గం ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసినట్లు డీసీఎంఎస్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.