
●గత ప్రభుత్వం ఆరంభంలోనే పెట్టుబడి సాయం...
రైతులు పంటలసాగు కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖరీఫ్ ఆరంభంలోనే పెట్టుబడి సాయం (వైఎస్సార్ రైతు భరోసా) అందించి అన్నదాతలకు అండగా నిలిచింది. ఏటా క్రమం తప్పకుండా ఈ మొత్తాన్ని అందించింది. పీఎం కిసాన్ సాయం కింద రూ. 6 వేలు, వైఎస్సార్ రైతు భరోసా కింద రూ. 7500 మొత్తం కలిపి ఏడాదికి రూ. 13500 రైతు ఖాతాలకు జమ చేసేది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతు ఖాతాలకు జమచేసేది. ఇందులో ఖరీఫ్ ఆరంభంలో, రెండవది కోతల సమయంలో, మూడవది ధాన్యం ఇంటికి చేరే వేళ ఇలా రైతుల ఖాతాలకు జమ చేసేవారు. ఇలా వైఎస్సార్ రైతుభరోసా, పీఎం కిసా కింద ఐదేళ్లపాటు రూ. 1191.03 కోట్లను అన్నదాతలకు అందించి అండగా నిలిచింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రాష్ట్రవాట కింద రూ. 14 వేలు అందిస్తామని ప్రకటించింది. కానీ నయాపైగా విదల్చకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కడప అగ్రికల్చర్: రైతులంటే కూటమి ప్రభుత్వానికి ఎప్పిటికీ చిన్నచూపే. అది నిజమని మరోసారి నిపూపణ అయింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధి కారింలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ అన్నదా తలకు పెట్టుబడి సాయానికి ఒక్క రూపాయి విదల్చ లేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు ఏటా రూ. 20 వేలు పెట్టుబడి సాయం అందచేస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా అన్నదాతలకు నయాపైసా విదల్చలేదు.
● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖరీఫ్, రబీ రెండు సీజన్లు ముగిశాయి. రెండు సీజన్లకు ఒక్క రూపాయి కూడా విడదల కాకపోవడంతో పంటల పెట్టుబడికి అన్నదాతలు అప్పు తెచ్చుకుని పంటలను సాగు చేసుకున్నారు. మళ్లీ ఖరీఫ్ సీజన్ కూడా మరో రెండు రోజుల్లో ఆరంభంకానుంది. ఈ ఏడాది ఖరీఫ్కు ముందే రుతుపవనాలు రావడంతో జిల్లావ్యాప్తంగా వర్షాలు కూడా ఆరంభమయ్యాయి. ఇక రైతులు కూడా కాడి సిద్ధం చేసుకుని పంటల సాగుకు సన్నద్ధమౌతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు విడుదలపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఈ సారి కూడా పెట్టుబడికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిందేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్న దాత సుఖీభవ నిధులను సకాలంలో విడుదల చేసి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
వైఎస్సార్ సీపీ పాలనలో...
వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో పంటల సాగుకోసం క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం అందించింది. ప్రతి ఏటా ఖరీఫ్ ఆరంభం లోనే పెట్టుబడి సాయాన్ని అందించి పంటల సాగుకు చేయూత నిచ్చింది. కానీ కూటమి ప్రభుత్వంలో పంటల సాగుకు అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. దీనికితోడు గత ఖరీఫ్, రబీ సీజన్లలో అకాల వర్షాలు, తుఫాలతో రైతులు తీవ్రంగా నష్టాలను చవి చూశారు. వారిని కూడా కూటమి ప్రభుత్వం ఆదుకోలేదు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. దీనికితోడు అన్నదాత సుఖీభవ నిధులు ఇవ్వలేదు. దీంతో అటు అన్నదాత సుఖీభవ రాక ఇటు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వక అన్ని రకాలుగా అన్నదాతలు నష్టపోయారు.
ఠంచన్గా కేంద్ర ప్రభుత్వ సాయం...
పీఎం కిసాన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఠంచన్గా సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా మూడు విడతల్లో 6 వేలు సాయం అందచేస్తామని ప్రకటించింది. ఈ మేరకు జూన్ నెలలో రూ. 2 వేలు, అక్టోబర్లో 2 వేలతోపాటు మార్చి నెలలో మూడవ విడతను విడుదల చేసింది. అయితే ఖరీఫ్, రబీ సీజన్లు ముగిసినా రూ. 20 వేలు చొప్పన సాయం అందిస్తామన్న చంద్రబాబు పట్టించుకోకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విడుదల చేసిన
రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులు వివరాలు...
సంవత్సరం రైతుల విడుదలైన నిధులు
సంఖ్య (రూ. కోట్లలో)
వైఎస్సార్ కడప జిల్లాలో...
మేనిఫెస్టోలో ...
కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెప్టో సూపర్సిక్స్లో భాగంగా ప్రతి రైతుకు ఏటా రూ. 20 వేలు ఆర్థికసాయం రైతు ఖాతాలకు జయచేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే పట్టనట్లు వ్యవహరించడంతో అన్నదాతల్లో ఆందోళన చెందారు. కూటమి ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి దాదాపు ఏడాది కావస్తున్నా రైతులకు ఒక్క రూపాయి సాయంగా అందించలేదు. గతంలో వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబు సర్కారు మరోసారి అదే తీరున వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నా పేరు దాసరి గంగయ్య. మాది పొద్దుటూరు మండలం కానపల్లె గ్రామం. నాకు మూడు ఎకరాలు పొలం ఉంది. గతేడాది వరిపంటను సాగు చేశాను. పంటలసాగు సమయంలో పెట్టుబడి సాయం అందలేదు. దీంతో అప్పు చేసి పంటను సాగు చేశాను. తరువాత కూడా పెట్టుబడి సాయం అందలేదు. మళ్లీ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కూడా ఆరంభం అవుతుంది. ఈ ఏడాదైనా పంటలసాగుకు అన్నదాత సుఖీభవ నిధులను ప్రభుత్వం విడుదల చేసి ఆదుకోవాలి.
ఏడాదైనా నయా పైసా విదల్చని సర్కార్
గత ఖరీఫ్, రబీలకు సంబంధించి దాదాపు రూ. 250 కోట్ల ఎగవేత
అన్నదాత ఆశలను అడియాసలు చేసిన బాబు ప్రభుత్వం
జిల్లాలో ఈ ఏడాది 1,28,084 హెక్టార్లలో ఖరీఫ్ పంటల సాగు
ఎప్పటికప్పుడు రైతు భరోసాతో ఆదుకున్న గత ప్రభుత్వం
ఈ ఏడాది ఖరీఫ్ పెట్టుబడికిరైతన్నల ఎదురుచూపు
వైఎస్సార్ కడప జిల్లాలో 36 మండలాల పరిధిలో దాదాపు రెండు లక్షలకు పైగా రైతులు ఉన్నారు. రెండు లక్షల హెక్టార్లకుపైగా సాగు భూమి కూడా ఉంది. అయితే రైతులు పంటల సాగులో విత్తనాలు, ఎరువులు, కూలీలతోపాటు పలు పనులకు నగదు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత వరకు పెట్టుబడి సాయం అందకపోవడంతో పెట్టుబడి కోసం కొంత మంది రైతులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవడంతోపాటు ఇళ్లలోని బంగారు నగలు తాకట్టు పెట్టి అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సూపర్సిక్స్లో చెప్పినట్టుగా సాయం విడుదలకు చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
2019–20 2,06,708 279.93
2020–21 2,08,747 280.06
2021–22 1,99,344 269.11
2022–23 2,02,598 235.68
2023–24 2,10,481 126.25

●గత ప్రభుత్వం ఆరంభంలోనే పెట్టుబడి సాయం...

●గత ప్రభుత్వం ఆరంభంలోనే పెట్టుబడి సాయం...

●గత ప్రభుత్వం ఆరంభంలోనే పెట్టుబడి సాయం...

●గత ప్రభుత్వం ఆరంభంలోనే పెట్టుబడి సాయం...

●గత ప్రభుత్వం ఆరంభంలోనే పెట్టుబడి సాయం...