చేప.. 8 కిలోలు
పాలకుర్తి మండలంలోని గూడూరు చెరువు బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షంతో మత్తడి పోస్తోంది. దీంతో సర్పంచ్ మాచర్ల పుల్లయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు గురువారం ఉదయం గంగపూజ నిర్వహించారు. కాగా, ఈరవెన్నులో వరదనీటికి కొట్టుకువచ్చిన సుమారు 8 కిలోల చేప ఓ యువకుడికి చిక్కడంతో తెగ సంబురపడ్డాడు.
– పాలకుర్తి