-
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
హైదరాబాద్, మే 14, 2024: యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు సుమారు నెల రోజుల క్రితం ఓ పెళ్లిలో మటన్ తింటూ, పళ్లు లేకపోవడంతో పొరపాటున ఓ ఎముక మింగేశారు. ఆహారనాళంలో ఇరుక్కుపోయిన ఆ ఎముక.. లోపల రంధ్రం చేసి, తీవ్ర ఇన్ఫెక్షన్కు కారణమైంది. ఎదభాగం మధ్యలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆ వృద్ధుడు.. ఎట్టకేలకు ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి వచ్చారు.తొలుత నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఎండోస్కొపీ చేసి ఎముక ఉందన్న విషయాన్ని గుర్తించి, ఎల్బీనగర్ ఆస్పత్రికి పంపారు. ఇక్కడ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రాధిక నిట్టల నేతృత్వంలోని వైద్యబృందం ఆయనను క్షుణ్నంగా పరిశీలించి, తగిన పరీక్షలు కూడా చేసి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండోస్కొపిక్ ప్రొసీజర్తోనే ఎముకను అత్యంత జాగ్రత్తగా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డాక్టర్ రాధిక తెలిపారు.యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేన్ గ్రామానికి చెందిన 66 ఏళ్ల శ్రీరాములుకు దవడ పళ్లు లేవు. దానివల్ల నమలలేరు. కానీ ఒక పెళ్లికి వెళ్లి, అక్కడ మటన్ ఉండటంతో తినాలనుకున్నారు. పళ్లు లేకపోవడం వల్ల నమలకుండా నేరుగా మింగేశారు. అలా మింగినప్పుడు దాదాపు 3.5 సెంటీమీటర్ల పొడవున్న ఒక ఎముక ముక్క కూడా లోపలకు వెళ్లిపోయింది. వెళ్లిన విషయం కూడా తొలుత ఆయనకు తెలియలేదు. రెండు మూడు రోజుల తర్వాత ఛాతీలో నొప్పి అనిపించింది. స్థానికంగా వైద్యులకు చూపిస్తే అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకుని మందులు ఇచ్చారు. కానీ నొప్పి మాత్రం తగ్గలేదు. దాంతో తర్వాత నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఎండోస్కొపీ చేసి చూసి, లోపల ఎముక ఇరుక్కుందన్న విషయం చెప్పారు. అక్కడినుంచి ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి పంపారు.సాధారణంగా ఇలా ఇరుక్కున్న ఎముకలను ఎవరైనా తీసేస్తారు. కానీ, నెల రోజులుగా అది ఇరుక్కుపోవడం వల్ల ఆహారనాళానికి రంధ్రం చేసిసింది. ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ ఏర్పడి, పుండ్లు కూడా పడ్డాయి. కొంత చీము చేరింది. దానికితోడు ఇదంతా గుండెకు బాగా దగ్గరగా ఉంది. అలాంటప్పుడు తీసే సమయంలో ఏమాత్రం కొంత అటూ ఇటూ అయినా ఆహారనాళానికి పూర్తిగా రంధ్రం పడిపోయి, అది గుండెకు కూడా ప్రమాదకరంగా మారుతుంది. దీన్ని అత్యంత జాగ్రత్తగా ఎండోస్కొపీ ప్రొసీజర్లోనే తొలగించాం. లేనిపక్షంలో అక్కడ పెర్ఫొరేషన్ లాంటి మరిన్ని సమస్యలు వచ్చేవి.ఈ ప్రక్రియ చేసిన తర్వాత కూడా ఆయనకు చాలా జాగ్రత్తలు చెప్పాం. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో అన్నం తింటే ఆ మెతుకులు మళ్లీ ఇన్ఫెక్షన్ అయిన పుండ్ల వద్దకు చేరి, అక్కడ ఆగిపోయి మళ్లీ ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. అందుకే ఆయనకు కొంతకాలం పూర్తిగా ద్రవపదార్థాలు మాత్రమే తీసుకోవాలని చెప్పాం. కొబ్బరినీళ్లు, మంచినీళ్ల లాంటివి తీసుకోవాలన్నాం. ఇప్పుడు ఎముక వల్ల వచ్చిన నొప్పి ఆయనకు పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడే కొద్దిగా జొన్న అన్నం, పెరుగు అన్నం తినగలుగుతున్నారు.ఏ వయసువారైనా తినేటప్పుడు బాగా నమిలి తినాలి. ఇక కాస్త పెద్దవయసు వచ్చి, పళ్లు ఊడిపోయిన తర్వాత అయితే ఏదైనా బాగా ఉడకబెట్టుకుని, మెత్తగా అయిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఎముకలను ఎవరైనా యథాతథంగా తినకూడదు. కానీ ఈ కేసులో ఆయనకు పళ్లు లేకపోవడంతో తెలియక, పొరపాటున మింగేశారు. అది సమయానికి తియ్యకపోతే ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. ఆహారనాళానికి రంధ్రం కూడా పెద్దది అయిపోతుంది. అప్పుడు తప్పనిసరిగా మేజర్ సర్జరీ చేయాలి. చీము పడుతుంది. ఇలా ఒక నెల రోజుల పాటు ఎముక లోపల ఉండిపోవడం ఎప్పుడూ చూడలేదు” అని డాక్టర్ రాధిక నిట్టల వివరించారు. -
ఫలించిన పోలీసు వ్యూహం!
ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్ సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసుల వ్యూహం..దాదాపు రెండు నెలలుగా తీసుకున్న చర్యలు వెరసి సోమవారం చెదురుమదురు ఘటనలు మినహా పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆస్మాన్ఘడ్లోని పోలింగ్ కేంద్రంలో వివాదాస్పదంగా ప్రవర్తించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై మలక్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. నగర వ్యాప్తంగా ఉన్న, కొత్తగా ఏర్పాటు చేసిన 6 వేల సీసీ కెమెరాలను బంజారాహిల్స్లోని ఐసీసీసీకి అనుసంధానించిన అధికారులు అక్కడ నుంచి పరిస్థితులను పర్యవేక్షించారు. నగర కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి స్వయంగా అనేక పోలింగ్ బూత్లకు వెళ్లి పరిస్థితులు సమీక్షించారు. నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అందించిన సమాచారం చాలా కీలకంగా మారింది. వీటి ఆధారంగా పోలీసు విభాగం అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలను పక్కాగా గుర్తించగలిగారు. దీని ఆధారంగా బందోబస్తు ఏర్పాటు చేసుకుంటూ వెళ్లారు. దాదాపు ప్రతి అభ్యర్థితో పాటు అనుచరుల్లోనూ కీలకమైన వారిని అనునిత్యం వెంటాడటానికి నగర పోలీసులు షాడో టీమ్స్ను రంగంలోకి దింపారు. పోలింగ్ రోజున కూడా దాదాపు 100 పార్టీలు విధుల్లో ఉన్నాయి. ఫలితంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పక్కాగా చర్యలు తీసుకోగలిగారు. పోలింగ్ రోజు చివరి రెండు గంటలు అయిన మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 మధ్య సమయం అత్యంత కీలకం. ఈ వేళల్లోనే దొంగ ఓట్లు ఎక్కువగా పడటం, ఘర్షణలు చోటు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసు విభాగం ‘ఆ రెండు’ గంటలూ అత్యంత అప్రమత్తమైంది. రిజర్వ్లో ఉన్న బలగాలను సైతం ఏరియాల్లోకి పంపించి ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంది. కాగా అనేక ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడానికి పార్కింగ్ ప్రధాన కారణమైంది. -
కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో 50.2 శాతం పోలింగ్
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ సాయంత్రానికి కాస్త మెరుగుపడింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాదాపు ఒక శాతం అధికంగా పోలింగ్ జరిగింది. ఆరు నెలల క్రితం నాటి ఓటర్ల కంటే కూడా 3 వేల మంది ఓటర్ల సంఖ్య పెరగడంతో పాటు ఒక శాతం అధిక ఓటింగ్ కారణంగా పోలైన ఓటర్ల సంఖ్య దాదాపు 4 వేలు పెరగనుంది. నవంబర్లో జరిగిన ఎన్నికల్లో 49.18 శాతం మంది ఓటేశారు. సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో 50.2 శాతం మంది ఓటేసినట్లు సమాచారం. -
No Headline
మందకొడిగా పోలింగ్ పోలింగ్ నగరంలో మందకొడిగానే సాగింది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ మొదటి రెండు గంటల్లో 6 శాతం పోలింగ్ కూడా కాలేదు. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 40 శాతం నమోదైంది. పోలింగ్ ప్రశాంతం:రోనాల్డ్రాస్ హైదరాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు. అక్కడక్కడ కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ సందర్భంగా ఈవీఎంలలో కొన్ని సమస్యలు తలెత్తగా వెంటనే వాటిని సంబంధిత ఇంజనీర్స్తో సరిచేయించినట్లు తెలిపారు. మొఘల్పురా, హరిబౌలి ప్రాంతాల్లో కొన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన పోలింగ్ ప్రక్రియ పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు. అంతకుముందు మాదాపూర్లోని వెంకటేశ్వర ఫైనార్ట్స్ కాలేజీలోని పోలింగ్ కేంద్రంలో సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కంట్రోల్రూమ్ నుంచి మానిటరింగ్ జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి ఎన్నికల ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించి, కొన్ని పోలింగ్ కేంద్రాల్లోని అధికారులకు సూచనలు చేశారు. ఓటరు హెల్ప్లైన్ ఫిర్యాదు కేంద్రాన్ని, ఎంసీసీ కేంద్రంలో సిబ్బంది పనితీరును పరిశీలించారు. -
No Headline
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా మరోమారు అట్టడుగునే నిలిచింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలింగ్ శాతం పెరగలేదు. గత లోక్సభ ఎన్నికల్లో జిల్లాలో 45.65 శాతం పోలింగ్ జరగ్గా ఈసారి దాదాపు 47 శాతం నమోదైనట్లు సమాచారం. ఎండ తీవ్రత వల్ల కూడా పోలింగ్పై ప్రభావం ఉంటుందని భావించినప్పటికీ సోమవారం ఎండ లేకపోవడం కొంతమేర ఊరటనిచ్చింది. కానీ ఆశించిన మేర పోలింగ్ పెరగలేదు. ప్రతిసారీ రాజధాని నగరమైన హైదరాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం తక్కువగా ఉండటంపై కలవరపడ్డ అధికార యంత్రాంగం వాస్తవానికి ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. రెండు నెలలుగా స్వీప్ కార్యక్రమాల కింద విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. బాగా చదువుకున్నప్పటికీ, ఎన్నికల నిరక్షరాస్యులుగా మిగలొద్దని ప్రజలను కోరింది. అయినప్పటికీ ఆశించిన ఫలితం కనిపించలేదు. జాబితా ప్రక్షాళన కాకపోవడమే.. నిజానికి గతంలో కంటే నగర జనం ఎక్కువ సంఖ్యలోనే పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. ఓట్లు వేశారు. అయినప్పటికీ పోలింగ్ శాతం తక్కువగానే ఉండటానికి వివిధ కారణాలున్నాయి. ముఖ్యంగా ఓటరు జాబితా ప్రక్షాళన కాకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లున్నవారు గణనీయంగా ఉన్నారు. అలాంటి వారిని తొలగించేందుకు గత రెండు సంవత్సరాలుగా జిల్లా ఎన్నికల యంత్రాంగం పనిచేస్తున్నప్పటికీ, పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరగలేదు. దాంతో ఓటర్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నందున పోలింగ్ శాతం తక్కువగా మాత్రమే నమోదవుతోంది. తరలిన ఓటర్లు.. అటు ఏపీలో ఓట్లున్నవారిలో చాలామంది అక్కడకు వెళ్లారు. అలాంటి వారిలోనూ చాలామందికి ఇక్కడ కూడా ఓట్లున్నాయని చెబుతున్నారు. ఒకేరోజు పోలింగ్ రావడంతో ఉపాధి, వృత్తి, వ్యాపారాల కోసం ఇక్కడ ఉంటున్న వారు స్వస్థలానికే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో లక్షల సంఖ్యలో ఏపీకి ఓటర్లు తరలి వెళ్లారు. కొందరు తెలంగాణ జిల్లాల్లోని సొంత ఊర్లకు వెళ్లారు. ఇందువల్లే నగరంలో గతంలో ఇళ్లు కదలని వారు సైతం ఈసారి ఓట్లు వేసినా పోలింగ్ శాతం పెరగలేదు. నగర ప్రజలు ఓట్లేస్తున్నప్పటికీ, ఇలా వివిధ కారణాలతో ఆ మేరకు శాతం పెరగక బద్ధకస్తులనే ముద్ర తొలగిపోవడం లేదు. ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేయనంతవరకు ఈ పరిస్థితి తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్డేట్ కాని పోల్ క్యూ యాప్ పోల్ క్యూ రూట్ యాప్ ద్వారా తమ పోలింగ్ కేంద్రంలో ఎందరు క్యూలో ఉన్నారో తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికారులు ప్రకటించినప్పటికీ, చాలా పోలింగ్ కేంద్రాల వివరాలు అప్డేట్ కాలేదు. అరగంటకోమారు అప్డేట్ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ మూడు నాలుగు గంటల వరకు కూడా అప్డేట్ జరగకపోవడంతో ప్రజలకు అది ఉపకరించలేదు. -
ఎవరి లెక్కలు వారివే
బౌరంపేటలో బారులు తీరిన ఓటర్లు● బూత్ల వారీగా పోలింగ్పై అంచనాలు ● చివరి నిమిషం వరకు ఓటర్ల తరలింపులో నిమగ్నం ● గుంభనంగా తీర్పును నిక్షిప్తం చేసిన ఓటరు సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికలు ముగిశాయి. అంచనాలు ఆరంభమయ్యాయి. గ్రేటర్లోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎవరికి వారు గెలిచి తీరుతామనే ధీమాతోనే ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకొనేందుకు ఇచ్చిన హామీలు, ప్రచారతీరు, పార్టీల విధానాలు, వైఖరులు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్ధులు, అనుచరగణాలు లెక్కలు వేస్తున్నాయి. మరోవైపు స్థానికంగా నియోజకవర్గాల్లో తమకు పట్టు ఉన్న ప్రాంతాలు, సామాజిక వర్గాల వారీగా కూడా అభ్యర్థులు భవిష్యత్పైన ఆశలు పెంచుకుంటున్నారు. బలమైన ఓటు బ్యాంకులుగా భావించే వర్గాలపైన ఆశలు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే వివిధ పార్టీలు అనుసరించిన వైఖరులు కూడా తమను విజయతీరాలకు తీసుకెళ్తాయనే భావన కూడా అభ్యర్థుల్లో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని చవి చూసింది. దీంతో బీఆర్ఎస్ ఓటర్లు తమ వైపు మొగ్గుచూపుతారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల ఆ పార్టీ ఓట్లు క్రాస్ ఓటింగ్తో బీజేపీ ఖాతాలో చేరుతాయని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో గ్రేటర్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ ఓటర్లంతా ఇప్పుడు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతారనే భావన ఉంది. అదే సమయంలో గ్రేటర్లో తమకు స్థిరమైన ఓటు బ్యాంకు ఉందని, కచ్చితంగా లోక్సభ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు దక్కుతాయనే భరోసా బీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మైనారిటీల ఓట్లపై ఆశలు... బీఆర్ఎస్పై వ్యతిరేకత వల్ల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ లోక్సభ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లపైన ఆశలు పెట్టుకుంది. ఎంఐఎంతో కాంగ్రెస్కు స్పష్టమైన అవగాహన ఏర్పడింది. దీంతో మైనారిటీ ఓట్లు తమకే పడుతాయని కాంగ్రెస్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని, ఆ పార్టీ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ఎన్నికల ప్రచారం కూడా తమకు బాగా కలిసి వచ్చే అంశమని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఎస్సీ,ఎస్టీ, బీసీ, తదితర అణగారిన వర్గాల ఓట్లు గంపగుత్తగా తమ ఖాతాలోనే వచ్చిపడుతాయని కాంగ్రెస్ అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. ‘బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీకి మాత్రమే పడుతుందనే అభిప్రాయం సరైంది కాదు. అధికార కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ ఓట్లు పడే అవకాశం ఉంది.’’ అని కాంగ్రెస్ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం తాము చేపట్టబోయే ప్రాజెక్టులు కాంగ్రెస్కు సానుకూలతను తెచ్చి పెట్టాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయోధ్య రాముడు గెలిపిస్తాడా... గ్రేటర్లో యువత, ఐటీ వర్గాలు తమకు బలమైన ఓటు బ్యాంక్ అని బీజేపీ అంచనాలు వేస్తుంది. దేశ అంతర్గత భద్రతపైన మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాలు యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అదే సమయంలో మోదీ హయాంలోనే ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ట పెరిగిందనే భావన కూడా యువతలో బలంగా ఉంది. ఈ రెండు అంశాలతో పాటు అయోధ్యలో రామాలయ నిర్మాణం వల్ల హిందువుల ఓట్లు తమకే పడుతాయని బీజేపీ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. -
ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్ను రౌస్ అవెన్యు కోర్టు మరోసారి పొడిగించింది. ఆమె కస్టడీని ఆరు రోజులపాటు(మే 20) వరకు పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. తదుపరి విచారణను మే 20కు వాయిదా వేసింది.లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆమె కస్టడీ మంగళవారంతో ముగియడంతో నేడు రౌస్ అవెన్యూ కోర్టులో వర్చువల్గా హాజరుపరిచారు. 14 రోజుల పాటు కవిత జ్యుడీషియల్ కస్టడి పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, చార్జ్ షీట్ ఫైల్ చేసినట్లుగా కోర్టుకు తెలిపింది.8 వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేశామని ఈడీ చెప్పింది. దీనిపై స్పందించిన కోర్టు మే 20న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారిస్తామని తెలిపింది. ఈ క్రమంలో కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 20 వరకు పొడిగిస్తున్నట్లు స్పెషల్ కోర్టు జడ్జి వెల్లడించారు. కాగా సీబీఐ కేసులోనూ గతంలో కవితకు మే 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. మరోవైపు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. -
ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంత ఊళ్లకు వెళ్లిన నగర వాసులు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో మంగళవారం తెల్లారేసరికి నగరానికి చేరుకున్నారు. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతున్నది.చాలాచోట్ల కిలోమీటర్ల కొద్దీ వాహనాల బారులు కనిపించాయి. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బీజేఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లలో రద్దీ నెలకొంది. హైదరాబాద్ శివారుకు చేరుకున్న ప్రజలు అక్కడి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయిస్తుండడంతో మెట్రో రైళ్లు కూడా కిక్కిరిసిపోతున్నాయి.మెట్రో ప్రాంగణాలు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ముఖ్యంగా విజయవాడ వైపు నుంచి వచ్చే ప్రయాణికులు ఎల్బీనగర్ వద్ద దిగి మెట్రో ఎక్కేస్తుండడంతో ఎల్బీనగర్-మియాపూర్ రూట్ ఒక్కసారిగా రద్దీగా మారింది. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ లో టికెట్ల కోసం పెద్ద క్యూ ఉందిప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ఉదయం అరగంట ముందే అంటే 5.30 గంటలకే మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. అంతేకాదు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నేడు అదనపు ట్రిప్పులు నడిపాలని మెట్రో నిర్ణయించినట్టు తెలిసింది. -
మోకాలి గాయం వేధిస్తున్న.. ఓటేసిన కేకే
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు మోకాలి గాయం వేధిస్తున్న ఓటు హక్కు వినియోగించుకొని రాజ్యాంగ స్ఫూర్తిని చాటుకున్నారు రాజ్యసభ సభ్యులు కే. కేశవరావు. కొద్దిరోజుల క్రితమే ఆయనకు మోకాలి ఆపరేషన్ జరిగింది. ఎన్నికల నాటికి ఆయన బయటికి వచ్చి ఓటు వేస్తారో వేయరు తెలియని పరిస్థితి నెలకొంది. కానీ ఆయన వీల్ చైర్ లో బంజారాహిల్స్ లోని పోలింగ్ కేంద్రానికి ఆయన కూతురు మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటింగ్ రోజున ఇచ్చే సెలవుని ఓటు హక్కు కోసం మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. -
లిక్కర్ కేసు: నేడు కోర్టుకు కవిత
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు నేపథ్యంలో ఆమె తిహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే.కాగా, ఆమె జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలా లేదా అనే అంశంపై మంగళవారం రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ మద్యం పాలసీలో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకోవాలని ఈడీ తరఫు న్యాయవాది కోర్టును కోరే అవకాశం ఉంది. ఇలావుండగా ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. -
Telangana: 10 సీట్లు మావే..!
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కనీసం పది సీట్లలో గెలిచి సత్తా చాటుతామనే ధీమా కమలదళంలో కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ జరిగిన తీరును పరిశీలిస్తే బీజేపీ, ప్రధాని మోదీ పట్ల వివిధ వర్గాల ఓటర్లలో సానుకూలత వ్యక్తమైనట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా మహిళలు, యువత పెద్దసంఖ్యలో తమకే ఓట్లు వేశారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సిట్టింగ్ ఎంపీ సీట్లయిన సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్లను నిలబెట్టుకుంటామని.. వీటితోపాటు మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్నగర్, జహీరాబాద్, భువనగిరి, వరంగల్, నాగర్కర్నూల్, మెదక్, పెద్దపల్లి స్థానాల్లో కనీసం ఆరు సీట్లు గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిపి గెలిచే సీట్ల కంటే కూడా బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందనే విశ్వాసాన్ని ఓ ముఖ్యనేత వ్యక్తం చేయడం గమనార్హం.ప్రతీ గంటకు నివేదికలు...సోమవారం ఉదయం పోలింగ్ మొదలైనప్పటి నుంచి సాయంత్రం ముగిసే దాకా ఎప్పటి కప్పుడు ఓటింగ్ సరళిపై క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకోవడంపై రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు నిమగ్నమయ్యారు. అన్ని బూత్ల నుంచి గంటగంటకూ పోలింగ్ సరళిపై బూత్ కమి టీల ద్వారా సమాచారాన్ని తెప్పించి క్రోడీకరించారు. కొన్ని సీట్లలో ఆశించిన మేర ఓటింగ్ శాతం నమోదు కాకపోవడంతో సాయంత్రం 6 గంటల తర్వాత వెల్లడయ్యే తుది ఓటింగ్ శాతాన్ని బట్టి మళ్లీ తాజా అంచనాల్లో నిమగ్నమయ్యారు. ఎన్నికలకు ఎంతో ముందు నుంచే పార్టీ పట్ల ఓ పాజిటివ్ ప్రచారం విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లిందని, దానికి తగ్గట్టుగానే బీజేపీ అగ్రనాయకత్వం పూర్తిస్థాయిలో రాష్ట్రంలో ప్రచారంలో నిమగ్నం కావడంవల్ల ప్రయోజనం చేకూరిందని పార్టీ నేతలు చెబుతున్నారు. అదీగాక, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓట్లు వేసినా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వేస్తామనేలా వివిధ వర్గాల ఓటర్ల మనోగతం వ్యక్తమైందని, ఇవన్నీ బీజేపీ మంచి ఫలితాలు సాధించేందుకు దోహదపడతాయని ముఖ్యనేతలు భావిస్తున్నారు. పార్టీ అభ్యర్థులు కచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయని భావిస్తున్న ఎంపీ స్థానాల్లో... రాష్ట్ర పార్టీ తరఫున కొందరు నాయకులు పర్యటించి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అంచనా వేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, ఇతర పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి, వ్యాపార వర్గాలు, ఉత్తరాది, ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు బీజేపీవైపు మొగ్గు చూపినట్టు కనిపించిందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు పరిమితంగా స్టార్ క్యాంపెయినర్లు ఉండగా, జాతీయస్థాయి ఎన్నికలకు ప్రాధాన్యత కల్పించేలా పెద్దసంఖ్యలో పార్టీ ముఖ్యనేతల ప్రచారం సాగడం కలిసొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రచారంలో జాతీయ, అంతర్జాతీయ అంశాలు, దేశాభివృద్ధి, తెలంగాణ నుంచి అధికసంఖ్యలో బీజేపీ ఎంపీలను గెలిపిస్తే చేకూరబోయే ప్రయోజనాలు వంటివి ప్రస్తావించడంతో.. మిగతా పార్టీలు, బీజేపీకి ఉన్న తేడా స్పష్టంగా కనిపించిందని పార్టీ నేతలు చెబుతున్నారు. -
నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!
ఎన్టీఆర్, సాక్షి: సొంత ఊళ్లకు వెళ్లి ఓట్లేసిన ఏపీ ఓటర్లు.. తిరిగి తెలంగాణ బాట పట్టారు. దీంతో హైదరాబాద్ వచ్చే రహదారుల్లో వాహనాల రద్దీ నెలకొంది. సోమవారం సాయంత్రం ఉదయం నుంచే ఇది మొదలుకాగా.. మంగళవారం ఉదయానికి అది మరింతగా పెరిగింది.ఆంధ్రా నుంచి పెద్ద ఎత్తున్న ఓటర్లు తిరిగి తెలంగాణకు వస్తున్నారు. కార్లు, బస్సులు.. ఏ వాహనం దొరికితే అది పట్టుకొని హైదరాబాద్కు బయల్దేరారు. పతంగి టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుమారు 6 లక్షల మంది తెలంగాణ నుంచి వచ్చినట్లు ఒక అంచనా. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్గేట్ వద్ద సాధారణంగా 24 గంటల వ్యవధిలో 20 వేలకు పైగా వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్తుంటాయి. అయితే.. సోమవారం మాత్రం సాయంత్రం 6.30 గంటలకు వీటి సంఖ్య 35 వేలకు పైగా చేరింది. ఈ ఉదయం ఆ రద్దీ అంతకంతకు పెరుగుతోంది.ఇక.. ఏపీలో పోలింగ్ కోసం ఓటర్లు పోటెత్తారు. సోమవారం ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి ఓటేశారు. సాయంత్రం సైతం క్యూ లైన్లలో చాలామంది వేచి ఉండడం గమనార్హం. ఏపీలో భారీగా పోలింగ్ జరిగిందని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించగా, కడపటి వార్తలు అందేసరికి అది 78.36 శాతంగా నమోదు అయినట్లు తెలుస్తోంది. పోలింగ్ శాతం ఇంకా ఎక్కువే నమోదు కావొచ్చని సీఈవో ఎంకే మీనా ఆశాభావం వ్యక్తం చేశారు. -
డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ అధినాయ కత్వం ఊహిస్తున్నట్లే తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి సానుకూల వాతావరణం కనిపించిందని, ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రంలో బీజేపీ కొత్త రాజకీయ శక్తిగా అవతరిస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో బీజేపీకి ఓటు వేశారని, మహిళలు, యువత ఆదరించారని, పట్టణప్రాంతంలోనూ తమ పార్టీకే ఓట్లు పడ్డాయని చెప్పారు. ఓటింగ్ శాతంతో సంబంధం లేకుండా సికింద్రాబా ద్లో బీజేపీ గెలుపులో ఎలాంటి అనుమానం లేదన్నారు.పట్టణప్రాంతాల్లో పోలింగ్ కాస్త తగ్గినా.. పోలైన ఓట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. సోమవారం పోలింగ్ సమయం ముగిశాక పార్టీ కార్యాలయం లోకిషన్రెడ్డి మీడియాతో మాట్లా డారు. రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డి రెచ్చ గొట్టినా ప్రజలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారని, లేకపోతే అగ్గిరగిలేదన్నారు.సికింద్రాబాద్, ఆదిలాబాద్ తదితరచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి గోబెల్స్ ప్రచారం చేసినా బీజేపీని ప్రజ లు ఆదరించారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలకు వేసిన వారంతా.. ఈసారి బీజేపీకి మద్దతుగా నిలిచారని చెప్పారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ఓటేసిన ప్రజలు, అధికారులు, అన్ని పార్టీల కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. జూన్ 4 తర్వాత కాంగ్రెస్ హామీలపై కార్యాచరణఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ గ్యారంటీలు, హామీల అమలుకు బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసుకుని పోరాడుతుందని కిషన్రెడ్డి చెప్పారు. ‘ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగలా జరుపుకోవాలని ప్రధాని మోదీ చెప్పారని నేను చెబితే దానిపైనా ఫిర్యాదుచేశారు. మోదీ పేరు ఎత్తకుండా నిషేధం ఉందా? సీఎం రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు.ప్రతిదానికీ మోదీని చాలెంజ్ చేశారు. మోదీపై విమర్శలు గుప్పించడం ద్వారా పెద్దనాయకుడు కాలేరని ఆయన గ్రహించాలి. ప్రధాని అయ్యాక పెళ్లి చేసుకుందామని రాహుల్ అనుకున్నట్టున్నారు. ఆయన ప్రధాని అయ్యే పరిస్థితి లేదు. ఎవరు ఏమిటనేది జూన్ 4న ఫలితాలతో తేలిపోతుంది’ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు.ఓటర్ల జాబితాల్లో సంస్కరణలు తేవాలి‘ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలి. ఓటరు లిస్టును ప్రభుత్వం వెరిఫికేషన్ చేయాలి. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ లిస్టులను తనిఖీ చేసి, చనిపోయినవారి ఓట్లను తొలగించాలి. జూబ్లీహిల్స్లో ఒక వర్గం వారివి వేల ఓట్లు తొలగించారు. వేల ఓట్లను డిలీట్ అని పేర్కొన్న జాబితాను ఆదివారం రాత్రే మాకు ఇచ్చారు. కుట్రపూరితంగా ఈ తొలగింపు జరిగింది. కొన్నిచోట్ల ఓటరు స్లిప్పులు ఇచ్చినా ఓట్లు లేవని తిప్పిపంపించారు.మా అబ్బాయి ఓటు ఎక్కడో, నా ఓటు ఎక్కడో ఉంటుంది. దీనిపై కేంద్రమంత్రిగా లేఖ రాసినా చర్యలు తీసుకోలేదు. ఓటర్ల వివరాలతో ఆధార్ కార్డును అనుసంధానం చేస్తే బాగుండేది. రానున్న రోజుల్లో దీనిపై ఆలోచించి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు. విమోచన అధికారికం‘ప్రతిఏటా సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. పసుపుబోర్డు, టెక్స్టైల్ బోర్డు వంటి వాటిని మోదీ తెలంగాణకు ఇచ్చారు. మోదీ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక త్వరలోనే ఆయన చేతుల మీదుగా వీటిని ప్రారంభిస్తాం’ అని కిషన్రెడ్డి తెలిపారు. -
వందొస్తే టాప్ కాలేజీల్లో సీఎస్సీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు మరో 20 రోజుల్లో వెలువడే అవకాశముంది. ఇప్పటికే కీ విడుదల చేశారు. దీన్ని బట్టి ఎన్ని మార్కులు వస్తాయనేది విద్యార్థులకు ఓ అంచనా ఉంది. ఈ మార్కుల ఆధారంగా ఏయే ర్యాంకులు వస్తాయి? ఆ ర్యాంకుకు అనుకున్న కాలేజీలో సీటు వస్తుందా? అనే ఉత్కంఠ విద్యార్థుల్లో కన్పిస్తోంది. అయితే ఇంజనీరింగ్ ప్రశ్నపత్రం కష్టంగా లేదని, ఎక్కువ మంది అర్హత సాధించే వీలుందని నిపుణులు అంటున్నా రు. సాధారణ విద్యార్థి కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్ సబ్జెక్టుల నుంచి 40 ప్రశ్నలకు జవాబులు ఇచ్చే చాన్స్ ఉందంటున్నారు. 160 ప్రశ్నల్లో ఎక్కువ మంది 50 శాతానికి పైగానే కరెక్టు సమాధానాలు రాయవచ్చని అంచనా వేస్తున్నారు. 100 మార్కులొస్తే టాప్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ సీటు వచ్చే అవకాశముందని నిపుణులు విశ్షిస్తున్నారు. సీఎస్సీ సీటు ఈజీనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 80 వేల వరకూ సీట్లు అందుబాటులో ఉండే వీలుంది. ఇందులో 58% కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇతర కంప్యూటర్ కోర్సు సీట్లు ఉంటాయి. గత ఏడాది సివిల్, మెకానికల్, ఎలక్ట్రి కల్ బ్రాంచిల్లోని సీట్లు కాలేజీలు రద్దు చేసుకోవడం, కొత్తగా పెరిగిన సీట్ల వల్ల కంప్యూటర్ కోర్సుల సీట్లు అదనంగా 14 వేలు పెరిగాయి. కాబట్టి ఈసారి కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పొందడం తేలికేనని నిపుణులు అంటున్నారు. గత ఏడాది ఆఖరి దశ కౌన్సెలింగ్ను ప్రామాణికంగా తీసుకుంటే టాప్ కాలేజీల్లో సీఎస్సీ సీటు 4 వేల ర్యాంకు వరకూ వచ్చింది. ఈ ఏడాది కూడా ఇంచుమించు ఇదే ర్యాంకు వరకూ ఉండే వీలుందని తెలుస్తోంది. అయితే కాలేజీతో పనిలేదు కంప్యూటర్ సైన్స్ బ్రాంచిలో సీటే ప్రధానం అనుకుంటే 35 వేల ర్యాంకు వరకూ ఆ సీటు వచ్చే వీలుంది. 50 వేల ర్యాంకు దాటితే మాత్రం సీఎస్సీ సీటును ఆశించలేమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెట్లో కనీసం 40 నుంచి 50 మార్కులు తెచ్చుకుంటే ఆ విద్యారి్థకి 35 నుంచి 50 వేల ర్యాంకు వచ్చే వీలుందని చెబుతున్నారు. అదే 90 నుంచి 100 మార్కులు వస్తే 1500 నుంచి 3600 ర్యాంకు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నారు. ముందే అంచనా వేయాలిగత కొన్నేళ్ళుగా ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను పరిశీలించాలి. ఎన్ని మార్కులకు ఏ ర్యాంకు వస్తుంది? ఏ ర్యాంకు వస్తే ఏ కాలేజీలో ఏయే బ్రాంచిల్లో సీట్లు వస్తున్నాయి? అనేది ముందుగానే అంచనా వేసుకోవాలి. మొదటి దశ కౌన్సెలింగ్లో పక్కాగా సీటు వచ్చే కాలేజీని ఎంపిక చేసుకునేందుకు కొంత కసరత్తు చేసి ఆప్షన్లు ఇచ్చుకుంటే కోరుకున్న బ్రాంచిలో సీటు అవకాశం ఉంది. – ఎంఎన్ రావు (గణితశాస్త్ర సీనియర్ అధ్యాపకుడు) ఎన్ని మార్కులొస్తే.. ఎంత ర్యాంకు? మార్కులు ర్యాంకు 140పైన 100 130పైన 200 120పైన 300 110–120 800–300 100–110 1500–800 90–100 3600–1500 80–90 6000–3600 70–80 12000–6000 60–70 20000–12000 50–60 35000 – 20000 40–50 50000 – 35000 -
3 రోజులు ముందుగానే ‘నైరుతి’!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కాస్త ముందుగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా దక్షిణ అండమాన్ సముద్రంలోకి ఏటా మే 22న నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. తర్వాత వారం, పది రోజుల్లో కేరళను తాకుతాయి. ఈ ఏడాది నైరుతి మూడు రోజులు ముందే.. మే 19న దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ సోమవారం వెల్లడించింది. వచ్చే నెల ఒకటి నాటికి కేరళకు!: వచ్చే నెల ఒకటో తేదీలోగా నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది సానుకూల పరిణామమని అంటున్నారు. అయితే రుతుపవనాలు కేరళకు సకాలంలో చేరాలంటే అరేబియా సముద్రంలో అనుకూల వాతావరణం ఉండాలి. వాటి ఆగమనానికి ముందు అరేబియా సముద్రంలో అల్పపీడనం గానీ, వాయుగుండం గానీ ఏర్పడకూడదు. అలా ఏర్పడితే నైరుతి రాకను ఆలస్యం చేస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల మేరకు.. ఈ నెలాఖరులోగా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కొంత కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. మరికొన్ని రోజులైతే స్పష్టత వస్తుందని అంటున్నారు. నిజానికి గత ఏడాది నైరుతి రుతుపవనాలు మే 19నే దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. కానీ ప్రతికూల పరిస్థితుల వల్ల ఆలస్యంగా జూన్ 8న కేరళను తాకాయి. రాష్ట్రంలో రెండు రోజులు వానలు: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశంఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రానికి దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. -
TS: 64.93% పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు సాధారణ ఎన్నికలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)లో నిక్షిప్తమైంది. రాత్రి 12 గంటల వరకు వేసిన అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 64.93 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. ఉదయం నుంచే వడివడిగా..: రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. 13 మావోయిస్టు ప్రభావిత అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా అన్నిచోట్లా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. గడువు ముగిసే సమయానికల్లా పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. దీనితో సాయంత్రం 7 గంటల తర్వాత కూడా సుమారు 1,400 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగిందని సీఈఓ వికాస్రాజ్ తెలిపారు. సాయంత్రం ఏడు గంటల తర్వాత ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, శాంతిభద్రతలకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తలేదని వికాస్రాజ్ వివరించారు. 115 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో సమస్యలు వస్తే.. వాటిని మార్చామని తెలిపారు. కచ్చితమైన పోలింగ్ శాతంపై మంగళవారం స్పష్టత వస్తుందన్నారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడలేదన్నారు. వాతావరణం సహకరించడంతో.. రాష్ట్రంలో రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వానలతో వాతావరణం చల్లబడింది. దీనితో రోజంతా పోలింగ్ కొనసాగింది. ఉదయమే వడివడిగా ప్రారంభమై రోజంతా స్థిరంగా కొనసాగింది. ఉదయం 9 గంటల కల్లా 9.4 శాతం, 11 గంటలకు 24.31 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 40.38 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 52.34 శాతం, సాయంత్రం 5 గంటలకల్లా 61.16 శాతానికి, రాత్రి 12 గంటలకల్లా 64.93 శాతానికి పోలింగ్ పెరిగింది. 2019 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 62.69 శాతం పోలింగ్ నమోదైంది, నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 71.97 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి గత లోక్సభ ఎన్నికలన్నా ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. వందల కొద్దీ ఫిర్యాదులు పోలింగ్ రోజైన సోమవారం నేషనల్ గ్రీవెన్స్ పోర్టల్కు 415, టోల్ ఫ్రీ నంబర్కు 21, సీ–విజిల్ యాప్ ద్వారా 225 ఫిర్యాదులు వచ్చాయని.. వాటిపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నామని సీఈవో వికాస్రాజ్ తెలిపారు. పోలింగ్ రోజు జరిగిన వేర్వేరు ఘటనలకు సంబంధించి 38 కేసులు నమోదు చేశామన్నారు. ఇంకా కొన్ని ఫిర్యాదులపై పరిశీలన జరుగుతోందని, కేసుల సంఖ్య పెరగవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్ల గుర్తింపును తనిఖీ చేసే అధికారం అభ్యర్థులకు ఉండదని.. ఈ క్రమంలో హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఓటర్ల గుర్తింపును తనిఖీ చేసిన ఓ అభ్యర్థి (బీజేపీ అభ్యర్థి మాధవీలత)పై కేసు నమోదు చేశామని చెప్పారు. జహీరాబాద్, నిజామాబాద్లలో జరిగిన ఘటనపై సైతం కేసులు పెట్టామన్నారు. ఎన్నికలకు సంబంధించి మార్చి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.330 కోట్ల నగదు, ఇతర వస్తువులను స్వా«దీనం చేసుకున్నామని వెల్లడించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర సాయుధ బలగాలతో తొలి అంచె, రాష్ట్ర సాయుధ పోలీసు బలగాలతో రెండో అంచె, స్థానిక పోలీసులతో మూడో అంచె బందోబస్తు నిర్వహిస్తారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పరిస్థితిని సీసీ కెమెరాల ద్వారా నిరంతరం ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులను స్ట్రాంగ్ రూమ్ల వద్ద కాపలాగా పెట్టాలనుకుంటే.. వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ముగిసిన తర్వాత 45 రోజుల వరకు ఈ భద్రతా ఏర్పాట్లు కొనసాగుతాయి. ఎన్నికల ఫలితాల తర్వాత వాటిని సవాల్ చేస్తూ 45రోజుల్లోగా కోర్టులో ఎలక్షన్ పిటిషన్లు వేయడానికి అవకాశం ఉండటమే దీనికి కారణం. మళ్లీ బద్ధకించిన హైదరాబాదీలు! ఓటేసేందుకు హైదరాబాద్–సికింద్రాబాద్ జంటనగరాల ప్రజలు మళ్లీ బద్ధకించారు. రాత్రి 12 గంటలకు ప్రకటించిన పోలింగ్ శాతం అంచనాల మేరకు.. రాష్ట్రంలోనే అత్యల్పంగా హైదరాబాద్ స్థానం పరిధిలో 46.08 శాతం పోలింగ్ నమోదైంది. తర్వాత సికింద్రాబాద్ పరిధిలో 48.11 శాతం, మల్కాజ్గిరి పరిధిలో 50.12 శాతం, చేవెళ్ల పరిధిలో 55.45 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. అత్యధికంగా భువనగిరి లోక్సభ స్థానం పరిధిలో 76.47 శాతం, జహీరాబాద్ పరిధిలో 74.54 శాతం పోలింగ్ నమోదయ్యాయి. అయితే హైదరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారని.. దీనికితోడు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం పెంచడంతో.. ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని సీఈవో వికాస్రాజ్ పేర్కొన్నారు. నేడు ‘పరిశీలకుల’ఆధ్వర్యంలో ఈవీఎంల తనిఖీలు పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రిసైడింగ్ అధికారులు ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని సంబంధిత రిసెప్షన్ కేంద్రంలో అందజేస్తారు. అక్కడ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రికి ప్రాథమిక పరిశీలన నిర్వహిస్తారు. ఫారం–17సీ, ఈవీఎం, వీవీ ప్యాట్స్ను పరిశీలించి చూస్తారు. మొత్తం ఓట్లు, పోలైన ఓట్లను సరిచూసుకుంటారు. అన్నీ సవ్యంగా ఉన్నట్టు నిర్ధారించుకున్న తర్వాత ఎన్నికల పరిశీలకుడు ఈ అంశాలను ధ్రువీకరిస్తూ సంతకం చేస్తారు. తర్వాత ప్రిసైడింగ్ అధికారులను పంపించివేస్తారు. ఈవీఎంలను సంబంధిత నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తారు. కొన్నిచోట్లలోని రిసెప్షన్ కేంద్రాల్లోనే స్ట్రాంగ్ రూమ్లు ఉండగా.. మరికొన్ని చోట్ల వేరే ప్రాంతాల్లో ఉన్నాయి. అలా ఉన్న చోట కేంద్ర బలగాల భద్రత నడుమ జీపీఎస్ సదుపాయమున్న వాహనాల్లో ఈవీఎంలను తరలించి భద్రపరుస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే పోలింగ్ బృందాలు.. రిసెప్షన్ సెంటర్కు వచ్చి, అప్పగింత ప్రక్రియ పూర్తి చేసే సరికి.. మంగళవారం తెల్లవారుజాము 5 గంటల వరకు పట్టే అవకాశం ఉందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. తర్వాత మంగళవారం ఉదయం 11 గంటలకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద సాధారణ పరిశీలకులు ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రి, ప్రిసైడింగ్ అధికారుల నుంచి వచ్చిన రిపోర్టులు, డైరీలను తనిఖీ చేసి అంతా సవ్యంగా ఉన్నట్టు నిర్ధారిస్తారని వివరించారు. ఏదైనా ప్రాంతంలో రిపోలింగ్ అవసరం ఉంటే.. అప్పుడే నిర్ణయం తీసుకుంటారని, ఇప్పటివరకు అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదని వెల్లడించారు. -
12కు పైగా స్థానాల్లో బీఆర్ఎస్ ధీమా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డజనుకు పైగా లోక్సభ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చినట్లు బీఆర్ఎస్ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. సోమవారం ఉదయం నుంచి పోలింగ్ సరళిని విశ్లేషించిన పార్టీ.. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం పోగా మిగతా 16 స్థానాలకు గాను అరడజను స్థానాల్లో కాంగ్రెస్తో, మరో నాలుగు స్థానాల్లో బీజేపీతో ప్రధానంగా తలపడినట్లు లెక్క లు వేస్తోంది. ఆరు చోట్ల త్రిముఖ పోటీ నెలకొనగా వీటిలో కనీసం మూడుచోట్ల రెండు జాతీయ పార్టీ లపై బీఆర్ఎస్ పైచేయి సాధించే అవకాశమున్నట్లు భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గడం తమకు అనుకూలిస్తుందని ఆ పార్టీ విశ్లేషిస్తోంది.శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు దూరమై కాంగ్రెస్ వైపు మొగ్గుచూపిన వర్గాలు, ప్రస్తుతం బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు భావిస్తోంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ వ్యతి రేక ఓటు భారీగా బీఆర్ఎస్కు బదిలీ అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలింగ్ ప్రారంభ మైన కొద్ది గంటల తర్వాత బీఆర్ఎస్ ఓటు బీజేపీకి క్రాస్ అవుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసిందని పలువురు నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే అన్ని లోక్సభ ని యోజకవర్గాల్లోనూ పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉండటం కలిసి వచ్చే అంశంగా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. బీజేపీకి పోలైన ఓట్లతో కాంగ్రెస్ పార్టీ కే నష్టమని కూడా క్షేత్రస్థాయి నుంచి నివేదికలు అందినట్లు బీఆర్ఎస్ కీలక నేతలు చెప్తున్నారు. అర డజను సీట్లలో కాంగ్రెస్తో పోటీకాంగ్రెస్తో ఆరు స్థానాల్లో ముఖాముఖి పోటీ జరి గినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, నల్లగొండ, ఖమ్మం, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా ఉన్నట్లు అంచనాకు వచ్చారు. కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్ సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైందని చెబుతున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, భువనగిరి, మహబూబ్నగర్, చేవెళ్ల, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ల మధ్య త్రిముఖ పోటీ నెలకొన గా, వీటిలో కనీసం మూడు నుంచి నాలుగు స్థానా ల్లో గెలుస్తామనే ధీమా బీఆర్ఎస్లో కనిపిస్తోంది.కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ అధినేత కేసీ ఆర్ బస్సుయాత్ర, క్షేత్ర స్థాయిలో పార్టీ ఎమ్మెల్యే లు, నియోజకవర్గ ఇన్చార్జీలు సమన్వయంతో పని చేయడం తదితరాలు పార్టీకి అనుకూలించినట్లు భావిస్తున్నారు. రైతులు, మహిళలు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు ప్రధా నంగా అనుకూల ఓట్లు వేసినట్లు పార్టీ అంచనాకు వచ్చింది. అయితే క్రాస్ ఓటింగ్తో బీజేపీకి భారీగా లబ్ధి జరుగుతుందనే వార్తల నేపథ్యంలో బూత్ల వారీగా పార్టీ పోలింగ్ ఏజెంట్లు, కేడర్ నుంచి సమాచారం సేకరించి ఓ అంచనాకు రావాల్సిందిగా కేసీఆర్ ఆదేశించారు.కేసీఆర్తో కేటీఆర్, హరీశ్ భేటీస్వగ్రామం చింతమడకలో ఓటు వేసిన తర్వాత ఎర్రవల్లి నివాసానికి చేరుకున్న కేసీఆర్.. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళిపై పార్టీ నేతలకు ఫోన్ చేసి ఆరా తీశారు. కాగా పోలింగ్ ముగిసిన తర్వాత సోమవారం రాత్రి కేటీఆర్, హరీశ్రావులు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్తో భేటీ అయ్యారు. -
తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళి తమకు అను కూలంగానే ఉందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ఇక్కడి 17 లోక్సభ స్థానాలకు తొమ్మిది సీట్లలో విజయం ఖాయమని.. అదనంగా మరో స్థానమూ వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోమవారం పోలింగ్ ముగిసిన అనంతరం ఓటింగ్ సరళిపై లెక్కలు వేసుకున్నారు. మొత్తమ్మీద పది చోట్ల బీజేపీతో, ఆరు స్థానాల్లో బీఆర్ఎస్తో గట్టి పోటీ జరిగిందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఆరు సీట్లలో కారుతో పోరు.. రాష్ట్రంలోని ఆరు స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్తోనే ఫైట్ జరిగిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. నాగర్కర్నూల్, నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, మెదక్, పెద్దపల్లి స్థానాల్లో గులాబీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పోరు జరిగిందని చెప్తున్నారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో బీజేపీకి సంస్థాగత బలం లేకపోవడం, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ ప్రాంతాల్లో బీఆర్ఎస్ బలహీనం కాకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు.నల్లగొండ, ఖమ్మం, పెద్దపల్లి, మహబూబాబాద్లలో బీజేపీ అభ్యర్థులు బలహీనంగా ఉన్నారని.. నాగర్కర్నూల్లో కాస్త పోటాపోటీ ఉండవచ్చని పేర్కొంటున్నారు. మెదక్లో మాత్రం మూడు పారీ్టల మధ్య హోరాహోరీ పోరు జరిగిందని.. ఇక్కడ బీఆర్ఎస్ సంస్థాగతంగా బలంగా ఉన్న నేపథ్యంలో బీజేపీ మూడో స్థానంలోకి వెళుతుందని అంచనా వేస్తున్నారు. ఆ పది చోట్ల మరోలా పోటీ! రాష్ట్రంలోని పది లోక్సభ స్థానా ల్లో బీజేపీతోనే ముఖాముఖి పోరు జరిగిందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. భువనగిరి, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, ఆదిలాబాద్, మహబూబ్నగర్, జహీరాబాద్ స్థానాల్లో బీజేపీతో ప్రధాన పోటీ జరిగిందని చెప్తున్నాయి. ప్రాథమిక అంచనాల మేరకు ఇందులో కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి స్థానాల్లో గెలుపునకు కొంత దూరంలో ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.సికింద్రాబాద్, చేవెళ్ల, మహబూబ్నగర్లలో తీవ్ర పోటీ జరిగిందని.. ఆ సీట్లలో ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠగా ఉందని అంటున్నాయి. పోలింగ్ తీరుపై పరిశీలన సోమవారం జరిగిన లోక్సభ ఓటింగ్ సరళిని కాంగ్రెస్ పార్టీ నిశితంగా పరిశీలించింది. గాం«దీభవన్లోని వార్ రూం వేదికగా టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఎప్పటికప్పుడు పోలింగ్ తీరును గమనిస్తూ.. పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లకు తగిన సూచనలు చేసింది. మరోవైపు కొడంగల్లో ఓటు వేసి వచి్చన అనంతరం క్యాంపు కార్యాలయం వేదికగా సీఎం రేవంత్రెడ్డి కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని సమీక్షించారు. పార్టీ అభ్యర్థులు, కీలక నేతలతో సంప్రదిస్తూ, సూచనలిస్తూ గడిపారు.పోలింగ్ తీరుపై పరిశీలనసోమవారం జరిగిన లోక్సభ ఓటింగ్ సరళిని కాంగ్రెస్ పార్టీ నిశితంగా పరిశీలించింది. గాంధీభవన్లోని వార్ రూం వేదికగా టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఎప్పటికప్పుడు పోలింగ్ తీరును గమనిస్తూ.. పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లకు తగిన సూచనలు చేసింది. మరోవైపు కొడంగల్లో ఓటు వేసి వచ్చిన అనంతరం క్యాంపు కార్యాలయం వేదికగా సీఎం రేవంత్రెడ్డి కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని సమీక్షించారు. పార్టీ అభ్యర్థులు, కీలక నేతలతో సంప్రదిస్తూ, సూచనలిస్తూ గడిపారు.ఓటు బ్యాంకు పదిలమే!గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు వచ్చిన సుమారు 40శాతం ఓటు బ్యాంక్ పదిలంగానే ఉందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. వీలైతే మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు సుమారు 30 శాతం ఓట్లు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. అప్పుడు పార్టీకి కష్టకాలంలో లభించిన ఆ ఓటుబ్యాంకు ఇప్పుడు కచ్చితంగా మళ్లీ వచ్చి ఉంటుందని చెప్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల ఓట్లను కొంత బీఆర్ఎస్ లాగేసిందని.. ఇప్పుడు మాత్రం ఆ వర్గాలకు చెందిన మెజార్టీ ఓటర్లు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారని నేతలు అంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాల అమలు, పంద్రాగస్టుకు రుణమాఫీ చేస్తామన్న హామీలు గ్రామీణ ఓటు బ్యాంకుతోపాటు మహిళా ఓట్లను కాంగ్రెస్ వైపు తిప్పగలిగాయని చెప్తున్నారు.అయితే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కొంతమేర బీజేపీ వైపు వెళ్లిందని.. కానీ అది బీజేపీ అభ్యర్థులను గెలిపించేంత స్థాయిలో జరగలేదని, అంటే బీజేపీ ఓటు బ్యాంకు పెరిగినా ఎక్కువ సీట్లు రాబోవని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని.. 10–12 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. -
Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత
హైదరాబాద్, సాక్షి: పోలింగ్ ముగిసే సమయంలో పాత బస్తీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎంపీ అభ్యర్థులు అసదుద్దీన్ ఒవైసీ, మాధవీలతలు పోలింగ్ కేంద్రాల పరిశీలనకు ఒకే రూట్లో రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అదే సమయంలో మాధవీలతను పాతబస్తీ వాసులు కొందరు అడ్డుకున్నారు. మాధవీలతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులపై మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ యువకుల్ని అక్కడి నుంచి పంపించేశారు. -
తెలంగాణలో పోలింగ్ శాతం పెరిగింది: సీఈవో వికాస్రాజ్
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్పై మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం బాగానే ఉందని తెలిపారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 50 దాటింది. ఇక హైదరాబాద్లో మాత్రం ఎప్పటిలానే ఈసారి కూడా తక్కువగానే 20 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుగుతుందని వికాస్ రాజ్ వెల్లడించారు.ఇక రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకే తెలంగాణలో 40 శాతానికి పైగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. దీంతో 2019తో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. -
ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు
హైదరాబాద్, సాక్షి: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదైంది. పోలింగ్ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించారనే అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో.. మంగళ్ హట్ పోలీస్ స్టేషన్లో రాజాసింగ్పై కేసు నమోదు చేశారు. -
బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదైంది. పోలింగ్ బూత్లో ముస్లిం మహిళల హిజాబ్ తొలగించి.. అనుచితంగా వ్యవహరించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి.#WATCH | Telangana: BJP candidate from Hyderabad Lok Sabha constituency, Madhavi Latha visits a polling booth in the constituency. Voting for the fourth phase of #LokSabhaElections2024 is underway. pic.twitter.com/BlsQXRn80C— ANI (@ANI) May 13, 2024 దీంతో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశాల మేరకు మలక్పేట్ పోలీసులు ఆమెపై నమోదు చేసినట్లు తెలిపారు. 171c, 186, 505(1)(c)ఐపిసి, అండ్ సెక్షన్ 132 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైంది. -
సీఎం జగన్ గెలుస్తారనే నమ్మకం ఉంది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన సతీమణితో కలిసి హైదరాబాద్లోని నందినగర్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తనకు అనేకమంది మిత్రులు ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సోదరుడిలాంటివాడని, ఈ ఎన్నికల్లో ఆయన మంచి ఫలితాలు సాధిస్తారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.కాగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ రెండో సారి అధికారంలో వస్తారంటూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ‘వైఎస్ జగన్ ఏపీలో రెండోసారి సీఎం అవుతారనే సమాచారం నాకు ఉంది. షర్మిల వంటి వ్యక్తులతో ఏదీ సాధ్యం కాదు. ఒకవేళ ఎవరైనా షర్మిల వంటి వారిని అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూసినా అవి ఫలించవు’ అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ పేర్కొన్నారు.2019 ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తాం..తెలంగాణ లోక్సభ ఎన్నికలపై స్పందిస్తూ.. గతంలో ఇంతకంటే అనేక సవాళ్లతో కూడిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని గుర్తుచేశారు. 2019 ఎన్నికల్లో సాధించిన సీట్ల కన్నా ఎక్కువ గెలుస్తామనే నమ్మకం ఉందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిపార్టీ తామే గెలుస్తామంటుంది కానీ ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు.పోలింగ్ స్టేషన్ల దగ్గర కరెంటు కోతలు లేకుండా జనరేటర్లు పెట్టి ముగ్గురు ముగ్గురు అధికారులతో తెలంగాణ ప్రభుత్వం కష్టపడుతుందని సెటైర్లు వేశారు. ఆరు గ్యారంటీల్లో తెలంగాణ ప్రభుత్వం ఒక గ్యారెంటీని సగం సగం అమలు చేసిందని విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తాను ముఖ్యమంత్రినని గుర్తించాలని, ఆయన ప్రభుత్వ పనితీరుపైన దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.ఎలాంటి వివక్ష లేకుండా నిధులను కేటాయించాలి..కరెంటు కోతలు నీటి కొరతల వంటి అసలైన సమస్యలపైన రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజా సమస్యలపైన ప్రభుత్వం పని చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామచంద్ర ప్రభువుకు చెప్పినట్టు రాజా ధర్మాన్ని పాటించాలి. అన్ని రాష్ట్రాల మధ్యన ఎలాంటి వివక్ష లేకుండా నిధులను కేటాయించడం లేదా ప్రాజెక్టులు కేటాయించడం చేయలేదు. భారతదేశం మొత్తం ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ప్రజలు ఎవరికి ఓటేస్తారో నాలుగో తేదీన తేలుతుంది. పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ ప్రజలని మోసం చేస్తుంటే.. వందరోజుల నుంచి ఇక్కడ రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారు. ఈరోజు కరెంటు కోతల పైన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చినట్టుగా ఉంది.తెలంగాణ తెచ్చిన నాయకుడికే ఓటు..ఇన్వర్టర్లు జనరేటర్లు, క్యాండిల్స్, పవర్ బ్యాంకులు, చార్జింగ్ లైట్, ఇవే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలని ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలు. ఎలాంటి ప్రభుత్వం కావాలో రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశం. మన ప్రభుత్వాలని మనం నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు ఈరోజు ఓటు వేయకుండా తర్వాత నిందిస్తే లాభం లేదు. దయచేసి అందరూ బయటకు వచ్చి ఓటు వేయండి. మంచి ప్రభుత్వాలను మంచి నాయకులను మీ సమస్యలకు ప్రాతినిధ్యం వహించే వారికి ఓటు వేయండి. తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణ తెచ్చిన పార్టీకి నాయకుడు కేసీఆర్ .తెలంగాణ కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం నేను ఓటు వేశాను -
Hyderabad: వీరు తమ ఓటు తాము వేసుకోలేరు
హైదరాబాద్: గ్రేటర్పరిధిలోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ప్రధాన పారీ్టల అభ్యర్థుల్లో కొందరు తమ ఓటును తమకు వేసుకోలేని పరిస్థితి ఉంది. హైదరాబాద్ ఏఐఎంఐఎం అభ్యర్థి అసదుద్దీ¯న్ ఒవైసీ రాజేంద్రనగర్ పరిధిలోని శా్రస్తిపురంలో నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతం చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం కిందకు వస్తుంది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత నివాసం ఈస్ట్ మారేడుపల్లిలోని మహేంద్రహిల్స్లో ఉంది. ఈ ప్రాంతం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సమీర్ నివాసం జూబ్లీహిల్స్లో ఉంది. అది సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తోంది. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కుత్బుల్లాపూర్లో నివాసం ఉంటున్నారు. అది మల్కాజిగిరి లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతామహేందర్రెడ్డికి తాండూరులో ఓటుంది. ఆ ప్రాంతం చేవేళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. వీరందరూ తమ ఓటును తాము వేసుకోకుండా ఇతరులకు వేయాల్సిన పరిస్థితి ఉంది. -
ఓటేయండి.. సెల్ఫీ పంపండి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ, అలాగే తెలంగాణలోనూ లోక్సభ స్థానాలకు ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. తమ రాష్ట్రం కోసం, తమ భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సవ్యంగా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని ఎన్నికల సంఘాలు కోరుతున్నాయి. అలాగే.. సాక్షి సైతం తన వంతుగా ఓటర్లను చైతన్యం చేస్తోంది. ఈ క్రమంలోనే సెల్ఫీ ఛాలెంజ్ను నిర్వహిస్తుండగా.. మంచి స్పందన లభిస్తోంది. ఓటేసి మా బాధ్యత పూర్తి చేశాం(ఫొటోలు)ఉత్సాహంతో ఓటేశాం.. మీరూ కదలండి (ఫొటోలు) మేం ఓటేశాం.. మరి మీరో?(ఫొటోలు)మీరు చేయాల్సిందల్లా ఓటేసిన తర్వాత మీ స్మార్ట్ఫోన్తో సెల్ఫీ తీసుకుని ఈ నంబర్కు (9182729310) మీ వివరాలతో వాట్సాప్ చేయడమే. ఆ ఫొటోలను సాక్షి. కామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ‘‘నా ఉనికి ఓటుతోనే.., నా ఓటు వజ్రాయుధం’’ అని మీరు సందేశం ఇస్తే.. మీ బాధ్యతను చూపించి మరో నలుగురిని ఓటేసేలా ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నం చేస్తాం.గమనిక: పోలింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్ను అనుమతించరు. సిబ్బంది కళ్లు కప్పి తీసుకెళ్లి అక్కడ సెల్ఫీలు దిగడం నేరం. కేసు పెడతారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement