తూర్పుగోదావరి జిల్లాలో లోయలో పడ్డ బస్సు | At lease 8 killed as bus falls into cliff in east godavari district | Sakshi
Sakshi News home page

తూర్పుగోదావరి జిల్లాలో లోయలో పడ్డ బస్సు

May 9 2016 8:25 AM | Updated on Sep 3 2017 11:45 PM

తూర్పుగోదావరి జిల్లాలో లోయలో పడ్డ బస్సు

తూర్పుగోదావరి జిల్లాలో లోయలో పడ్డ బస్సు

తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

కాకినాడ : తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన  రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  మారేడుమిల్లి మండలం ఇజ్జలూరి జంక్షన్ సమీపంలో ఓ ప్రయివేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 50 మంది వరకు ఉండగా 35 మంది వరకు గాయాలైనట్టు సమాచారం. వీరందరినీ రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కాగా ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన వీరంతా కాశీ తీర్థయాత్ర పూర్తి చేసుకుని, తిరుగు ప్రయాణంలో భద్రాచలం రాములవారిని దర్శించుకునేందుకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన మహిళను విజయమ్మగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement