
రైతు రుణమాఫీ ఘనత రేవంత్దే : ఎంపీ కిరణ్కుమార్రెడ్డి
రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని, గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చినా ధైర్యంగా ముందుకెళ్తున్నారని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్రంలో ఏకకాలంలో రూ.21కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత రేవంత్రెడ్డికే దక్కిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక సీట్లు గెలుచుకునేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.
సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు
–ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
ఆలేరు పేరును సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు అని, ఒకేసారి రూ.1000 కోట్లపైనా అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు శంకుస్థాపన చేయడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నట్టు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండపోచమ్మ, మల్లన్నసాగర్ నిర్మాణం చేసినప్పటికీ గంధమల్లను రిజర్వాయర్ను నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రజాప్రభుత్వంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సహకారంతో మల్లన్నసాగర్ ద్వారా ఆలేరు నియోజకవర్గంలో 100కు పైగా చెరువును నింపుకున్నామన్నారు. సీఎం రేవంత్రెడ్డి సహకారంతో గంధమల్ల రిజర్వాయర్ను నిర్మించనున్నట్లు వెల్లడించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందన్నారు. గత ప్రభుత్వం గ్రామాల్లో పాఠశాలలకు బదులుగా మద్యం దుకాణాలు ఇస్తే.. సీఎం రేవంత్రెడ్డి ప్రజా ప్రభుత్వంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు, మెడికల్ కళాశాలలను నిర్మాణం చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో మదర్డెయిరీ రూ.700 కోట్లు అప్పుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. ఆలేరును రెవెన్యూ డివిజన్, తుర్కపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని, ఆలేరు – జనగామ మార్గంలో శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జికి నిధులు కేటాయించాలని, గుండాల, ఆత్మకూరు(ఎం) మండలాల అభివృద్ధి నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు.
సభ సైడ్ లైట్స్

రైతు రుణమాఫీ ఘనత రేవంత్దే : ఎంపీ కిరణ్కుమార్రెడ్డి