కేసీఆర్ నాయకత్వంలో రైతుల అభివృద్ధి
మోర్తాడ్, న్యూస్లైన్: తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కాను న్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రైతులు సర్వతోముఖాభివృద్ధి చెందనున్నారని పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సురేందర్రెడ్డి అన్నారు. శనివారం మోర్తాడ్లో వ్యవసాయదారుల సం ఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బద్దం నర్సారెడ్డి విగ్రహా న్ని ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రైతులు కోరుకున్నట్లే కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కానుం దన్నారు. కేసీఆర్ స్వయంగా రైతు కావడంతో వారి సమస్యలు తెలిసిన వ్యక్తిగా వారి క్షేమం కోసం ప్రయత్నించనున్నారని చెప్పారు.
కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగానే రైతులకు పంట రుణాలు మాఫీ కానున్నాయని తెలిపారు. వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యతను కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వనుందన్నారు. గతంలో మా దిరిగా రైతులకు ఎలాంటి స మస్యలు ఉండవని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మాజీ ఎంపీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. చైనా తరహా వ్యవసాయం సాగాలని అన్నారు. మనదేశంలో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వక పోవడంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. వ్యవసాయదారులకు ఒక సంఘం ఉండాలనే ఉద్దేశంతో రైతులను ఏకం చేసి ఒక సంఘాన్ని స్థాపించి గుర్తింపు తెచ్చిన మహానీయుడు బద్దం నర్సారెడ్డి అన్నారు.
కార్యక్రమంలో నర్సారెడ్డి సతీమణి వ్యవసాయదారుల సంఘం అధ్యక్షురాలు బద్దం సునీ తారెడ్డి, ప్రముఖ న్యాయ వాది లోక భూపతిరెడ్డి, రైతు సంక్షేమ సంఘం నాయకుడు కొటపాటి నర్సింహానాయుడు, మాజీ సర్పంచ్ రాజా సుభాష్చందర్ రెడ్డి, నాయకులు రెంజర్ల గంగారాం, బీజీ గంగారాం, తీగెల రమేష్రెడ్డి, ముత్యాల మనోహార్రెడ్డి పాల్గొన్నారు.