సినీ కథానాయకుడు ఎం.మోహన్బాబుకు నవరస నట తిలకం బిరుదును ప్రదానం చేయనున్నట్టు రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు.
టి.సుబ్బరామిరెడ్డి వెల్లడి
సాక్షి, విశాఖపట్నం: సినీ కథానాయకుడు ఎం.మోహన్బాబుకు నవరస నట తిలకం బిరుదును ప్రదానం చేయనున్నట్టు రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఏటా తన జన్మదినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖులకు తమ కళా పీఠం తరఫున అవార్డులను ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తోందని, ఈ ఏడాది మోహన్బాబు 45 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని 17న విశాఖలో ఈ బిరుదు ప్రదానం చేస్తున్నామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పీసీసీ అక్టోబర్ మొదటి వారంలో విజయవాడలో నిర్వహించే సభకు వచ్చేందుకు రాహుల్గాంధీ అంగీకరించారని తెలిపారు.