ధనుష్తో రొమాన్స్పై ఆసక్తి
నటుడు ధనుష్తో రొమాన్స్కు ఎగ్జయిటింగ్గా ఎదురు చూస్తున్నట్లు నటి కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించే అందం కాజల్ సొంతం. మధ్యలో బాలీవుడ్పై కన్నేయడంతో సౌత్లో కాస్త వెనుకపడ్డ ఈ బ్యూటి తాజాగా ఇక్కడ యథాతథంగా అవకాశాలను రాబట్టుకుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో రెండు చిత్రాలు, టాలీవుడ్లో ఒక చిత్రం చేస్తున్న కాజల్ను కోలీవుడ్లోఒక భారీ చిత్రంలో నటించే అవకాశం వరించింది. తుపాకీ, జిల్లా చిత్రాల్లో తమిళ చిత్ర పరిశ్రమలో విజయాల ఖాతాను ప్రారంభించిన ఈ బ్యూటీ తాజాగా ధనుష్ సరసన నటించడానికి రెడీ అవుతున్నారు. కాదలిల్ సొదప్పదు ఎప్పడి, వాయై మూడి పేసవుమ్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటించనుండడం తదితర విషయాల గురించి కాజల్ ఏమంటున్నారో చూద్దాం.
ధనుష్ సరసన నటించనున్న ఈ చిత్రం అక్టోబర్లో సెట్పైకి రానుంది. నేను, ధనుష్, దర్శకుడు బాలాజి మోహన్ తొలిసారిగా కలిసి నటిస్తున్న చిత్రం ఇది. నిజానికి ధనుష్ సరసన ఇంతకుముందే నటించాల్సింది. కాల్షీట్స్ తదితర సమస్యల కారణాలతో రెండు సార్లు మిస్ అయ్యాను. దీంతో ఈ చిత్రానికి వెంటనే అంగీకరించాను. ఈ చిత్రంలో నా పాత్రలో నటనకు అవకాశం ఉండటం కూడా ఒక కారణం. ధనుష్ మంచి నటుడు. ఆయనకు జంటగా నటించడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అలాగే ప్రస్తుతం టాలీవుడ్లో రామ్చరణ్తో గోవిందుడు అందరివాడు చిత్రంలో నటిస్తున్నాను. ఇది మా కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం. రామ్ చరణ్తో నటించడం మంచి అనుభవం.
కోలీవుడ్లో విజయ్సేతుపతి, శివకార్తికేయన్ లాంటి ఈ తరం హీరోల చిత్రాలు చూస్తున్నాను. వాళ్లు చాలా బాగా నటిస్తున్నారు. ముఖ్యంగా వెరైటీ కాన్సెప్ట్ కథా చిత్రాలను ఎంచుకుంటున్నారు. నాకు ఎలాం టి రిస్ట్రిక్షన్స్ లేవు. కథ బాగుంటే ఎవరితో నైనా నటించడానికి సిద్ధమే. ఐట మ్సాంగ్స్కు యమ క్రేజీగా ఉంది. బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లు కూడా ఈ తరహా పాటలకు సై అంటున్నారు. అరుుతే ప్రస్తుతానికి ఐటమ్ సాంగ్స్ చేసే ఆలోచన లేదు. ఒప్పుకున్న చిత్రాలతో చాలా బిజీగా ఉన్నాను. ఐటమ్ సాంగ్స్ చేసే హీరోయిన్లనెప్పుడూ గౌరవిస్తాను. భవిష్యత్తులో పాట బాగుందనిపిస్తే నేను నటించే అవకాశం లేకపోలేదు అంటూ ముగించారు.