తిరుపతి మంగళం: పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేసి వారి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, తండ్రి ఆశయ సాధన కోసం శ్రమిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబాన్ని చూసే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం తిరుపతి ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు డబ్బులు, పదవులు ఆశ చూపించి టీడీపీలోకి లాక్కోలేదని ప్రమాణం చేస్తారా? అని సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. టీడీపీలోకి వెళ్లినవారికి ఎలాంటి పదవులు ఇవ్వకుంటే, అప్పుడు వారు తమ పార్టీ నుంచి స్వచ్ఛందంగా వెళ్లారని నమ్ముతామన్నారు.
రెండేళ్లలో చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిలేదని విమర్శించారు. స్థానిక ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ముఖ్యమంత్రి సత్తా బయటపడుతుందని అన్నారు. ఇసుక, మద్యం, భూదందా, పట్టిసీమ, గోదావరి పుష్కరాలు, కొత్త రాజధాని వంటి వాటిలో రూ.వేల కోట్లు దండుకున్నారని, ఆ డబ్బుతో సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీని అడ్డం పెట్టుకుని గెలిచిన వారు దమ్ముంటే పదవులకు రాజీనామాలు చేసి, టీడీపీ తరపున గెలవాలని చెవిరెడ్డి సవాల్ విసిరారు. ఆదరించి పిల్లనిచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచి పదవిని లాక్కున్న దుర్మార్గుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. తమ పార్టీని వదిలి వెళ్లిన వారికి భవిష్యత్తులో రాజకీయ సన్యాసం తప్పదని హెచ్చరించారు. కొనుగోలు చేయడం కోసం మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు డబ్బుతో వస్తే ఓటుకు నోటు’ కేసులో లాగా ఏసీబీకి పట్టించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు చెవిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
‘వైఎస్సార్ కుటుంబాన్ని చూసే ఓట్లేశారు’
Published Sat, Feb 27 2016 5:51 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టమాట సీజన్ ప్రారంభం
No Headline
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
ఆకట్టుకున్న మాక్డ్రిల్
27 నుంచి విజయవాడ రైలు రద్దు
తప్పక చదవండి
- మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
- జీతాలపై ప్రభావం.. ఎయిర్ఇండియా ఉద్యోగుల ఆందోళన!
- విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు
- ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
- ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
- ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్తో!
- T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
- చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
- ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
- నేమ్ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
Advertisement