
కామారెడ్డి శివారులో ట్రాలీ ఆటో– బైక్ ఢీ
● ముగ్గురికి గాయాలు
కామారెడ్డి టౌన్: పట్టణ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా.. పట్టణ శివారులోని శాబ్ధిపూర్ రోడ్లో ప్రయాణిస్తున్న ట్రాలీ ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న రెడ్డిపేట గ్రామానికి చెందిన పోచవ్వ, నరేష్లకు, ఆటో నడుపుతున్న డ్రైవర్ ఓబుది సాయిలుకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నవీపేట మండలంలో..
నవీపేట: మండలంలోని యంచ శివారులోని బాసర బ్రిడ్జి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. రాథోడ్ విజయ్, రాథోడ్ రాజు బైక్పై బాసర్ నుంచి ఫకీరాబాద్ వైపు బయలుదేరగా, యంచ శివారులోని బ్రిడ్జి సమీంలో వారిని మరో బైక్ ఢీకొట్టింది. ఈఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాయ్యాయి. మరో బైక్ నడిపిస్తున్న బాధితుడిని ధర్మాబాద్ వాస్తవ్యుడిగా స్థానికులు గుర్తించారు. క్షతగాత్రులను స్థానికులు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

కామారెడ్డి శివారులో ట్రాలీ ఆటో– బైక్ ఢీ