చర్లపల్లి జైల్లో ఇద్దరు వార్డర్లు ఘర్షణ
హైదరాబాద్ : చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్లో ఇద్దరు వార్డర్లు మంగళవారం ఘర్షణ పడ్డారు. రిలీవ్ విషయంలో వార్డర్ సైదులు మరో వార్డర్పై దాడి చేశాడు. దీంతో బాధిత వార్డర్... జైళ్లుశాఖ డీఐజీ నర్సింహకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరు వెంటనే తన కార్యాలయానికి వచ్చి కలవాని డీఐజీ ఆదేశించారు. దాంతో సదరు వార్డర్లు... డీఐజీ కార్యాలయానికి తరలి వెళ్లారు. అయితే ఈ ఘటనపై చర్లపల్లి జైలు ఉన్నతాధికారులను డీఐజీ ఆరా తీసినట్లు సమాచారం.