కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో 50.2 శాతం పోలింగ్‌ | Sakshi
Sakshi News home page

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో 50.2 శాతం పోలింగ్‌

Published Tue, May 14 2024 3:40 PM

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో 50.2 శాతం పోలింగ్‌

కంటోన్మెంట్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రానికి కాస్త మెరుగుపడింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాదాపు ఒక శాతం అధికంగా పోలింగ్‌ జరిగింది. ఆరు నెలల క్రితం నాటి ఓటర్ల కంటే కూడా 3 వేల మంది ఓటర్ల సంఖ్య పెరగడంతో పాటు ఒక శాతం అధిక ఓటింగ్‌ కారణంగా పోలైన ఓటర్ల సంఖ్య దాదాపు 4 వేలు పెరగనుంది. నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో 49.18 శాతం మంది ఓటేశారు. సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో 50.2 శాతం మంది ఓటేసినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
 
Advertisement