
బిల్లుల కోసం ఎదురుచూపులు
● నాలుగేళ్లుగా అందని బిల్లులు,
రూ. 35 లక్షల బకాయి
● బిచ్కుంద జీపీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్
● ఆందోళనలో కాంట్రాక్టర్లు
● కొత్త పనులకు ముందుకు రాని వైనం
బిచ్కుంద(జుక్కల్) : బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాలుగేళ్ల క్రితం గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లుల రాకకోసం కాంట్రాక్టర్లు, సర్పంచులకు ఎదురుచూపులు తప్పడం లేదు. బిచ్కుంద మండల కేంద్రంలో సీసీరోడ్లు, డ్రెయినేజీ, కల్వర్టులు ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. పనులు చేయాలని జీపీ పాలక వర్గం తీర్మానం చేసి ఇచ్చింది. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు ఏళ్లు గడుస్తున్నా గత ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. సుమారు రూ.35 లక్షల బకాయి బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఎంబీ రికార్డులు చేసి సంబంధిత పంచాయత్రాజ్ (పీఆర్) అధికారులు సమర్పించిన ఎంబీలు కేవలం రికార్డులకే పరిమితమయ్యాయి. సీసీ రోడ్లు, డ్రెయినేజీ, కల్వర్టులు, విద్యుత్లైట్లు, బ్లీచింగ్ పౌడర్ ఇతర బిల్లులు బిచ్కుంద జీపీలో బకాయి ఉంది. బిచ్కుంద జీపీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది బిల్లుచెల్లించడానికి ఎన్ని నిబంధనలు పెండుతుదోనని కాంట్రాక్టర్లు, సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. పాత పనులకు నాలుగేళ్లుగా బిల్లులు రాలేదు ఇప్పుడు చేసిన పనులకు బిల్లులు వస్తాయో లేదోనని సీసీరోడ్లు, డ్రెయినేజీ పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద నాలుగు నెలల క్రితం రోడ్లకు కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. కొన్ని పనులు చేయగా.. మరికొన్ని వదిలేశారు.