
ఆలయం పేరే ఊరు పేరైంది
మీకు తెలుసా?
ఉత్తర తెలంగాణ వరప్రదాయని ఎస్సారెస్పీ
సమాచారం..
పాల్వంచ మండలం బండరామేశ్వర్పల్లి గ్రామంలో క్రీ.శ. 1264లో కాకతీయ సామ్రాజ్య విస్తరణలో భాగంగా రాణి రుద్రమదేవి అక్కడ గుండయ్య అనే సామంతుడిని నియమించి బండరాళ్లతో రామనాథుని ఆలయాన్ని నిర్మించినట్టు ఆలయంపై ఉన్న శిలాశాసనం చెబుతోంది. భక్తులు రానురాను రామనాథున్ని రామలింగేశునిగా, రాజరాజేశ్వర స్వామిగా కొలుస్తున్నారు. బండరాళ్లతో ఆలయాన్ని నిర్మించినప్పటి నుంచి గ్రామానికి బండరామేశ్వర్పల్లి అనే పేరు వచ్చినట్టు చరిత్రకారులు చెబుతున్నారు.
– మాచారెడ్డి
బాల్కొండ: మండలంలోని పోచంపాడ్ సమీపంలో 1963 జూలై 26న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్నిర్మాణం కోసం దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు.
● ప్రాజెక్ట్ నిర్మాణ పనులు 1978 వరకు పూర్తయ్యాయి.
● ప్రాజెక్ట్ నీటిమట్టం 1091 అడుగులు కాగా 112 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. కాని పూడిక వలన ప్రస్తుతం 80.5 టీఎంసీలకు నీల్వ సామర్థ్యం పడిపోయింది.
● ప్రాజెక్ట్ ప్రధాన కాలువలుగా కాకతీయ, సర స్వతి, లక్ష్మి ఉన్నాయి. 2010 తరువాత వరద కాలువ ద్వారా నీటి విడుదల ప్రారంభమైంది.
● 1978లోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందారెడ్డి ప్రాజెక్ట్ నుంచి తొలిసారి కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల ప్రారంభించారు.
● ఈ ప్రాజెక్ట్ ద్వారా 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నారు.
● ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల ఆయకట్టుకు నీరు అందిస్తారు.

ఆలయం పేరే ఊరు పేరైంది