నలుగురు హాకీ ఆటగాళ్లు దుర్మరణం

Four National Level Hockey Players Killed In Road Accident - Sakshi

హోసంగాబాద్‌(మధ్యప్రదేశ్‌): రోడ్డు ప్రమాదంలో నలుగురు జాతీయ స్థాయి హాకీ ఆటగాళ్లు దుర్మరణం చెందారు. సోమవారం ఉదయం హోసంగాబాద్‌లోని రాసాల్పూర్‌ వద్ద చోటు చేసుకున్న కారు ప్రమాదంలో నలుగురు హాకీ ఆటగాళ్లు మృతి చెందడంతో పాటు పలువురు గాయపడ్డారు.  జాతీయ రహదారి-69పై హాకీ ఆటగాళ్లు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ సమయంలో అతివేగంగా వెళుతున్న కారు జాతీయ రహదారి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. 

ఈ ఘటనలో నలుగురు హాకీ ఆటగాళ్లు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ధ్యాన్‌చంద్‌ ట్రోఫీలో భాగంగా సదరు హాకీ ఆటగాళ్లు కారులో ఇతార్సి నుంచి హోసంగాబాద్‌కు వెళుతున్న సమయంలో కారు ప్రమాదం జరిగింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top