రాజీమార్గమే శ్రేయస్కరం | - | Sakshi
Sakshi News home page

రాజీమార్గమే శ్రేయస్కరం

Jul 2 2025 5:29 AM | Updated on Jul 2 2025 5:29 AM

రాజీమార్గమే శ్రేయస్కరం

రాజీమార్గమే శ్రేయస్కరం

విశాఖ లీగల్‌: రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు అన్నారు. ఈ నెల 5న జరగనున్న మెగా లోక్‌ అదాలత్‌ సందర్భంగా.. న్యాయమూర్తి బ్యాంకు, చిట్‌ఫండ్‌ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాజీపడటానికి వీలున్న అన్ని కేసులను పరిష్కరించే దిశగా కృషి చేయాలని వారికి సూచించారు. బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న చెక్‌ బౌన్స్‌ కేసుల్లో ఇరువర్గాలు రాజీ చేసుకోవడానికి ముందుకు రావాలని కోరారు. చిట్‌ఫండ్‌ కంపెనీలు కూడా తమ పరిధిలో సాధ్యమైనంత మేరకు ఇరువర్గాలు రాజీ కుదుర్చుకోవాలని న్యాయమూర్తి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement