- నగర చెరువుల్లో కట్టడాల కేసులు జీహెచ్ఎంసీ ట్రిబ్యునల్ పరిధిలోకి..
- అధికారులకు మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధి లోని చెరువుల కబ్జాలకు కళ్లెం వేయాలని సాగునీటి శాఖ మంత్రి హరీశ్రావు, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులకు ఆదేశించారు. తెలంగాణలోని ప్రతి మున్సిపాలి టీ, జిల్లా కేంద్రంలో ఒక్కో చెరువును మొదటి దశలో అభివృద్ధి చేస్తామన్నారు. సోమవారం నగర, పట్టణ ప్రాంతాల్లోని చెరువుల అభి వృద్ధి, పరిరక్షణపై మంత్రులు హరీశ్, కేటీఆర్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్లు జలసౌధలో సమీక్ష నిర్వహించారు. నగర ప్రాం తాల్లోని చెరువులు కబ్జాలకు గురికాకుండా కాపాడేందుకు, వాటిని సుందరీకరించేందుకు సమగ్రమైన ప్రణాళికలతో ముందుకు రావాల ని సాగునీటి, పురపాలక శాఖల విభాగాల అధిపతులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు.
త్వరలోనే జీహెచ్ఎంసీ పరిధిలో చెరు వుల పరిరక్షణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడతా మని మంత్రి కేటీఆర్ తెలిపారు. చెరువుల్లో వెల సిన అక్రమ కట్టడాల కేసులను జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేయనున్న ట్రిబ్యునల్ పరిధిలోకి తీసుకు వచ్చేందుకున్న అవకాశాలను పరిశీలిం చాలని అధికారులకు సూచించారు. హైకోర్టు తీర్పు, మార్గదర్శకాలకు అనుగుణంగానే తాము చెరువుల పరిరక్షణ చర్యలు తీసుకుం టున్నామని, ఎఫ్టీఎల్ నిర్మాణాల విషయం లో స్టేలు తీసుకుని రావడం వల్ల ఈ ప్రక్రియకు విఘాతం కలుగుతున్న తీరును హైకోర్టుకు తెలిపేందుకు చీఫ్ జస్టిస్ను కలవాలని ప్రిన్సిపల్ సెక్రటరీలకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు.
నగరంలోని ప్రతి చెరువుకు ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేయడం వల్ల వాటి అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా చేయ వచ్చని, ఈ మేరకు అధికారులే స్వయంగా ముందుకు రావాలని మంత్రులు కోరారు. పురపాలికల్లోని చెరువులను అభివృద్ధి చేసేం దుకు పురపాలక శాఖ అధికారులు, రెవెన్యూ, సాగునీటి శాఖాధికారులు కలసి పనిచేయా లన్నారు. చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారించి, సాధ్యమైనంత త్వరగా చెరువులకు ఫెన్సింగ్ వేయాలన్నారు. మరోవైపు చెరువుల భూము లపైన ఉన్న కేసుల పరిష్కారానికి మరింత చురుగ్గా ప్రయత్నాలు చేయాలని సూచించారు.
చెరువులపై ప్రత్యేక చర్చ
హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న చెరు వులపైన ఈ సమావేశంలో ప్రత్యేక చర్చ జరి గింది. నగరంలోని చెరువుల పరిరక్షణ, అభి వృద్ధి కోసం హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్ బోర్డు, పొల్యూషన్ కం ట్రోల్ బోర్డు, పర్యాటక శాఖల అధికారులతో కలసి ఒక బృందం ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా చెరువుల్లోకి వచ్చే మురికి నీటికి అడ్డుకట్ట వేసేందుకు మెట్రో వాటర్ వర్క్స్ సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ల నిర్మాణానికి ఉన్న అన్ని అవకాశాలను పరిశీ లించాలని, పారిశ్రామిక వ్యర్ధాలకు అడ్డుకట్ట వేసేందుకు పీసీబీ పనిచేయాలన్నారు.
100 చెరువుల అభివృద్ధికి రూ.వంద కోట్లతో ప్రణాళిక
మెదటి దశలో నగరంలోని సుమారు 100 చెరువుల అభివృద్ధి కోసం వంద కోట్లకు పైగా అంచనాలతో తయారు చేసిన ప్రణాళికలను అధికారులు మంత్రులకు వివరించారు. ఈ ప్రణాళికల తయారీలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో చెరువుల పరిరక్షణ కోసం చేపట్టిన అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసినట్టు తెలిపారు. నగరంలోని చెరువులు కబ్జా కాకుండా సూమారు 30 చెరువులకు ఫెన్సింగ్ వేశామని, స్థానికుల సహయ సహకారాలతో వాటి రక్షణకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. పురపాలికలు, పట్టణాల్లోని చెరువుల అభివృద్ధికి సాగునీటి శాఖ పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ సమావేశంలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పర్యాటక శాఖ, సాగునీటి శాఖ అధికారులు పాల్లొన్నారు.
చెరువుల కబ్జాలకు కళ్లెం
Published Tue, Apr 11 2017 2:33 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
వసంతోత్సవాలకు అంకురార్పణ
ముంపుపై ముందుచూపేది..?
No Headline
విత్తన నాణ్యతపై నజర్
నల్లమలలో శాకాహార జంతువుల సర్వే
ఇంటి అనుమతులు ఇవ్వాలని వృద్ధురాలు వేడుకోలు
నిందితులు రిమాండ్కు..
కులగణన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి
ఆన్లైన్ టికెట్లతో మోసపోయిన న్యాయవాదులు
విద్యుత్ వైర్లు తగిలి నాలుగు గేదెలు మృతి
తప్పక చదవండి
- ‘పట్టభద్రులపై’ పట్టు కోసం!
- ఆక్వాలో అగ్రగామిగా ఏపీ
- ఇక సులభంగా సేంద్రీయ ధ్రువీకరణ
- సీసీఎస్ ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
- మాటలతో మూటలు
- అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి: హరీశ్రావు
- ప్రపంచంతో పోటీపడేలా కొత్త పారిశ్రామిక పాలసీలు
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
Advertisement