-
చేపల పడవలో దేశాలే దాటారు
ముంబై: పరాయి దేశంలో పడరాని పాట్లు పడి, యజమాని పెట్టే హింసలు భరించలేక స్వదేశం వెళ్లే సాహసం చేశారు ముగ్గురు భారతీయులు. అనుకున్నదే తడవుగా యజమాని పడవనే తమ ప్రణాళికకు ప్రధాన ఆయుధంగా వాడుకున్నారు. ఎవరికీ చెప్పకుండా దొంగచాటుగా కువైట్ నుంచి బయల్దేరి సముద్ర మార్గం గుండా నేరుగా ముంబై తీర ప్రాంతానికి చేరుకున్నారు. పుట్టినగడ్డపై కాలుమోపేలోపే పోలీసులు అరెస్ట్చేశారు. ముగ్గురు తమిళనాడు వ్యక్తుల సాహసోపేత అక్రమ అంతర్జాతీయ సముద్ర ప్రయాణ ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే తరహాలో అరేబియా సముద్ర జలాల మీదుగా ముంబైలో అడుగుపెట్టిన పాక్ ముష్కరులు మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. దీంతో సముద్రజలాల మీద గస్తీపై నీలినీడలు కమ్ముకున్నాయి. మంగళవారం ఉదయం ముంబై సమీపంలో ఈ ఘటన జరిగింది. సంబంధిత వివరాలను పోలీసులు బుధవారం వెల్లడించారు. జనవరి 28న ప్రయాణం షురూ తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల విజయ్ వినయ్ ఆంటోనీ, 29 ఏళ్ల జె.సహాయట్ట అనీశ్, రామనాథపురానికి చెందిన 31 ఏళ్ల నిట్సో డిటోలు రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కువైట్కు వెళ్లారు. వీరి వృత్తి చేపలుపట్టడం. కువైట్లోనూ అదే పనిచేసేవారు. కేరళలోని త్రివేండ్రమ్ నుంచి వీరు కువైట్కు వెళ్లారు. యజమాని నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. భారత్కు రానీయకుండా వారి పాస్పోర్టులను దాచేశాడు. ఎలాగైనా కువైట్ నుంచి బయటపడాలని నిర్ణయించుకుని అందుకు ఓనర్ చేపల బోటును ఎంచుకున్నారు. జనవరి 28వ తేదీన ప్రయాణం మొదలెట్టి సౌదీ అరేబియా, ఖతర్, దుబాయ్, మస్కట్, ఒమన్, పాకిస్తాన్ మీదుగా భారత జలాల్లోకి ప్రవేశించారు. రంగంలోకి నేవీ, పోలీసులు మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ముంబైలోని యెల్లో గేట్ పోలీస్స్టేషన్ సిబ్బంది అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ చేపట్టారు. ససూన్ డాక్ ప్రాంతంలో వీరి రాకను గమనించారు. ఈ చేపల పడవ నిర్మాణం భారతీయ పడవలతో పోలిస్తే విభిన్నంగా ఉండటంతో అనుమానమొచ్చి అడ్డుకున్నారు. అందులోని ముగ్గురికీ మరాఠా, హిందీ అస్సలు రాకపోవడం, పొడిపొడిగా ఇంగ్లిష్లో మాట్లాడుతుండటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే నేవీ అధికారులతోపాటు పోలీసులు మూడు పడవల్లో హుటాహుటిన చేరుకున్నారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది సైతం రప్పించి తనిఖీలు చేయించారు. పేలుడుపదార్థాలు ఏవీ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అక్రమంగా భారత్లోకి ప్రవేశించారంటూ పాస్పోర్టు సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదుచేసి అరెస్ట్చేశారు. ముంబైలోని కోర్టులో హాజరుపరచగా ఫిబ్రవరి 10వ తేదీదాకా పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాలిచ్చారు. విదేశీ గడ్డపై వీళ్లు ఏదైనా నేరానికి పాల్పడ్డారో తెల్సుకోండని పోలీసులకు సూచించారు. పడవలో జీపీఎస్ స్వాధీనం చేసుకున్న పడవను బాంబు స్వా్కడ్ క్షుణ్ణంగా తనిఖీచేసింది. ఒక జీపీఎస్ను గుర్తించారు. సువిశాల సముద్రంలో దారి తప్పకుండా ఉండేందుకు వారు జీపీఎస్ను ఉపయోగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీళ్లను కువైట్కు తీసుకెళ్లిన ఏజెంట్ను కెప్టెన్ మదన్గా పోలీసులు గుర్తించారు. ‘‘అబ్దుల్లా షర్హీద్ అనే మాస్టర్ దగ్గర పనిచేసేవాళ్లం. జీతాలు సరిగా ఇచ్చేవాడు కాదు. అదేంటని అడిగితే చితకబాదేవాడు. ఇదే విషయమై కువైట్లోని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశాం. ఇండియన్ ఎంబసీలోనూ మా గోడు వెళ్లబోసుకున్నాం. ఫలితం శూన్యం. అందుకే ఇలా పారిపోయి వచ్చాం’’అని ఈ ముగ్గురు పోలీసులకు చెప్పారు. వీళ్ల కుటుంబీలకు ఇప్పటికే వీరి రాక సమాచారం చేరవేశామని పోలీసులు వెల్లడించారు. -
కువైట్ పాలకుడు కన్నుమూత
దుబాయ్: కువైట్ పాలకుడు అమీర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబాహ్(86)శనివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఒక మంత్రి వెల్లడించారు. ఆయన మరణానికి గల కారణాలను మాత్రం పేర్కొనలేదు. ఉప పాలకుడిగా వ్యవహరిస్తున్న ఆయన సవతి సోదరుడు షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబేర్(83)తదుపరి పాలనా పగ్గాలు చేపడతారని తెలుస్తోంది. జబేర్కు ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన యువరాజుగా పేరుంది. నవంబర్లో షేక్ నవాఫ్ గుర్తు తెలియని కారణాలతో అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎటువంటి వార్తలు బయటకు రాలేదు. -
భారత్ శుభారంభం
కువైట్ సిటీ: ఫుట్బాల్ ప్రపంచకప్–2026 ఆసియా జోన్ రెండో రౌండ్ క్వాలిఫయింగ్ పోటీల్లో భారత్ శుభారంభం చేసింది. సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు 1–0 గోల్ తేడాతో కువైట్ జట్టును ఓడించింది. ఆట 75వ నిమిషంలో మాన్విర్ సింగ్ గోల్తో భారత్ ఖాతా తెరిచింది. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని 22 ఏళ్ల తర్వాత వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో విదేశీ గడ్డపై భారత్ తొలి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈనెల 21న ఆసియా చాంపియన్ ఖతర్ జట్టుతో భారత్ రెండో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’లో భారత్, ఖతర్, కువైట్, అఫ్గానిస్తాన్ జట్లున్నాయి. ఇంటా, బయట పద్ధతిలో జరిగే లీగ్ మ్యాచ్లు ముగిశాక గ్రూప్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మూడో రౌండ్కు అర్హత పొందుతాయి. ఇప్పటి వరకు భారత జట్టు ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో మూడో రౌండ్ కు అర్హత సాధించలేదు -
కువైట్లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం!
కువైట్ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర మీడియా, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి గారు, ఏపీఎన్ఆర్టీసీ అధ్యక్షులు మేడపాటి వెంకట్ గారు, ఏపీఎస్ఎస్డీసీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూధన్ రెడ్డి, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బీహెచ్ పాల్గొన్నారు. కువైట్ నలుమూలాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. దాదాపు 400 మందికి పైగా పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. సజ్జల భార్గవ రెడ్డి గారు మాట్లాడుతూ: జగనన్న మీద అభిమానమే మనల్ని అందరినీ ఒక చోటకు చేర్చింది. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రతి క్షణం జగనన్న కష్టపడుతున్నారు. దుష్ట చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడే జగనన్నకు మనం అందరం అండగా నిలవాలి. 175/175 టార్గెట్గా అందరం కలిసి పని చేద్దాం, మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటానని సోషల్ మీడియా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. మేడపాటి వెంకట్ గారు మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు పేదల పక్షపాతి. అనుక్షణం పేదల కోసం పాటు పడుతున్నారు.. రాష్ట్ర ప్రజలకే కాదు ప్రవాసాంధ్రులకు సైతం ఎలాంటి కష్టం వచ్చినా అన్ని విధాలా అండగా ఉన్నారు, ఎల్లప్పుడూ ఉంటారని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. చల్లా మధు సూధన్ రెడ్డి గారు మాట్లాడుతూ..ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు మన సీఎం వైఎస్ జగన్ గారు తీసుకు వచ్చారు. విద్య, వైద్య రంగానికి పెద్ద పీఠ వేయడమే కాకుండా బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్న గొప్ప నాయకుడికి మనం అందరం అండగా నిలిచి రాబోయే ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. (చదవండి: దుబాయ్లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం) -
కువైట్ బాధితురాలికి విముక్తి
కడప కార్పొరేషన్: పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పళంగికి చెందిన గరికపాటి లక్ష్మికి కువైట్లో సేఠ్ వేధింపుల నుంచి విముక్తి లభించింది. ఏపీఎన్ఆర్టీఎస్ సాయంతో ఆమె సురక్షితంగా ఇండియాకు చేరింది. గరికపాటి లక్ష్మి 8 నెలల కిందట జీవనోపాధి కోసం కువైట్ వెళ్లింది. కువైటీ ఇంట్లో పెట్టే బాధలు భరించలేక భారత రాయబార కార్యాలయానికి చేరుకుంది. అయితే అక్కడ ఎవరిని కలవాలో, ఏం మాట్లాడాలో తెలియక అయోమయంలో ఉన్న సమయంలో ఏపీఎన్ఆర్టీస్ సామాజిక కార్యకర్త రెడ్డెయ్య రెడ్డి ఆమెతో మాట్లాడి అక్కడ ఎదుర్కొన్న ఇబ్బందులను తెలుసుకున్నారు. కువైట్ ఇమ్మిగ్రేషన్, ఎంబసీ పనులు పూర్తయ్యేందుకు నెల సమయం పట్టింది. 30 రోజుల పాటు ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కో ఆర్డినేటర్ భోజన, వసతి సౌకర్యాలు కల్పించడమేగాక విమాన టికెట్, దారి ఖర్చుల కింద రూ.13 వేలు సాయం చేశారు. 14వ తేదీ తెల్లవారుజామున 4.05 గంటలకు కువైట్ నుంచి బయలుదేరిన ఆమె మధ్యాహ్నం 2.35 గంటలకు హైదరాబాద్కు చేరుకుంది. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ సీఎంవైఎస్ జగన్ సారథ్యంలో గల్ఫ్లోని ప్రవాసాంధ్రుల సమస్యలను పరిష్కరిస్తున్న ఏపీఎన్ఆర్టీఎస్ వారికి రుణపడి ఉంటానని చెప్పారు. -
కువైట్లో ఘనంగా వైఎస్సార్ వర్థంతి వేడుకలు
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి వేడుకలు కువైట్ లో జరిగాయి. వైఎస్సార్ సిపి కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆదేశానుసారం కువైట్లోని, మాలియా ప్రాంతంలో గల పవన్ ఆంధ్ర రెస్టారెంట్లోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమీటీ సభ్యుల ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అభిమానులు రాజన్న 14వ వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులు అర్పించారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు భూమి ఆకాశం ఉన్నంత వరకు మహా నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి ప్రతి తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా ఉంటారని గల్ఫ్ కో-కన్వీనర్ గోవిందు నాగరాజు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మన్నూరు చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి కుల, మత , పేద ధనిక పార్టీలకు అతీతంగా అందాయని అన్నారు. ఆ జన హృదయ నేతకు గల్ఫ్ ప్రవాసాంధ్రుల తరఫున నివాళులు అర్పించారు. తండ్రి అడుగు జాడల్లోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని.. APNRTS రీజనల్ కోఆర్డినేటర్ నాయని మహేష్ రెడ్డి, వైకాపా బీసీ ఇంచార్జ్ రమణ యాదవ్, యువజన విభాగం ఇంచార్జ్ మర్రి కల్యాణ్ తెలిపారు. స్వర్గీయ వైయస్ఆర్. మహానేత ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చి విద్య ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఒక అడుగు ముందుకేసి రాజన్న బిడ్డ రాజకీయాల్లో కూడా 4 శాతం అవకాశం కల్పించి ముస్లిం సోదరులు రాజకీయ ఎదుగుదలకు అవకాశమిస్తున్నారని.. వైఎస్ఆర్సిపీ కువైట్ కమిటీ మైనారిటీ ఇన్చార్జ్ గఫార్, మరియు షేక్ రహమతుల్లా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు అన్నాజీ రావు, అబు తురాబ్, మీడియా ప్రతినిధి ఆకుల ప్రభాకర్ రెడ్డి, సేవాదళ్ ఇంచార్జ్ గోవిందు రాజు,మైనార్టీ నాయకులు షా హుస్సేన్,మహబూబ్ బాషా,సీనియర్ నాయకులు సుబ్బారావు, యువజన విభాగం సభ్యులు ఏ బాలకృష్ణ రెడ్డి, జగనన్న యూత్ ఫోర్స్ అధ్యక్షులు, లక్ష్మి ప్రసాద్, జగనన్న సైన్యం అధ్యక్షుడు బాషా, పాటూరు వాసుదేవ రెడ్డి, అప్సర్ అలీ, పోలి గంగిరెడ్డి, బి. మహేశ్వర్ రెడ్డి, రెడ్డయ్య రెడ్డి, పి. సుధాకర్ రెడ్డి, మరియు కమిటీ సభ్యులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సోషల్ మీడియా సోదరులు పాల్గొన్నారు. (చదవండి: దుబాయ్లో ఘనంగా వైఎస్సార్ 14వ వర్థంతి వేడుకలు) -
కువైట్లో ఘనంగా వై.ఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు
కడప పార్లమెంట్ సభ్యులు వై.ఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు కువైట్లో ఘనంగా నిర్వహించారు. కువైట్ వైఎస్ అవినాష్ రెడ్డి యూత్ అసోషియేషన్ నాయకులు, ముల్లా జిలాన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ సిపీ గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు పాల్గొన్నారు. వీరితో పాటు కువైట్ వైఎస్ఆర్ సిపీ నాయకులు సహా అవినాష్ అభిమానులు బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి అవినాష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ అవినాష్ రెడ్డికి ప్రవాసాంధ్రులంటే ప్రత్యేక అభిమానమని, వాళ్ల సమస్యలు ఏవైనా ఆయన దృష్టికి వెళితే వెంటనే స్పందించి పరిష్కరించడానికి కృషి చేస్తారని గోవిందు నాగరాజు పేర్కొన్నారు. కరోనా కష్ట కాలంలో గల్ఫ్ లో ఉన్న ప్రవాసాంధ్రులను ఆదుకున్న గొప్ప వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి మైనార్టీ నాయకులు షేక్ రహమతుల్లా కొనియాడారు. -
సౌదీలో రోడ్డు ప్రమాదం... ఏపీకి చెందిన ఎన్నారై కుటుంబం మృతి
సౌదీ అరేబియాలో జరిగి శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలోఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్నారై కుటుంబం మృత్యువాత పడింది. అన్నమయ్య మదనపల్లికి చెందిన దండు గౌస్ బాషా కువైట్లోని అమెరికన్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన భార్య తబారక్ సర్వర్, ఇద్దరు కుమారులు ఏహాన్ (02), దామీల్ (ఎనిమిది మాసాలు) తో కలిసి కువైట్ నుంచి పది రోజుల క్రితం సౌదీ అరేబియా పర్యటనకు(ఉమ్రా) వచ్చారు. సౌదీలోని మక్కా, మదీన పుణ్యక్షేత్రాలను సందర్శించుకున్నారు. మదీనాలోని ప్రవక్త మసీదులో ఉమ్రా నిర్వహించి..ప్రార్థనలు చేశారు. తిరిగి కారులో కువైట్కు వెళ్తుండగా శుక్రవారం తెల్లవారు జామున ప్రమాదం చోటు చేసుకుంది. రియాధ్ నగరం నుంచి 120 కిలో మీటర్ల దూరంలో హఫ్నా రోడ్డుపై డివైడర్ను వారు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. దాంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్నికి అహుతి అయింది. కారులో ప్రయాణిస్తున్న ఈ నలుగురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను రియాధ్ సమీపంలోని రూమా ఆసుపత్రికు తరలించారు. నలుగురి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. కారులోని పాస్ పోర్టులు, ఇతరత్రా సామాన్లు పూర్తిగా కాలిపోయాయి. చనిపోయిన వారిని గుర్తించడం అక్కడి పోలీసులకు కష్టంగా మారింది. ప్రముఖ సామాజిక కార్యకర్త సిద్ధిఖ్ తువ్వూర్.. మలయాళీ సంఘం కార్యకర్తల సహాయంతో బాధితులను గుర్తించి.. వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశారు. రోడ్డు ప్రమాదం గురించి తెలిసి గౌస్ బాషా తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. కాగా గౌస్ అన్నమయ్య జిల్లా కడకడ మండల కేంద్రానికి చెందిన వారని తెలిసింది. కొన్నాళ్ళ క్రితం వీరి కుటుంబం మదనపల్లికి ఆ తర్వాత బెంగళూరులో స్ధిరపడినట్లుగా సమాచారం. గౌస్బాషా కుటుంబం బెంగళూరు నుంచి కువైట్కి వెళ్లింది. -
కువైట్లో వైఎస్ రాజశేఖరెడ్డి 74వ జయంతి వేడుకలు
-
కువైట్లో ఘనంగా రాజన్న 74వ జయంతి వేడుకలు
మహానేత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర రెడ్డి గారి 74వ జయంతి వేడుకలు కువైట్ మాలియా ప్రాంతంలో పవన్ ఆంధ్ర రెస్టారెంట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలి రెడ్డి, ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించారు. బాలిరెడ్డి, కమిటీ సభ్యులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. గారి చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలి రెఢ్డి గారు మాట్లాడుతూ.. అపర భగీరథుడు రాజన్న తన పరిపాలనలోపేద బడుగు బాలహీన వర్గాల, ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ, రైతులకు రుణ మాఫీ పథకం, ఉచిత విధ్యుత్ పథకం,పేద విద్యార్ధుల చదువు కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పధకం ఇలా ఎన్నో సంక్షేమ పధకాలను కుల మతాలకు అతీతంగా అందించి రాష్ట్ర ప్రజల మనస్సులో సంక్షేమ సారధిగ నిలిచి పోయారని కొనయాడారు. ప్రస్తుతం రాజన్న భౌతికంగా మన మధ్య లేకపోయిన నింగిన సూర్యచంద్రులు ఉన్నంత వరకు.. భూమిపై జీవరాసులు ఉన్నంత వరకు ప్రపంచం నలుమూలల ఉన్న ప్రతి తెలుగు ప్రజల గుండెలలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శాశ్వతంగా ఉంటారని తెలిపారు. గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు, కువైట్ కో కన్వీనర్ యం వీ నరసారెడ్డి మాట్లాడుతూ.. స్వర్గీయ వైఎస్స్ రాజశేఖర్ రెడ్డి గారు బతికి ఉండుంటే రాష్ట్రం ఉమ్మడిగా ఉండేదన్నారు. ఐనా రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్ ఉన్నా.. కూడా తండ్రి ఆశయ సాధన కొరకు రాజకీయాలలో వచ్చిన ముఖ్యమంత్రి అయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరింత గొప్పగా సంక్షేమ పథకాలను అందించి ప్రజల మనుసును గెలుచుకున్నారు. ఆయన తన తండ్రి కన్నా పది అడుగు ముందుకేసి కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు సంక్షేమ పధకాలు అందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పారిపాలన చూసి.. నేను కన్న కలలు నా వారసుడు.. నా ముద్దు బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నాడని స్వర్గంలో ఉన్న మహా నాయకుడు వైఎస్సార్ గారి ఆత్మ సంబరపడి ఉంటుందన్నారు. మైనారిటీ నాయకులు షేక్ రహమతుల్లా, బీసీ ఇన్చార్జ్ రమణ యాదవ్ మాట్లాడుతూ.. మహా నేత వైఎస్సార్ గారు ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చి విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే,, ఒక అడుగు ముందుకేసి రాజన్న బిడ్డ రాజకీయలలో కూడా 4 శాతం అవకాశం కల్పించి.. ముస్లిం సోదరులు రాజకీయంగా ఎదిగే అవకాశం ఇవ్వడమేగాక ఏకంగా 5 మందికి శాసనసభ టికెట్లు ఇవ్వడం జరిగింది. అందులో నలుగురు గెలవడం.. ఒకరికి ఏకంగా ఉప ముఖ్యంత్రిగా అవకాశం కల్పించి.. తాను తన తండ్రిలాగే మైనారిటీ ముస్లింల పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మన్నూరు చంద్ర శేఖర్ రెడ్డి, యువజన విభాగం ఇన్చార్జ్ మర్రి కల్యాణ్, సలహాదారులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అబ్ తురబ్, అన్నాజీ శేఖర్, ఎస్సీ ఎస్టీ విభాగం ఇన్చార్జ్ బీబియన్ సింహ, వైనార్టీ నాయకులు షా హుస్సేన్, మహుబ్ బాషా, సీనియర్ నాయకులు వైఎస్ లాజరస్, ఏవీ సుబ్బా రెడ్డి, యువజన విభాగం సభ్యులు సయ్యద్ సజ్జాద్, షేక్ సబ్దర్, జగనన్న యూత్ ఫోర్స్ అధ్యక్షులు లక్ష్మి ప్రసాద్, యన్.వీ సుబ్బారెడ్డి, జగనన్న సైన్యం అధ్యక్షుల బాషా, అరవ సుబ్బారెడ్డి, గజ్జల నరసా రెడ్డి,మణి, ప్రభాకర్ యాదవ్, నాధముణి, రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గోన్నారు. (చదవండి: లండన్లో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు ) -
SAFF ఫుట్బాల్ ఛాంపియన్ భారత్.. 9వ సారి టైటిల్ కైవసం (ఫోటోలు)
-
చాంపియన్ భారత్
బెంగళూరు: దక్షిణాసియా ఫుట్బాల్లో భారత జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్ (శాఫ్)లో తొమ్మిదోసారి భారత జట్టు చాంపియన్గా నిలి చింది. మంగళవారం జరిగిన ఫైనల్లో సునీల్ ఛెత్రి కెప్టెన్సీలోని టీమిండియా ‘పెనాల్టీ షూటౌట్’లో 5–4తో కువైట్ జట్టును ఓడించింది. కువైట్ పశి్చమ ఆసియా దేశమైనా పోటీతత్వం పెరగాలనే ఉద్దేశంతో దక్షిణాసియా టోరీ్నకి ఆ జట్టును ప్రత్యేకంగా ఆహా్వనించారు. లీగ్ దశలో కువైట్తో జరిగిన మ్యాచ్ను 1–1తో ‘డ్రా’ చేసుకున్న భారత్ తుది పోరులో మాత్రం పైచేయి సాధించింది. ఆట 14వ నిమిషంలో అల్బలూషి గోల్తో కువైట్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 39వ నిమిషంలో లాలియన్జులా చాంగ్టే గోల్తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేయలేకపోయాయి. అదనపు సమయంలోనూ స్కోరు సమంగానే ఉంది. దాంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ‘షూటౌట్’లో నిరీ్ణత ఐదు షాట్ల తర్వాత రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. ఆరో షాట్లో భారత ప్లేయర్ మహేశ్ సింగ్ గోల్ చేయగా... కువైట్ ప్లేయర్ హజిహా కొట్టిన షాట్ను భారత గోల్కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ అడ్డుకోవడంతో టీమిండియా విజయం ఖాయమైంది. విజేతగా నిలిచిన భారత జట్టుకు 50 వేల డాలర్లు (రూ. 41 లక్షలు), రన్నరప్ కువైట్ జట్టుకు 25 వేల డాలర్లు (రూ. 20 లక్షల 50 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. 9: ‘శాఫ్’ చాంపియన్షిప్ ఇప్పటివరకు 13 సార్లు జరిగింది. భారత్ తొమ్మిదిసార్లు (1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021, 2023) టైటిల్ సాధించింది. 24: ‘శాఫ్’ చాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా సునీల్ ఛెత్రి అవతరించాడు. 23 గోల్స్తో అలీ అష్ఫాక్ (మాల్దీవులు) పేరిట ఉన్న రికార్డును 24 గోల్స్తో సునీల్ ఛెత్రి అధిగమించాడు. ‘షూటౌట్’ సాగిందిలా... భారత్ స్కోరు కువైట్ సునీల్ ఛెత్రి 4 10 అబ్దుల్లా 8 సందేశ్ జింగాన్ 4 21 అలోతైబి 4 లాలియన్జులా 4 32 ఆల్దెఫీరి 4 ఉదాంత సింగ్ 8 33 మహ్రాన్ 4 సుభాశ్ బోస్ 4 44 అల్ఖాల్ది 4 మహేశ్ సింగ్ 4 54 హజిహా 8 -
భారత్ టైటిల్ నిలబెట్టుకునేనా?
బెంగళూరు: దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ తొమ్మిదోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో నేడు జరిగే ఫైనల్లో పటిష్టమైన కువైట్తో ఆడనుంది. ఈ టోర్నమెంట్లో భారత్, కువైట్లు తలపడటం ఇది రెండోసారి. లీగ్ దశలో హోరాహోరీగా జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. లెబనాన్తో జరిగిన సెమీఫైనల్లో భారత్ చక్కని ప్రదర్శనతో పెనాల్టీ షూటౌట్లో గెలిచింది. మరోవైపు బంగ్లాదేశ్తో జరిగిన మరో సెమీస్లో కువైట్ 1–0తో విజయం సాధించింది. కువైట్, లెబనాన్ పశ్చిమ ఆసియా దేశాలైనప్పటికీ పోటీతత్వం ఉండాలనే ఉద్దేశంతో నిర్వాహకులు ఈ రెండు దేశాలకు ప్రత్యేకంగా ఆహ్వానించాయి. కంఠీరవ స్టేడియంలో ప్రేక్షకుల మద్దతుతో భారత్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. సొంతగడ్డపై జరుగుతుండటం భారత్కు అనుకూలాంశమైతే... హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ ఈ ఫైనల్కు కూడా జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. పాకిస్తాన్తో జరిగిన లీగ్ మ్యాచ్లో మైదానంలోకి వెళ్లి ప్రత్యర్థి ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగడంతో ‘రెడ్ కార్డ్’తో ఓ మ్యాచ్ సస్పెన్షన్కు గురయ్యారు. దీంతో లెబనాన్ తో కీలకమైన సెమీస్ మ్యాచ్కు దూరమయ్యారు. అయితే టోర్నీ క్రమశిక్షణ కమిటీ అతనికి రెండు మ్యాచ్ల సస్పెన్షన్ విధించడంతో.... కువైట్తో అమీతుమీకి కూడా గైర్హాజరు కానున్నారు. 1: ఇప్పటి వరకు భారత్, కువైట్ జట్ల మధ్య నాలుగు మ్యాచ్లు జరిగాయి. భారత్ ఒక మ్యాచ్లో గెలిచింది. ఒక మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంది. రెండు మ్యాచ్ల్లో ఓడిపోయింది. .ట్రోఫీతో భారత జట్టు డిఫెండర్ సందేశ్ జింగాన్, కువైట్ జట్టు గోల్కీపర్ బదర్ బిన్ సానూన్ -
రణరంగాన్ని తలపించిన భారత్-కువైట్ ఫుట్బాల్ మ్యాచ్
శాఫ్ ఛాంపియన్షిప్ 2023 ఫుట్బాల్ టోర్నీలో మరో మ్యాచ్ రణరంగాన్ని తలపించింది. కొద్ది రోజుల కిందట ఇదే టోర్నీలో భారత్, పాక్ మధ్య మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లు బాహాబాహీకి దిగగా.. తాజాగా భారత్-కువైట్ మధ్య మ్యాచ్లో సేమ్ సీన్ రిపీటైంది. ఇరు జట్లకు చెందిన ముగ్గురికి రిఫరీ రెడ్ కార్డ్ జారీ చేశాడు. భారత కోచ్ ఇగోర్ స్టిమాక్, ఫార్వర్డ్ రహీమ్ అలీ, కువైట్కు చెందిన అల్ ఖలాఫ్ మార్చింగ్ ఆర్డర్లు పొందారు. 64వ నిమిషంలో భారత కోచ్కు ఎల్లో కార్డ్ (బంతిని పట్టుకుని ఆటకు ఆటంకం కలిగించాడు) ఇష్యూ చేయడంతో మొదలైన గొడవ చినికిచినికి గాలివానలా మారి ఇరు జట్ల ఆటగాళ్లు కొట్టుకునేంతవరకు తీసుకెళ్లింది. ఆట 10 నిమిషాల్లో ముగుస్తుందనగా.. భారత ఆధిక్యాన్ని (1-0) కాపాడే ప్రయత్నంలో భాగంగా భారత కోచ్ మైదానం వెలువల అత్యుత్సాహం కనబర్చాడు. దీంతో రిఫరి అతనికి రెడ్ కార్డ్ ఇష్యూ చేశాడు. How hot is it in Bengaluru? WTH is happening 🙈😂 pic.twitter.com/CMsBFesyNd — Akshata Shukla (@shukla_akshata) June 27, 2023 ఈ క్రమంలో భారత ఫార్వర్డ్ రహీమ్ అలీ తన టెంపర్ను కోల్పోయి కువైట్ ఆటగాడు అల్ ఖలాఫ్ను కిందకు తోసేశాడు. దీంతో అతనికి కూడా రెడ్కార్డ్ ఇష్యూ అయ్యింది. ఇది మనసలో పెట్టుకున్న అల్ ఖలాఫ్.. భారత ఆటగాడు సహల్ అబ్దుల్ సమద్ను నేలపైకి నెట్టడంతో గొడవ తీవ్రరూపం దాల్చింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో మ్యాచ్కు కాసేపు అంతరాయం కలిగింది. గొడవకు కారణమైన కువైట్ ఆటగాడికి కూడా రిఫరీ రెడ్కార్డ్ చూపించాడు. More chaos after Sahal is left in a heap as Kuwait try to get the ball back after a foul call. The coaching staff is involved in it as well before the ref breaks it up, but Rahim Ali is sent off! pic.twitter.com/owoXhieEfl — Anantaajith Raghuraman (@anantaajith) June 27, 2023 భారత్ సెల్ఫ్ గోల్.. మొదటి అర్ధభాగంలో సునీల్ ఛెత్రి గోల్ చేసి అందించిన ఆధిక్యాన్ని టీమిండియా కాపాడుకోలేకపోయింది. అదనపు సమయంలో భారత ఆటగాడు అన్వర్ అలీ సెల్ఫ్ గోల్ చేయడంతో మ్యాచ్ 1-1తో డ్రా అయ్యింది. ఈ మ్యాచ్ డ్రా కావడంతో గోల్స్ డిఫరెన్స్ కారణంగా కువైట్ గ్రూప్ టాపర్గా నిలిచింది. భారత్ రెండో స్థానంలో సరిపెట్టుకుంది. కువైట్ ఆటగాళ్లు అత్యుత్సాహం.. భారత డగౌట్పై దాడి భారత్ సెల్ఫ్ గోల్తో మ్యాచ్ సమం అయ్యాక కువైట్ ఆటగాళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. భారత డగౌట్పై దాడి చేశారు. దీంతో రిఫరీ వారికి రెండు పసుపు కార్డులు జారీ చేశాడు. -
20 ఏళ్ల క్రితం కువైట్కు వెళ్లింది.. ఇప్పుడు భారత్కు తిరిగొచ్చింది
తూర్పు గోదావరికి చెందిన మూరి పద్మావతి(64) దీనగాధ ఇది.. 20 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ఆమె కువైట్కు వెళ్లింది. అయితే ఓ కంపెనీ చేసిన ఫ్రాడ్వీసా కారణంగా ఆమె అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. కువైట్లో బట్టలు అమ్మి జీవనం సాగించేది. కరోనా సమయంలో అనారోగ్యానికి గురై,రెసిడెన్సీ కూడా లేని కారణంగా ఆసుపత్రికి కూడా పోలేని పరిస్ధితిలో బంధువులు ఎవరూ లేక చాలా ఇబ్బందులు పడింది. అదే సమయంలో బొంబాయికి చెందిన మహమ్మద్ యూనుస్ అనే యువకుడు అన్నీ తానై సొంత తల్లిలా చూసుకున్నాడు. పద్మావతి విషయం వైఎస్సార్సీపీ కువైట్ సీనియర్ నాయకులు ఆకుమూర్తి లాజరస్.. APNRTS డైరెక్టర్ ఇలియాస్ బి.హెచ్. కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, APNRTS రీజినల్ కో ఆర్డినేటర్ నాయని మహేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఎంబసీ అధికారుల సహాయంతో భారత్కు పంపించారు. ఈ సందర్భంగా ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఇన్నేళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉందని, ఈ సందర్భంగా అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. -
విదేశీయులకు షాకిచ్చిన కువైట్.. 66 వేల డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు
మోర్తాడ్ (బాల్కొండ): వలస కార్మికులకు విస్తృతమైన ఉపాధి అవకాశాలను కల్పించిన కువైట్.. డ్రైవింగ్ లైసెన్స్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి విదేశీయులకు జారీ చేసిన లైసెన్స్లలో ఏకంగా 66 వేల లైసెన్స్లను రద్దు చేసింది. ఇంకా అనేక మంది లైసెన్స్లు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త నిబంధనలతో ఇతరులతో పాటు తెలుగు రాష్ట్రాల వలస కారి్మకులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడనున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రెండు రాష్ట్రాలకు చెందిన అనేకమంది అరబ్బులకు డ్రైవర్లుగా పని చేస్తున్నారు. అలాగే సేల్స్మెన్ కమ్ డ్రైవర్లుగా కూడా అనేక మంది వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి వారికి జారీ చేసిన లైసెన్స్ల విషయంలో కువైట్ ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. సేల్స్మెన్లు కేవలం అదే పని చేయాలని, డ్రైవింగ్ ఎలా చేస్తారని ప్రశి్నస్తూ గతంలో జారీ చేసిన లైసెన్స్లను బ్లాక్ లిస్ట్లో ఉంచారని సమాచారం. మరోవైపు కంపెనీలను నిర్వహిస్తున్నవారు సొంతంగా వాహనాలను కొనుగోలు చేసి డ్రైవింగ్ లైసెన్స్లను పొందారు. వీరి ఆదాయం కూడా పరిగణనలోకి తీసుకుని సంతృప్తికరంగా ఉంటేనే లైసెన్స్లను కొనసాగించనున్నారు. కొన్నేళ్ల కిందట డ్రైవింగ్ లైసెన్స్లను విచ్చలవిడిగా జారీ చేయడంతో కొన్ని దుష్పరిణామాలు చోటు చేసుకున్నాయని గుర్తించిన కువైట్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకుందని అక్కడ నివసిస్తున్న తెలంగాణ వాసులు కొందరు వెల్లడించారు. దిద్దుబాటులో భాగంగా సొంత కారు ఉండి డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే మన కరెన్సీలో కనీసం రూ.1.50 లక్షల వేతనం ఉండాలనే నిబంధన అమలులోకి తీసుకువచ్చారు. తక్కువ వేతనం అందుకుంటున్నవారికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసి ఉంటే దానిని రద్దు చేశారు. కాగా తప్పుడు ఆధారాలతో డ్రైవింగ్ లైసెన్స్లు పొందినవారు కూడా ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చదవండి: అప్సర కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. నేడు కోర్టుకు సాయికృష్ణ -
ఒక్క ఓవర్లో 46 పరుగులు.. క్రికెట్ చరిత్రలో తొలిసారి
క్రికెట్లో ఒక్క ఓవర్లో సాధారణంగా అత్యధికంగా ఎన్నిపరుగులు వస్తాయంటే టక్కున వచ్చే సమాధానం 36. అది కూడా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదితే ఈ ఫీట్ నమోదవుతుంది. ఒకవేళ మరో నోబాల్.. లేదా వైడ్ వెళితే కొన్ని పరుగులు జత అవుతాయి. అది కూడా అరుదుగా జరుగుతుంది. అందుకే 36 పరుగులే ఇప్పటివరకు చాలాసార్లు అత్యధికంగా ఉంది. కానీ ఒక్క ఓవర్లో 46 పరుగులు వచ్చాయంటే మీరు నమ్ముతారా.. అంత లేదు అని తేల్చేస్తాం. కానీ ఒక్క ఓవర్లో 46 పరుగులు బాదిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఊహించుకోవడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అరుదైన దృశ్యం.. కువైట్ వేదికగా జరిగిన కేసీసీ ఫ్రెండ్స్ మొబైల్ టి20 ఛాంపియన్స్ ట్రోఫీ 2023లో ఇది జరిగింది. ఎన్సీఎమ్ ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ టాలీ సీసీ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ అద్బుతం ఆవిష్కృతమైంది. ఎన్సీఎమ్ బ్యాటర్ వాసు.. టాలీ సీసీ బౌలర్ హర్మన్ ఓవర్ను చితకబాది 46 పరుగులు రాబట్టాడు. తొలి బంతిని నోబాల్ వేయగా సిక్సర్ బాదాడు. దీంతో ఏడు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఫ్రీహిట్కు నాలుగు పరుగులు బైస్ రూపంలో వచ్చాయి. ఒక్క బంతి కరెక్ట్ వేయగా 11 పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి ఐదు బంతులను ఐదు సిక్సర్లు కొట్టగా ఇందులో ఒక నోబ్ సహా మొత్తం 31 పరుగులు వచ్చాయి. దీంతో ఐదు బంతుల్లో స్కోరు 42గా మారింది. ఇక ఆఖరి బంతిని బౌండరీ రావడంతో అలా ఆరు బంతుల్లో 46 పరుగులు వచ్చాయి. క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో 46 పరుగులు రావడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వన్డేల్లో 36.. టెస్టుల్లో 35.. టి30ల్లో 36.. ఐపీఎల్లో 37.. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు వన్డేల్లో ఒక్క ఓవర్లో 36 పరుగులు అత్యధికంగా ఉంది. 2006లో సౌతాఫ్రికా ఓపెనర్ గిబ్స్ నెదర్లాండ్స్పై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదగా.. 2021లో అమెరికా బ్యాటర్ జస్కరన్ మల్హోత్రా పపువా న్యూ గినియాపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది 36 పరుగులు రాబట్టాడు. ఇక టెస్టుల్లో 2022లో ఇంగ్లండ్పై టీమిండియా బౌలర్ బుమ్రా కొట్టిన 35 పరుగులు ఇప్పటివరకు ఒక్క ఓవర్లో అత్యధికంగా ఉంది. ఇక టి20ల్లో ఒక్క ఓవర్లో అత్యధిక పరుగులు రెండుసార్లు నమోదయ్యాయి. తొలిసారి 2007లో యువరాజ్ ఇంగ్లండ్పై 36 పరుగులు(ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు), 2021లో విండీస్ హిట్టర్ పొలార్డ్ శ్రీలంకపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది 36 పరుగులు రాబట్టాడు. ఇక ఐపీఎల్లో ఒక్క ఓవర్లో అత్యధిక పరుగులు 37గా ఉంది. తొలిసారి 2011లో ఆర్సీబీతో మ్యాచ్లో కొచ్చి టస్కర్స్ బౌలర్ పి. పరమేశ్వరన్ ఒక్క ఓవర్లో 37 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత 2021లో ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ సీఎస్కేతో మ్యాచ్లో ఒక్క ఓవర్లో 37 పరుగులు ఇచ్చుకోవడం గమనార్హం. Getting 46 runs in an over is not possible right? Right? Wrong! Watch this absolute bonkers over now. . .#KCCT20 pic.twitter.com/PFRRivh0Ae — FanCode (@FanCode) May 3, 2023 చదవండి: గమనించారా.. మ్యాచ్తో పాటు పాత పగను కూడా! -
విజయవాడ–కువైట్ విమాన సర్విస్ ప్రారంభం
గన్నవరం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) నుంచి కువైట్కు ఎయిరిండియా విమాన సర్విస్లు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తిరుచినాపల్లి నుంచి ఇక్కడికి వచ్చిన బోయింగ్ 737–800 విమానం ఉదయం 9.55 గంటలకు బయలుదేరి కువైట్ వెళ్లింది. ఈ విమానం కువైట్ నుంచి రాత్రి 8.35 గంటలకు ఇక్కడికి చేరుకుంది. ఈ విమానం ప్రతి బుధవారం తిరుచినాపల్లి నుంచి వయా గన్నవరం మీదుగా కువైట్కు వెళ్లి వస్తుందని ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు. ప్రయాణికులకు ‘ఎయిరిండియా’ షాక్ ఈ విమాన సర్విస్లో కువైట్ వెళ్లాల్సిన 17 మందికి ఎయిరిండియా షాక్ ఇ చ్చింది. తొలుత ఈ సర్విస్కు బుక్ చేసుకున్న ప్రయాణికులకు విమానం బయలుదేరే సమయం మధ్యాహ్నం 1.10 గంటలుగా తెలిపింది. తర్వాత విమానం బయలుదేరే సమయాన్ని ఆ సంస్థ ఉదయం 9.55 గంటలకు రీషెడ్యుల్ చేసింది. రిషెడ్యూల్ చేసిన విషయం తెలియకపోవడంతో వారంతా మధ్యాహ్నం 11 గంటలకు ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అప్పటికే విమానం కువైట్కు బయలుదేరిన విషయం తెలుసుకుని షాక్కు గురయ్యారు. దీనిపై ఎయిరిండియా ప్రతినిధులను గట్టిగా ప్రశ్నించారు. కువైట్కు వెళ్లడానికి తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అయితే విమాన ప్రయాణ సమయం రీషెడ్యూల్ చేసిన విషయాన్ని సమాచారం రూపంలో సదరు ప్రయాణికుల సెలఫోన్లకు పంపినట్లు ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు. అయితే సదరు ప్రయాణికులు సెల్ నంబర్లు బుకింగ్ ఏజెంట్లు, కువైట్ నంబర్లు ఇవ్వడం వల్ల సమాచార లోపం ఏర్పడిందన్నారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు వచ్చే వారం కువైట్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధులు తెలిపారు. -
కువైట్లో రోడ్డు ప్రమాదం.. కృష్ణంపల్లె వాసి మృతి
పోరుమామిళ్ల : మండలంలోని చల్లగిరిగెల పంచాయతీ క్రిష్ణంపల్లెకు చెందిన గోపవరం జయరామిరెడ్డి (40) కువైట్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సంఘటన జరిగి మూడు రోజులవుతున్నా సరైన సమాచారం లేదని మృతుడి తమ్ముడు దశరధరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశరధరామిరెడ్డి కథనం మేరకు జయరామిరెడ్డి కువైట్లో లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆయన భార్య 9 సంవత్సరాల క్రితం క్యాన్సర్తో మృతి చెందింది. ఆయనకు రాముకార్తీక్రెడ్డి(14), తునుషి కౌసల్య(10) ఇద్దరు పిల్లలు. మూడు రోజుల క్రితం బస్తాల లోడుతో వెళుతున్న జయరామిరెడ్డి లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది.లారీలో ఉన్న జయరామిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్నవారిలో ముగ్గురు మృతి చెందారు., మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం గురించి, జయరామిరెడ్డి మృతి గురించి కానీ ఇక్కడకు ఎవ్వరూ సమాచారం ఇవ్వలేదు. జయరామిరెడ్డి రెండు రోజులు ఫోన్ చేయకపోవడంతో దశరధరామిరెడ్డి ఫోన్ చేయడంతో విషయం తెలిసింది. జయరామిరెడ్డి ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి ఆయన ప్రమాదంలో చనిపోయారని అరబిక్లో చెప్పాడు. దశరధరామిరెడ్డి కూడా గతంలో కువైట్లో ఉన్నందున భాష తెలిసి అన్న మృతి చెందాడని అర్థం చేసుకున్నాడు. అన్న పని చేస్తున్న సేట్కు ఫోన్ చేశాడు. సేట్ ప్రమాదంలో జయరామిరెడ్డి చనిపోయాడని, మృతదేహం ఆసుపత్రిలో ఉందని, ప్రాసెస్ పూర్తయితే ఇండియాకు పంపిస్తానని చెప్పాడు. రెండు రోజులుగా సేట్ నుండి ఎలాంటి సమాచారం లేదని, ఫోన్ చేస్తే ప్రాసెస్ జరుగుతున్నదని మాత్రమే చెపుతున్నాడని దశరథరామిరెడ్డి వివరించాడు. కువైట్లో ఉన్న ఆంధ్రా ఎంబసీకానీ, ఆంధ్రా వ్యక్తులు కానీ అందుబాటులోకి రావడం లేదని, సరైన సమాచారం ఎవ్వరూ చెప్పడం లేదని దశరధరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మృతదేహం ఎప్పుడు పంపిస్తారు? ప్రమాదంపై కేసు నమోదు చేశారా? కేసు ఏమని రాశారు? తదితర సమాచారం ఏమీ తెలియడం లేదని బంధువులు చెబుతున్నారు. -
ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ ఏంటో తెలుసా..?
అత్యంత విలువైన కరెన్సీ అనగానే యూఎస్ డాలర్, బ్రిటిష్ పౌండ్, యూరో వంటివి మన మదిలో మెదులుతాయి. కానీ ఇవేవీ కాకుండా 2023 సంవత్సరంలో అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్ నిలిచింది. మన రూపాయితో పోల్చుకుంటే దినార్ విలువ రూ.266.64కు చేరింది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండటం వల్లే కువైట్ దినార్ అత్యంత విలువైన కరెన్సీగా కొనసాగుతోంది. ప్రపంచంతో ఎక్కువగా ట్రేడింగ్ జరిగేది యూఎస్ డాలర్లలోనే కాబట్టి అదే అత్యంత విలువైన కరెన్సీ అనుకుంటుంటాం. అయితే వాస్తవం ఏంటంటే.. మనకు తెలిసిన యూఎస్ డాలర్ యూరో, బ్రిటిష్ పౌండ్లతో పాటు ప్రపంచంలో అనేక కరెన్సీలు ఉన్నాయి. వాటిలో కొన్ని చవకైనవి కాగా మరికొన్ని చాలా విలువైనవి. యూఎస్ డాలర్ కంటే విలువైన కరెన్సీలు ఉన్నాయి. అందులో కొన్ని ప్రస్తుతం మన రూపాయితో పోల్చుకుని చూస్తే.. కువైట్ దినార్ రూ.266.64, బెహ్రెయిన్ దినార్ రూ.215.90, ఒమన్ రియాల్ రూ.211.39, జోర్డాన్ దినార్ రూ.114.77, బ్రిటిష్ పౌండ్ రూ.99.68, గిబ్రాల్టర్ పౌండ్ రూ.99.40, కేమన్ డాలర్ రూ.98.02, యూరో రూ.88.34, స్విస్ ఫ్రాంక్ రూ.88.04, యూఎస్ డాలర్ రూ.81.36గా కొనసాగుతోంది. చదవండి: భారీగా పన్ను భారం తగ్గించే ఈ 7 అలెవెన్సుల గురించి మీకు తెలుసా? -
కువైట్ వెళ్లేవారికి కొత్త నిబంధన.. వలస కార్మికులు ఆవేదన
మోర్తాడ్(బాల్కొండ): మనదేశం నుంచి వెళ్లే వారికిగాను కువైట్ వీసా నిబంధనలను సవరించింది. కువైట్ నుంచి వీసాలు జారీ అయిన తరువాత అవి అసలువో నకిలీవో తేల్చడానికి ఆ దేశ కాన్సులేట్ల పరిశీలన కోసం పంపాల్సి ఉంది. ఈ కొత్త నిబంధన పదిహేను రోజుల కింద అమలులోకి వచ్చింది. వీసాలను కాన్సులేట్ పరిశీలన కోసం పంపడం వల్ల కాలయాపనతో పాటు ఆర్థికంగా భారం పడుతుందని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కువైట్లో ఉపాధి పొందాలనుకునే వారు లైసెన్స్డ్ ఏజెన్సీలు, లేదా తమకు తెలిసిన వారి ద్వారా వీసాలను పొందిన తరువాత పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) తీసుకోవాల్సి ఉంటుంది. గల్ఫ్ దేశాల్లో ఒక్క కువైట్కు మాత్రమే పీసీసీ తప్పనిసరి అనే నిబంధన ఉంది. వీసా కాపీల పరిశీలనను ఇప్పుడు అదనంగా చేర్చారు. కువైట్ నుంచి వీసాలను ఆన్లైన్లోనే జారీ చేస్తున్నారు. ఈ వీసాలు అన్ని కువైట్ విదేశాంగ శాఖ ద్వారానే జారీ అవుతున్నాయి. విదేశాంగ శాఖ ఆమోదంతోనే వీసాలు జారీ కాగా, వాటిని మరోసారి తమ కాన్సులేట్ల్లో పరిశీలనకు పంపాలని కువైట్ ప్రభుత్వం సూచించడం అర్థరహితమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఢిల్లీ, ముంబైలోనే కాన్సులేట్లు కువైట్ విదేశాంగ శాఖకు సంబంధించిన కాన్సు లేట్లు ఢిల్లీ, ముంబైలలోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కువైట్కు భారీగానే వలసలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కాన్సులేట్ ఏర్పాటు చేయాలని కొన్ని సంవత్సరాల నుంచి వలస కార్మికులు కోరుతున్నారు. కువైట్ ప్రభుత్వం గతంలో సానుకూలంగా స్పందించినా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. కువైట్ ప్రభుత్వం కొత్త నిబంధన అమల్లో తీసుకురావడంతో కాన్సులేట్ హైదరాబాద్లో ఏర్పాటు చేయాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. (క్లిక్ చేయండి: లే ఆఫ్స్ దెబ్బకి భారత ఐటీ ఉద్యోగుల విలవిల) -
షాకింగ్ వీడియో.. సింహాన్ని చేతుల్తో మోసుకెళ్లిన మహిళ..
అడవి జంతువులను చూస్తే సాధారణంగా ఎవరికైనా భయం వేస్తోంది.దాని కంటపడితే ప్రాణాలతో బయటపడటం దాదాపు అసాధ్యం.అడవికే రాజు అయిన సింహాన్ని చూసి ఏ జంతువైనా భయంతో వణికిపోతుంది. సింహాలు ప్రమాదకరమైనది. చాలా శక్తివంతమైనవి. నచ్చిన జంతువును వెంటాడి ఆహారం చేసుకోవడంలో అవి దిట్ట. అంతటి క్రూరమైన సింహాన్ని ఓ మహిళ ఎలాంటి బెరుకు లేకుండా చేతుల్తో మోసుకొని వెళ్లింది. వినడానికి నమ్మశక్యంగా అనిపించకపోయినా దీనికి సంబంధించిన వీడియోను యానిమల్స్ పవర్స్ అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 10 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో మహిళ తన రెండు చేతులతో బలవంతంగా సింహాన్ని ఎత్తుకొని వీధిలో నడుస్తూ కనిపించింది. ఆమె చేతిలో నుంచి సింహం తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా మహిళ ఇంకాస్తా గట్టిగా దాన్ని పట్టుకొని తీసుకెళ్లింది. అయితే ఇది పాత వీడియో కాగా ప్రస్తుతం మరోసారి నెట్టింట్టా చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు షాక్కు గురవుతున్నారు. మహిళ తెగవను ప్రశంసిస్తూ వండర్ వుమెన్ అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు.. ‘అది పిల్లి, కుక్క కాదు సింహం.. దానితో కాస్తా జాగ్రత్తగా వ్యహరించండి’ అంటూ సలహా ఇస్తున్నారు. కాగా ఈ సంఘటన కువైట్ వీధుల్లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సింహాం మహిళ పెంపుడు జంతువని.. కువైట్ సిటీలో తప్పించుకుని నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. View this post on Instagram A post shared by Animal Power (@animals_powers) -
ఏడుగురికి ఉరి శిక్ష..షాక్లో మానవ హక్కుల సంఘాలు
కువైట్, సౌదీ అరేబియా దేశాల్లో చాలా దారుణంగా ఉరిశిక్షలు అమలు చేస్తుంటారు. అంతర్జాతీయ మానవహక్కుల నుంచి ఎన్ని విజ్క్షప్తులు వచ్చినా తమ ధోరణి తమదే అన్నట్లుగా ఆయా దేశాలు శిక్షలు అమలు చేస్తాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం కువైట్ కోర్టు హత్యకు పాల్పడినందుకు ఏడుగురికి మరణ శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. 2017 నుంచి కువైట్లో ప్రముఖ మానవ హక్కుల సంఘాల నుంచి ఉరిశిక్ష రద్దు విషయమై విజ్క్షప్తులు వచ్చినా వాటిని పక్కన పెట్టి మరీ ఈ మరణ శిక్షను ఖరారు చేసింది. ప్రస్తుతం మరణ శిక్ష విధించబడిన వారిలో కువైట్కి చెందిన ఒక మహిళ, ఇద్దరు పురుషులు, ఒక సిరియన్, ఒక పాకిస్తానీ ఉన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నేరానికి గానూ సౌదీ అరేబియా పాకిస్తాన్ పౌరులను ఉరితీసినట్లు వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఇదే విధంగా గతంలో సంపన్న గల్ఫ్ దేశంలో జనవరి 25, 2017న ఒక రాజకుటుంబానికి చెందిన ఒకరితో సహా సుమారు ఏడుగురిని ఒకే రోజు ఉరితీయడం పెద్ద పెద్ద కలకలం రేగింది. అప్పటి నుంచి ఉరిశిక్షలు విషయంలో ఆయా దేశాలను పునారాలోచించమంటూ మానవ హక్కుల సంఘాలు అభ్యర్థించాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణమైన ఘటన విషయమై ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ తక్షణమే తాత్కాలికంగా ఉరి శిక్షలను నిలిపివేయాలని కోరింది. ఈ శిక్ష అంతిమ అమానవీయ, అవమానకరమైన శిక్షలుగా పేర్కొంది. అంతేగాదు అమ్మెస్టీ డిప్యూటీ రీజినల్ డైరెక్టర్ అమ్నా గుయెల్లాలీ ఈ ఉరిశిక్షలను తక్షణమై తాత్కాలికంగా నిలిపేయాలని కువైట్ అధికారులకు ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్, సౌదీ అరేబియాలో ఈ శిక్షలు మరింత ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఒకేరోజు ఏకంగా 81 మందిని ఉరి తీశారు. కువైట్లో 1960ల మధ్యలో ఈ ఉరిశిక్షలను ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి డజన్లకొద్దీ వ్యక్తులను ఉరితీయడం ప్రారంభించింది. వారంతా కూడా హత్యకు పాల్పడినవారు లేదా మాదక ద్రవ్యాల అక్రమ రవాణకు పాల్పడినవారే. అంతేగాదు కువైట్ని రెండున్న దశాబ్దలుగా పాలించిన అల్-సబా కుటుంబ సభ్యులను సైతం అక్కడి కువైట్ కోర్టులు మరణశిక్షలు విధించాయి. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని న్యాయస్థానం ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత కువైట్ అధికారులకు ఉంది, కానీ నిందితులను ట్రయల్స్లోఅంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా విచారించాలని ఇలాంటి శిక్షలు విధించకూడదని ఆమ్నెస్టీ డైరెక్టర్ గుయెల్లాలి చెప్పారు. (చదవండి: అమెరికాలో ట్రంప్ ఫెయిల్: బైడెన్) -
భారత పురుషుల స్క్వాష్ టీమ్ కొత్త చరిత్ర
భారత పురుషుల స్క్వాష్ టీమ్ చరిత్ర సృష్టించింది. ఆసియా ఛాంపియన్షిప్స్లో తొలిసారి పసిడి పతకం సాధించింది. కువైట్తో జరిగిన ఫైనల్లో భారత ఆటగాళ్లు రమిత్ తాండన్, సౌరవ్ ఘోషల్ దుమ్మురేపారు. తొలి మ్యాచ్లో అలీ అర్మామెజితో తలపడిన రమిత్ తాండన్ 11-5, 11-7, 11-4 తేడాతో విజయం సాధించి భారత్కు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత రెండో మ్యాచ్లో సౌరవ్ ఘోషల్ అమ్మర్ అల్టమిమిపై 11-9, 11-2, 11-3తో గెలిచాడు. మిత్, సౌరవ్ ఇద్దరూ రెండు మ్యాచుల్లో గెలవడంతో...భారత్ విజయం ఖాయమైంది. దీంతో అభయ్ సింగ్ ఫలా మహమ్మద్ తో తలపడాల్సి మ్యాచ్ను నిర్వాహకులు రద్దు చేశారు. అప్పటికే రెండు వరుస విజయాలు నమోదు చేసిన భారత పురుషుల జట్టు 2-0 తేడాతో కువైట్ను మట్టికరిపించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. కాగా గతంలో ఈ టోర్నీలో భారత్ రెండుసార్లు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైన గోల్డ్ మెడల్ను సాధించాలని మెన్స్ టీమ్ కసితో బరిలోకి దిగింది. ఆడిన ప్రతీ మ్యాచ్లో విజయమే టార్గెట్ బరిలోకి దిగి గెలుపొందింది. తొలుత ఖతర్, పాకిస్తాన్, కువైట్, సౌత్ కొరియా, చైనీస్ తైపీ జట్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచులన్నింట్లో 3-0తో విజయం సాధించి పూల్-ఏ అగ్రస్థానంలో నిలిచింది. సెమీస్ లో మలేషియాపై 2-1తో గెలిచి ఫైనల్ చేరింది. కాగా ఇదే చాంపియన్షిప్ భారత మహిళల స్క్వాష్ బృందం క్యాంస్యం పతకం గెలుచుకుంది. -
నువ్వు రాకపోతే ఆడపిల్లలను చంపేస్తా
పెంటపాడు: కన్నతండ్రే తన ఇద్దరు ఆడపిల్లలను చంపేందుకు సిద్ధమై విచక్షణారహితంగా దాడి చేశాడు. పిల్లలు భయంతో ఏడుస్తూ తమను చంపవద్దని తండ్రిని వేడుకుంటుండగా, వీడియో తీయించి కుటుంబ పోషణ కోసం కువైట్ వెళ్లిన తన భార్యకు పంపించాడు. భార్యను వెంటనే తెరిగి రావాలని, లేకపోతే ఇద్దరు ఆడపిల్లలను చంపేస్తానని హెచ్చరించాడు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులోని ఎస్సీపేటలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెంటపాడు ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... పెంటపాడు మండలం వీరపాలేనికి చెందిన గంజి దావీదుకు భార్య నిర్మల, కుమారుడు ఆకాష్(13), కుమార్తెలు అలేఖ్య(12), అమృత(11) ఉన్నారు. మద్యానికి బానిసైన దావీదు తన భార్యపై అనుమానంతో తరచూ కొడుతుండేవాడు. అతను ఏ పని చేయకుండా తాగి గొడవ చేస్తుండటంతో కుటుంబ పోషణ కోసం నిర్మల ఏడాది కిందట కువైట్ వెళ్లింది. నాలుగు నెలల కిందట దావీదు తన పిల్లలను తీసుకుని పెంటపాడు వచ్చి ఎస్సీ పేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. తన భార్యను ఎలాగైనా కువైట్ నుంచి రప్పించాలని దావీదు కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇద్దరు ఆడపిల్లలను చిత్రహింసలు పెడుతూ కుమారుడితో వీడియోలు తీయించి భార్యకు పంపుతున్నాడు. ఇది చూసి తట్టుకోలేని నిర్మల ఆ వీడియోలను గురువారం గ్రామ సర్పంచ్ తాడేపల్లి సూర్యకళకు పంపింది. సర్పంచ్ వెంటనే ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కుమారుడు కొట్టు విశాల్కు వాటిని పంపారు. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దృష్టికి కూడా ఈ విషయం వెళ్లడంతో ఆయన సూచన మేరకు విశాల్ స్థానిక పోలీసులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అప్రమత్తం చేశారు. వారు వెళ్లేసరికి పిల్లలను కొమ్ముగూడెంలోని బంధువుల ఇంటి వద్ద వదిలి దావీదు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement