
నిరంతర సాధనతోనే కళల్లో ప్రావీణ్యం
ఆదిలాబాద్: నిరంతర సాధనతోనే కళల్లో ప్రావీణ్యం సాధ్యమని డీఈవో శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాల కేంద్రంలో వేసవి ఉచిత శిక్షణ శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో భాగంగా బాల కేంద్రంలో అందజేస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఇటీవల జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన పలు వురు బాలకేంద్రం చిన్నారులను సన్మానించా రు. ఇందులో బాల కేంద్రం పర్యవేక్షకుడు మిట్టు రవి, తల్లిదండ్రుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.