
వల్లభాపూర్ వాసికి అమెరికాలో ఫ్రీ సీటు
● పోటీపరీక్షలో ప్రతిభచాటి వైద్యవిద్య కోర్సుకు ఎంపికై న కేశెట్టి చరణ్సిద్ధార్థ్
మాక్లూర్: మండలంలోని వల్లభాపూర్కు చెందిన కేశెట్టి చరణ్ సిద్ధార్థ్ అమెరికాలో యూఎస్ఎంఎల్ఈ కోర్సులో ఫ్రీసీటు సాధించాడు. వల్లభాపూర్లో వ్యవసాయం చే సుకుంటూ జీవించే కేశెట్టి సూర్యప్రకాష్–వనజల ఏకై క కుమారుడు చరణ్ సిద్ధార్థ్. త ల్లిదండ్రులు పట్టభద్రులైనప్పటికీ వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో గ్రామంలోనే జీవిస్తుండగా, కుమారుడిని మాత్రం వైద్యుడిని చేయాలనే లక్ష్యంతో చదివిస్తున్నారు. సి ద్దార్థ్ ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేయగా, యూఎస్ఎంఎల్ఈ కోర్సుకుగాను పోటీ పరీక్షలో అత్యాధిక మార్కులు సాధించి ఫ్రీ సీటు పొందారు. మూడేళ్లపాటు ఉండే ఈ కో ర్సుకు గ్రాంటు మొత్తాన్ని అమెరికా ప్రభుత్వమే భరిస్తుంది. సంవత్సరానికి 80 వేల డాలర్లు అక్కడి ప్రభుత్వం నుంచి గ్రాంటు వస్తున్నట్టు తల్లిదండ్రులు తెలిపారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిది..
నన్ను డాక్టర్ చేయటానికి నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. వారి కోరిక మేరకు పెద్ద డాక్టర్ అయ్యాక, వారి ఆశయాలకు అనుగుణంగా పేదోళ్లకు ఉచిత వైద్య సేవలు అందించటంలో ముందుంటాను. –కేశెట్టి చరణ్ సిద్ధార్థ్, వల్లభాపూర్