
‘పందిరి’ సాగు.. లాభాలు బాగు..
బాల్కొండ: పందిరి విధానంలో కూరగాయాలు సాగు చేయడం వల్ల లాభాలు బాగా ఉంటాయని ఆర్మూర్ డివిజన్ ఉద్యానవన అధికారి రుద్ర వినాయక్ అంటున్నారు. పందిరి విధానంపై ప్రభుత్వం (ఆర్కేవీవై) రాష్ట్రీ య కృషి వికాస్ యోజన కింది సబ్సిడీ సైతం అందిస్తుందంటున్నారు. సాధారణంగా ఎకరం భూమిలో శాశ్వత పందిరి నిర్మించుకోవాడానికి రైతులకు సుమారుగా రూ. లక్ష ముప్పై వేల నుంచి రూ. లక్షన్నర వరకు ఖర్చు అవుతుంది. ఉద్యానవన శాఖ ఎకరానికి రూ. 50వేలు సబ్సిడీ ఇస్తుంది. అలాగే ఉద్యానవన శాఖ జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ నుంచి నాణ్యమైన కూరగాయాల నారు కోసం ఎకరానికి రూ6, 400 సబ్సిడీ ఇస్తుంది. ప్రభుత్వం అందించే సబ్సిడీని రైతులు వినియోగించుకొని, కూరగాయల సాగుపై దృష్టిసారించాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రయోజనాలు ఇలా..
● పందిరి వ్యవస్థలో ప్రధానంగా తీగ జాతి (కాకర, సోర కాయ, టమాట, చిక్కుడు, బీర) లాంటి కురగాయాలను సాగు చేసుకోవాలి.
● సాధారణ పద్దతి కంటే పందిరి పద్దతిలో కూరగాయాలు సాగు చేసుకుంటే 2.5 టన్నుల అదనపు దిగుబడి వస్తుంది.
● పండు యొక్క రంగు, నాణ్యత మెరుగు పడుతుంది. ఐదు ఎకరాల భూమిలో వరి సాగు చేసే బదులు ఎకరం భూమిలో కూరగాయాలు సాగు చేస్తే అంతే ఆదాయం వస్తుందన్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీని రైతులు వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
రైతు సమాచారం
ఈ విధానంలో కూరగాయలు
పండిస్తే అధిక దిగుబడి
ప్రభుత్వం సబ్సిడీ సైతం
అందిస్తుందంటున్న అధికారులు

‘పందిరి’ సాగు.. లాభాలు బాగు..

‘పందిరి’ సాగు.. లాభాలు బాగు..