-
గిరి గ్రామాల్లో విత్తనపూజ
● ప్రారంభమైన ‘మొహతుక్’ ● చంచి భీమల్ దేవునికి పూజలు ● అనాదిగా వస్తున్న ఆచారం గ్రామాల్లో విత్తన పూజలు మృగశిర కార్తె ప్రవేశించడంతో ప్రతీ గ్రామాల్లో విత్తన పూజలు(మొహతుక్) కొనసాగుతున్నాయి. ఆదివాసీ కులదేవతలకు విత్తనాలు చూపించాకే తమతమ పొలాల్లో విత్తనాలు నాటుతున్నాం. అనాదిగా వస్తున్న ఆచారం. – దుర్పతబాయి, మాజీ జెడ్పీటీసీ, కెరమెరి దేవతలకు చూపించాకే! పొలాల్లో విత్తనాలు నాటేకంటే కొద్ది రోజుల ముందు కులదైవాలకు విత్తనాలను చూపిస్తాం. అక్కడ ప్రత్యేక పూజలు చేశాకే పొలానికి వెళ్లి జొన్నగట్కాను ఆరగిస్తారు. అనంతరం నేలతల్లికి ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటడం ప్రారంభిస్తాం. – ధర్మారావు, దేవారి సాకడ(సీ) కెరమెరి(ఆసిఫాబాద్): ఏడాదిలో ఆరు మాసాలు ఏవో పండుగలు చేస్తూ.. తమకు తామే సాటిగా నిలుస్తున్నారు ఆదివాసీలు. తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడంలో వారు ముందుంటున్నారు. మృగశిరకార్తె ప్రవేశించడంతో ఉమ్మడి జిల్లాలోని గిరి గ్రామాల్లో విత్తనపూజకు శ్రీకారం చుట్టారు. విత్తన (మొహతుక్) పూజలు పొలాల్లో రెండురోజులుగా కొనసాగుతున్నాయి. ప్రతీఏటా జరుపుకునే విత్తన పూజలతోనే తమతమ పొలాల్లో విత్తనాలు నాటడం ప్రారంభిస్తారు. దేవతలకు విత్తనాలను చూపించారు ఈ మాసంలో అన్ని గ్రామాల్లో గ్రామ పటేల్ ఇంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆదివాసీల కు లదైవమైన పాటేరు అమ్మోరు, జంగుబాయి, గాంధారి కిల్ల, పద్మాల్పురి కాకో వద్దకు వెళ్లి విత్తనాలను చూపించారు. అక్కడే దేవతల ఆశీర్వాదం తీసుకుని తిరుగుపయనమయ్యారు. అనంతరం గ్రామంలో ఉన్న ఆకీపేన్, అమ్మోరు, పొచమ్మ వద్దకు విత్తనాలతో పూజలు చేశారు. అక్కడే పటేల్ ఇచ్చే విత్తనాలను తమతమ ఇళ్లకు తీసుకెళ్లారు. మళ్లీ అదేరోజు అర్ధరాత్రి 2.5 కిలోల జొన్నలను ఇంట్లోనే పడతారు. పట్టిన జొన్నలతో గట్కా తయారు చేసి ఆరగిస్తారు. జొన్న గట్క ఆరగించాక అర్ధరాత్రి అడవికి వెళ్లి (కుమ్ముడ్) చెట్టు ఆకులను తీసుకువచ్చారు. ఆ ఆకులతో డొప్పలు తయారు చేసి అన్ని ఇళ్లల్లో ఇస్తారు. అందులో పూజ చేసిన విత్తనాలు వేస్తారు. ఈ పూజలు మరో రెండు రోజులు కొనసాగుతాయి. విత్తన పూజలు(మొహతుక్)! మృగశిర కార్తె ప్రవేశం నుంచి విత్తన పూజలు(మొహతుక్) పొలాల్లో సంప్రదాయ బద్ధంగా చేస్తారు. విత్తన పూజ చేసే రోజు రైతు కుటుంబమంతా ఉదయం పొలంబాట పడతారు. జొన్నతో గట్కా తయారీ చేసి కులదైవతలతోపాటు, నేలతల్లికి సమర్పిస్తారు. అనంతరం పొలంలో విత్తనాలు చల్లి అరకకు ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటుతారు. గ్రామపటేల్ ఇంటి ఎదుట మహిళలు అందరూ పాటలు పాడుతూ, సంప్రదాయ నృత్యాలు చేస్తారు. పురుషులు గిల్లిదండా ఆట ఆడుతారు. అనంతరం సహపంక్తి భోజనం చేస్తారు. తర్వాత భేటింగ్ అయ్యారు. చంచి భీమల్ దేవుడి కల్యాణంతో.. ఆదివాసీల ఇష్టదైవమైన చంచి భీమల్ దేవుడి కల్యాణం సందర్భంగా ఏటా మే నెలలో విత్తనాలను భీమల్ దేవుడికి చూపిస్తారు. ఆ రోజు ఆదివాసీలు భీమల్ దేవుడికి సంప్రదాయ పూజలు చేస్తారు. అడవుల్లో లభించే ఆకులతో ఆరు డొప్పలను తయారు చేస్తారు. అందులో పొలాల్లో పండించే అన్ని విత్తనాలను కలిపి దేవునికి చూపిస్తారు. అనంతరం వాటిని ఇళ్లకు తీసుకెళ్లి దాచి పెడుతారు. ఆ రోజు పిండి వంటలు చేసి ఆరగిస్తారు. మృగశిర కార్తె ప్రారంభంతో దాచి పెట్టిన విత్తనాలను తమ పంట పొలాల్లో చల్లుతారని చెబుతున్నారు. ఇంద్రాదేవికి విత్తన పూజలు ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్యదైవం మండలకేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయంలో విత్తన పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలు తరలివచ్చి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి తయారీ చేసిన నవధాన్యాలతో నైవేద్యం సమర్పించారు. ఖరీఫ్ సీజన్లో వర్షాలు కురువాలని, పంటలు బాగా పండాలని అమ్మవారికి మొక్కుకున్నారు. -
ఎవరెస్టు శిఖరం అధిరోహించిన లింబాద్రి
మోర్తాడ్(బాల్కొండ): భీమ్గల్ మండలం బాబానగర్ తండాకు చెందిన మలావత్ లింబాద్రి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. మలావత్ తిరుపతి కుమారుడు లింబాద్రి నూత్పల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఎవరెస్టు అడ్వెంచర్ శిబిరానికి ఎంపికై న 20 మంది విద్యార్థుల్లో లింబాద్రి ఒకరు. గత నెలలో బయల్దేరిన ఈ బృందం 5,150 మీటర్ల ఎత్తులోని ఎవరెస్ట్ నార్త్ బేస్క్యాంపునకు శనివారం చేరుకున్నారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ, రాకేశ్ ఆధ్వర్యంలో ఈ విద్యార్థుల బృందం పర్వతారోహణకు వెళ్లింది. చిన్న వయస్సులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన లింబాద్రిని ఆర్సీవో సత్యనాథ్రెడ్డి, నూత్పల్లి పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్గౌడ్, పీడీ ప్రదీప్ అభినందించారు. లింబాద్రి పర్వతారోహణ విజయవంతం కావడంతో బాబానగర్ తండావాసులు, భీమ్గల్ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 9 నుంచి డీఈఈ సెట్–2025 ధ్రువపత్రాల పరిశీలన సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రై మరీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల ప్రవేశానికి ఇటీవల నిర్వహించిన డీఈఈ సెట్–2025 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 9 నుంచి నిజామాబాద్ డైయిట్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ టి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వారికి కేటాయించిన తేదీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్కు హాజరు కావాలని సూచించా రు. ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పా టు డీఈఈ సెట్ హాల్ టికెట్, ర్యాంకు కా ర్డు, ఇటీవల పొందిన ఆదాయ ధ్రువీకరణ ప త్రం, ఇంటిగ్రేటెడ్ కుల ధ్రువీకరణ పత్రం, పదోతరగతి, ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు, 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనోఫైడ్ సర్టిఫికెట్లు, ఇతర రిజర్వేషన్లు (ఎన్సీసీ, క్రీడలు, దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాలు) ఉంటే సంబంధిత ఒరిజినల్ ధ్రువపత్రాలతో వెరిఫికేషన్కు హాజరు కావాలన్నారు. డీఈఈ సెట్ వెబ్సైట్లో హాజరు కావాల్సిన తేదీ, స్థలం, ఒరిజినల్ సర్టిఫికెట్ల వివరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇతర సందేహాలుంటే 63095–35759, 88864–48818 నంబర్లను సంప్రదించాలని టి శ్రీనివాస్ తెలిపారు. -
ఎంపీడీఓ కార్యాలయానికి చేరిన కలప
ఆత్మకూరు రూరల్: రంగూన్ కలపను కొట్టేసేందుకు యత్నించిన స్కెచ్ బెడిసికొట్టింది. ‘రంగూన్ కలపను కొల్లగొట్టే ప్లాన్’ అనే శీర్షికన సాక్షిలో కథనం శనివారం ప్రచురితమైన నేపథ్యంలో అధికారుల్లో చలనమొచ్చింది. పట్టణంలోని పాత సమితి కార్యాలయం, ప్రస్తుత పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో ఉన్న పురాతన భవనాన్ని గుట్టుచప్పుడు కాకుండా కూలగొట్టి అందులోని కలపను మండలంలోని చెర్లోయడవల్లికి చెందిన ఓ టీడీపీ నేత ఇంటికి తరలించిన అంశం బహిర్గతం కావడంతో ఆగమేఘాలపై అధికారులు స్పందించారు. తరలించిన టేకు కలపలో కొంత భాగాన్ని ఎంపీడీఓ కార్యాలయం వద్దకు తరలించారు. అయితే మిగిలిన వాటిని పూర్తిగా రాబట్టడంలేదనే విమర్శలున్నాయి. -
9 నుంచి టీటీడీ కళాశాలల్లో అడ్మిషన్లు
తిరుపతి ఎడ్యుకేషన్ : టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నడుస్తున్న శ్రీవేంకటేశ్వర (ఎస్వీ), శ్రీపద్మావతి మహిళా (ఎస్పీడబ్ల్యూ) జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 9వ తేదీ నుంచి తొలివిడత అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించనున్నారు. ఆ మేరకు ఎస్వీ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సి.ప్రకాష్బాబు తెలిపారు. ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్, తెలుగు, ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ మీడియంలో బోధన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్వీ జేసీలో 792 సీట్లకు దాదాపు 5,200 మంది, ఎస్పీడబ్ల్యూ జేసీలో 968సీట్లకు దాదాపు 9వేల మంది విద్యార్థులు టీటీడీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేశారని, ఆయా విద్యార్థులకు ఇదివరకే సమాచారాన్ని అందించినట్లు పేర్కొన్నారు. వీరికి 9వ తేదీ నుంచి తొలివిడత అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తారని, మిగిలిన సీట్లకు మలివిడత అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించి భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అడ్మిషన్లు పొందిన ఆర్ట్స్ విద్యార్థులు రూ.4,400/–, సైన్సు విద్యార్థులు రూ.5,350/– ఫీజు చెల్లించాలని చెప్పారు. హాస్టల్లో సీటు పొందిన వారు హాస్టల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు ఒరిజనల్ టీసీతో పాటు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన అన్ని ధ్రువపత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు. -
చినుకు జాడేది ?
మృగశిర మన్నించేనా..? మృగశిర కార్తె ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్తెలో అయినా వర్షాలు సమృద్ధిగా పడతాయా అని రైతులు ఎదురుచూస్తున్నారు. కాలం అనుకూలిస్తే మృగశిర కార్తెలో భారీ వర్షాలు కురిసి వాతావరణం చల్లబడే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఎండల తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మే నెలలో అకాల వర్షాలతో ఎండల నుంచి ఉపశమనం పొందినా.. జూన్ మొదటి వారంలో మాత్రం ఎండలు, ఉక్కపోతతో విసిగిపోతున్నారు. ఎండల తీవ్రతకు జ్వరపీడితులు కూడా పెరుగుతున్నారు. మేతకు వెళ్లిన పశువులు, జీవాలు మధ్యాహ్నానికే ఇంటిదారి పడుతున్నాయి. బూర్గంపాడు: మే నెలలో కురిసిన అకాల వర్షాలు రైతులను పంటల సాగుకు సన్నద్ధం చేశాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగా వస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మే నెలాఖరులో ఉపరితల ఆవర్తనంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో రైతులు పంటల సాగుకు సిద్ధమయ్యారు. దుక్కులు చేసి పత్తి గింజలు వేశారు. కొన్ని చోట్ల పత్తి గింజలు మొలకెత్తాయి. అయితే వారం రోజులుగా చినుకు పడలేదు. దీంతో రైతులు వేసిన పత్తి గింజలు కొన్నిచోట్ల మొలకలు వచ్చి ఎండిపోతున్నాయి. లక్షల రూపాయలు ఖర్చుచేసి వేసిన పత్తి గింజలు మొలకెత్తుతాయో లేదోనని ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. గత నెలలో వర్షాలు.. మే నెల మొత్తం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. ఎండలు మండిపోవాల్సిన నెలలో అకాల వర్షాలు ప్రజలకు ఊరటనిచ్చాయి. మే నెలాఖరులో ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు కురిసి భూములు పదునయ్యాయి. ఈ తరుణంలోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో రైతులు సాగు పనులు మొదలుపెట్టారు. మాగాణి భూముల్లో పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకున్నారు. మే నెలాఖరులో వేసిన పత్తి గింజలు అకాల వర్షాలకు బాగానే మొలకెత్తాయి. ఆ తరువాత వేసిన పత్తిగింజలు మాత్రం వర్షాలు లేక మొలకెత్తలేదు. గత వారం, పది రోజులుగా ఎండలు దంచికొడుతుండగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పత్తి సాగు షురూ.. ఉమ్మడి జిల్లాలోని మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, మధిర, సత్తుపల్లి తదితర ప్రాంతాల్లో రైతులు పత్తి సాగు మొదలుపెట్టారు. భద్రాద్రి జిల్లాలోనే సుమారు లక్ష ఎకరాల్లో ఇప్పటికే పత్తి గింజలు వేశారు. జిల్లాలోని రైతులు పొడి దుక్కుల్లోనే విత్తనాలు వేసుకోవడం ప్రతి ఏటా పరిపాటిగా మారింది. కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధర క్వింటాకు రూ. 589 పెంచటంతో ప్రస్తుతం రూ, 8,110కి చేరింది. దీంతో పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే రైతులు లక్ష ఎకరాల్లో పత్తి సాగు చేయగా మరో లక్షన్నర ఎకరాల్లో సాగు చేసే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేశారు. వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు వేసుకోవాలని సూచిస్తున్నారు. ఊరించి ఉసూరుమనిపించిన వానలు జిల్లాలో పత్తి గింజలు వేసిన రైతులు కొన్నిచోట్ల ఎండుతున్న మొక్కలు వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు -
భక్తిశ్రద్ధ్దలతో బక్రీద్
వనపర్తిటౌన్: జిల్లావ్యాప్తంగా శనివారం ముస్లిం సోదరులు బక్రీద్ను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకొన్నారు. జిల్లాకేంద్రం శివారు గోపాల్పేట రహదారిలో ఉన్న ఈద్గాలో ముస్లింలు ప్రార్థనలు చేశారు. అదేవిధంగా తొలిసారి శ్రీనివాసపురంలో ముస్లింలకు కేటాయించిన స్థలంలో కూడా పలువురు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ముస్లింలు పట్టణం నుంచి ఊరేగింపుగా బయలుదేరి ఈద్గాకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి శ్రీనివాసపురంలో, మాజీ మంత్రి నిరంజన్రెడ్డి తన నివాసంలో ముస్లింలను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగనీరతి, సహనానికి ప్రతీకగా బక్రీద్ జరుపుకొంటారని ఎమ్మెల్యే మేఘారెడ్డి వివరించారు. విశ్వాసం, నమ్మకం, పరోపకారానికి బక్రీద్ ప్రతీక అని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గంలో ముస్లీంలకు వివిధ పార్టీల ప్రముఖులు, అధికారులు, మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, చీర్ల విజయచందర్, వెంకటయ్య యాదవ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, పట్టణ అధ్యక్షుడు పలుస రమేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈద్గాల్లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు జిల్లాకేంద్రంలో తొలిసారిగా శ్రీనివాసపురం ప్రాంతంలో కేటాయించిన స్థలంలో నమాజ్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మేఘారెడ్డి -
వ్యక్తిగత పూచీకత్తుపై నిరంజన్రెడ్డి విడుదల
నెల్లూరు (లీగల్): గ్రావెల్ అక్రమ తవ్వకాల కేసులో అభియోగం ఎదుర్కొంటున్న నిరంజన్రెడ్డి రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించారు. ఆయన్ను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 2021లో అప్పటి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సంతకం ఫోర్జరీ చేసి సర్వేపల్లి జలాశయం నుంచి గ్రావెల్ తరలించారనే ఆరోపణలపై వెంకటాచలం పోలీసుస్టేషన్లో ఉదయ్కుమార్రెడ్డి, శ్రీధర్రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాజాగా ఆ కేసులో వీరి పేర్లు తొలగించి, ఆ స్థానంలో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితోపాటు ఆయన ముఖ్య అనుచరుడైన నిరంజన్రెడ్డి పేర్లను నమోదు చేసిన సిట్ అధికారులు శుక్రవారం బెంగళూరులో ఉన్న నిరంజన్రెడ్డిని అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించి అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం మాగుంటలేఅవుట్లోని సెకండ్ ఏజేఎఫ్ఎంసీ కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి పాలమంగళం వినోద్ ఇంటి వద్ద హాజరు పరిచారు. సిట్ తరఫున స్పెషల్ పీపీ, నిరంజన్రెడ్డి తరఫున న్యాయవాదులు రోజారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ రిపోర్టును తిరస్కరిస్తూ వ్యక్తిగత పూచీకత్తుపై నిరంజన్రెడ్డిని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
ప్రశాంతంగా డీఎస్సీ
● కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఒంగోలు సిటీ: ఉపాధ్యాయ పోస్టుల కోసం నిర్వహిస్తున్న మెగా డీఎస్సీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 629 పోస్టుల భర్తీకి నిర్వహించే ఈ పరీక్షలకు 24,659 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 30వ తేదీ వరకూ ప్రతి రోజు రెండు షిఫ్ట్ల్లో పరీక్షలు జరుగుతాయి. ఒంగోలు నగరంతోపాటు మార్కాపురం పట్టణంలో మొత్తం ఎనిమిది కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. తొలి రోజు 5 కేంద్రాల్లో 791 మంది హాజరు కావాల్సి ఉండగా 718 మంది హాజరయ్యారు. 81 మంది గైర్హాజరయ్యారు. ఒంగోలులోని రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో 170 మందికి గాను 147 మంది, క్విస్ ఇంజినీరింగ్ కాలేజీలో 200 మందికి 179 మంది, బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్లో 201 మందికి గాను 189 మంది, మార్కాపురంలోని డాక్టర్ శామ్యూల్ జార్జ్ ఇంజినీరింగ్ కాలేజీలో 120 మందికి గాను 106 మంది, కృష్ణచైతన్య ఇంజినీరింగ్ కాలేజీలో 100 మందికి గాను 89 మంది హాజరయ్యారు. మెగా డీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి జిల్లాలో మెగా డీఎస్సీ పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలులో మెగా డీఎస్సీ పరీక్ష జరుగుతున్న బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అన్ని వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా అన్నీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని 8 కేంద్రాల్లో మెగా డీఎస్సీ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా పరీక్ష జరుగుతుందన్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక డిపార్ట్మెంటల్ అధికారిని నియమించారన్నారు. కలెక్టర్ వెంట అర్బన్ తహసీల్దార్ మధుసూదన్ రావు, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
మోపాల్(నిజామాబాద్రూరల్): మోపాల్లోని ఫిట్ నెస్ క్లబ్లో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన 11వ జిల్లా సెలెక్షన్ టోర్నమెంట్ వివిధ విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు అసోసియేష న్ అధ్యక్ష, కార్యదర్శులు కర్నాటి వాసు, కేవీ కిరణ్కుమార్ తెలిపారు. పురుషులు, మహిళల విభాగంలో సింగిల్స్, డబుల్స్లో విజేతలు రాష్ట్రస్థాయి పో టీలకు అర్హత సాధించారన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి సాయిరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు ప్రకా శ్, సంయుక్త కార్యదర్శి గంగాధర్గౌడ్ పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులు.. సింగిల్స్ విభాగంలో పి ప్రణవ్ శ్రీకర్ (విన్నర్), కె మానవు (రన్నర్), డబుల్స్ విభాగంలో కె ప్రణయ్, ఎం రోహిత్ (విన్నర్), మహిళల సింగిల్ విభాగంలో ఏ శ్రీవల్లి (విన్నర్), డబుల్స్ విభాగంలో ఎస్వీఎస్ శ్రీ వైష్ణవి, ఏ శ్రీవల్లి, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో దుర్కికర్ సాయిచరణ్, జి కనిష్క (విన్నర్, అండర్–19), సింగిల్స్ బాలుర విభాగంలో కె మానవు (విన్నర్), ఎస్ విశ్వక్ (రన్నర్), డబుల్స్ బాలుర విభాగంలో ఎం విశ్వజిత్, ఎస్ విశ్వక్ (విన్నర్), అండర్–17 బాలుర విభాగంలో ఎం విశ్వజిత్ (విన్నర్), కె కార్తికేయ (రన్నర్), డబుల్స్ బాలుర విభాగంలో (అండర్–17), ఎం వాస్తవ్ అండ్ వై రూపాలు (విన్నర్). -
వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి
రుద్రూర్: మండల కేంద్రంలోని శ్రీ సార్వజనిక్ గణే ష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించే 75వ ( వజ్రోత్సవ) వార్షికోత్సవంలో గ్రామస్తులు అందరు భాగస్వామ్యులు కావాలని నిర్వాహక కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. స్థానిక శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వేడుకలు వైభవంగా నిర్వహించాలని తీర్మానించారు. ఇందుకు వివి ధ కమిటీలు ఏర్పాటు చేశారు. సమావేశంలో గణేష్ మండలి అధ్యక్ష, కార్యదర్శులు చిదుర వీరేశం, గెంటీల సాయిలు, తదితరులు పాల్గొన్నారు.