
వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి
రుద్రూర్: మండల కేంద్రంలోని శ్రీ సార్వజనిక్ గణే ష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించే 75వ ( వజ్రోత్సవ) వార్షికోత్సవంలో గ్రామస్తులు అందరు భాగస్వామ్యులు కావాలని నిర్వాహక కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. స్థానిక శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వేడుకలు వైభవంగా నిర్వహించాలని తీర్మానించారు. ఇందుకు వివి ధ కమిటీలు ఏర్పాటు చేశారు. సమావేశంలో గణేష్ మండలి అధ్యక్ష, కార్యదర్శులు చిదుర వీరేశం, గెంటీల సాయిలు, తదితరులు పాల్గొన్నారు.