
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
నడిగూడెం: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడడంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన గురువారం నడిగూడెం మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిపురం గ్రామానికి చెందిన ఆత్కూరి శ్రీను (40) అదే గ్రామానికి చెందిన ఓ రైతు వ్యవసాయ భూమికి గురువారం ట్రాక్టర్లో మట్టి తోలుతుండగా.. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతుడి తల్లి మహాలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నడిగూడెం స్టేషన్ ఇన్చార్జి మల్సూర్ తెలిపారు.
పొలం దున్ని వస్తుండగా..
గరిడేపల్లి: గరిడేపల్లి మండలం సర్వారం గ్రామానికి చెందిన కర్నాటి ఉపేందర్రెడ్డి(35) గురువారం తన పొలంలో దుక్కి దున్ని ట్రాక్టర్పై ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్ ఉపేందర్రెడ్డిపై పడటంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
యాదగిరీశుడి సేవలో
ఉత్తరాఖండ్ ఎంపీ
యాదగిరిగుట్ట: యాదగిరీశుడిని ఉత్తరాఖండ్ రాజ్యసభ సభ్యుడు నరేష్ బన్సల్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. గర్భాలయంలోని స్వయంభూలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి, ముఖ మండపంలో అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. ఎంపీ కుటుంబ సభ్యులకు అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు.

ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి