యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ

Nov 24 2025 8:15 AM | Updated on Nov 24 2025 8:15 AM

యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ

యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. స్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. ఆలయ పరిసరాలు, ప్రసాద విక్రయశాల, క్యూ కాంప్లెక్స్‌, క్యూలైన్లు, ముఖ మండపాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. స్వామి వారిని 35వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.50,49,359 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement