మరో మోసం..
చీపురుపల్లి : నా పేరు వై.లక్ష్మి, మాది పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శివ
(క్యూనెట్ కంపెనీ ప్రతినిధి ) అనే వ్యక్తికి రూ.1.80 లక్షలు ఇచ్చాను. రూ. 90 విలువైన సామగ్రి ఇచ్చి మిగిలిన సొమ్ము స్వాహా చేశాడు. సొమ్ము కోసం రెండేళ్లుగా అతని చుట్టూ తిరుగుతున్నాను...
4 నా పేరు సీతయ్య. మాది శ్రీకాకుళం జిల్లాలోని ఇజ్జాడపాలెం. శివకు రూ. 90 వేలు ఇచ్చాను. అందులో రూ. 52 విలువైన సామగ్రి ఇచ్చి, మరో ఎనిమిది వేల రూపాయలను వివిధ రూపాల్లో ఇచ్చాడు. ఇంకా రూ.30 వేలు ఇవ్వాల్సి ఉంది.
4 నా పేరు మోహిని మాది విశాఖపట్టణం. శివకు రూ. లక్ష ఇచ్చాను. రూ. 50 వేల విలువైన సామగ్రి ఇచ్చాడు. పది వేల రూపాయలను రిజిస్ట్రేషన్ ఫీజుగా తీసుకున్నాడు. ఇంకా నలభై వేల రూపాయలు ఇవ్వాలి.
ఇలా ఒకరిద్దరు కాదు. దాదాపు 30 మంది ఆ మోసగాడి చేతిలో బలయ్యూరు. నిందితుడు సుమారు పది లక్షల రూపాయలు తీసుకుని చేతులెత్తేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పైడావలస గ్రామానికి చెందిన శివ క్యూనెట్ కంపెనీకి సబ్ ఫ్రాంచైజ్గా ఉన్న విహాన్ ఈ కామర్స్లో పనిచేస్తున్నాడు. ఇందులో సభ్యులుగా చేరితే చక్కని కమీషన్ పొందవచ్చని చెప్పి పలువురి వద్ద నుంచి శివ డబ్బులు తీసుకున్నాడు. ఇందులో సగం సొమ్ము కంపెనీకి చెల్లించి మిగిలినది స్వాహా చేశాడు. అయితే తాము చెల్లించిన డబ్బులు కంపెనీకి చేరలేదని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు శివ స్వగ్రామానికి వెళితే నిందితుడు వర్గీయులు తిరగబడడంతో చేసేది లేక లావేరు పోలీస్స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఈ మోసంలో చీపురుపల్లి వాసులు కూడా ఉండడంతో చివరకు జెడ్పీటీసీ సభ్యుడు మీసాల వరహాలనాయుడు వద్ద శనివారం పంచాయితీ నిర్వహించారు.