
యూపీఎస్సీ ర్యాంక్ సాధించడం అభినందనీయం
ఇంద్రవెల్లి: గౌడ సమజానికి చెందిన రేకుల్వార్ శుభంగౌడ్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కు ఎంపిక కావడం అభినందనీయమని తెలంగాణ మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సగౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ముత్నూర్ గ్రామంలో శుభంగౌడ్ను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. శుభంగౌడ్ ఉన్నత శిఖరాలు ఆధిరో హించాలని ఆకాంక్షించారు. నాయకులు ఆ రుకుల సంతోష్గౌడ్, సుంకరి శ్రీశైలంగౌడ్, కుంట రవి, చందర్గౌడ్, బాబాగౌడ్, లింగాల సంతోష్, శ్రీనివాస్గౌడ్, కిష్టగౌడ్, అరుణ్గౌడ్, శిరీష్కుమార్ తదితరులున్నారు.