
సాహిత్యంలో రాణిస్తున్న డేగల వైష్ణవి
మోర్తాడ్(బాల్కొండ): ఏర్గట్ల మండలం తడపాక ల్ ఉన్నత పాఠశాలకు చెందిన డేగల వైష్ణవి తెలుగు సాహిత్యంలో రాణిస్తుంది. ఏడో తరగతి నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకున్న వైష్ణవి కథ లు, కవితలు, పద్యాలను రాసి విమర్శకుల ప్ర శంసలను అందుకున్నారు. అమ్మ అనే వచనా శతకం, చిన్నారి కథలు అనే శీర్షిక పేరిట పుస్తకంరాసింది. సామాజిక ఇతివృత్తంతో రాసిన కథ లు ఎంతో మందిని మెప్పించాయి. వైష్ణవి రాసి న కథల పుస్తకాన్ని ఇటీవల కలెక్టర్ ఆవిష్కరించగా, చదువు అనే సరళ వచనా శతకం పుస్తకా న్ని తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి, ఇతర ప్రముఖులు ఆవిష్కరించారు. వైష్ణవి అక్షరయాన్ బాలికా పురస్కారం, పెందోట సాహిత్య పురస్కారం, బాలజ్యోతి, తానా పురస్కారాలను అందుకుంది. ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగా ప్రేరణ అనే కథల పుస్తకాని రచించానని, త్వరలోనే ఆవిష్కరించనున్నట్లు వైష్ణవి వెల్లడించారు. వైద్య విద్య ను అభ్యసించి పేదలకు సేవ చేయడమే తన ధ్యేయం అని ఈ చిన్నారి సాహితీవేత్త వెల్లడించడం గమనార్హం.