
నేడు ట్రాఫిక్ ఆంక్షలు
భువనగిరిటౌన్ : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో శుక్రవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భువనగిరి –జగదేవ్పూర్ మధ్యలో భారీ వాహనాలు, డీసీఎంలకు అనుమతి లేదు. చిట్యాల నుంచి ప్రజ్ఞాపూర్ వెళ్లే వాహనాలు భువనగిరి పట్టణంలోని నల్లగొండ రోడ్డులో గల అండర్పాస్ వద్ద నుంచి ఘట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్డు మీదుగా పోవాలని అధికారులు సూచించారు. ప్రజ్ఞాపూర్ నుంచి భువనగిరి వైపు వెళ్లే వాహనాలను తుర్కపల్లి ఎక్స్రోడ్డు నుంచి యాదగిరిగుట్ట, బొమ్మలరామారం వైపు మళ్లించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు.
సభా ఏర్పాట్ల పరిశీలన
తుర్కపల్లి : మండలంలోని తిర్మలాపూర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొనే బహిరంగ సభకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. గురువారం ఆయన అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డితో కలిసి సభా ఏర్పాట్లను పరిశీలించారు. పార్కింగ్కు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని, బాంబు, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు.
నాణ్యమైన భోజనం అందించాలి
భువనగిరి: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డీఈఓ సత్యనారాయణ సూచించారు. మోడల్, టీఆర్ఐఎస్, యూఆర్ఎస్, కేజీబీవీల్లో విధులు నిర్వహిస్తున్న వంట సిబ్బందికి కొత్త మెనూపై భువనగిరిలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వంట సిబ్బందికి ఆయన సూచనలు చేశారు. భోజనం, ఆఽహార పదార్థాలు రుచి, శుచికరంగా ఉండాలన్నారు. శిక్షణ తరగతుల్లో పెంపొందించుకున్న నైపుణ్యాలతో విద్యార్థులకు భోజనం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్ సీహెచ్ రాధ, కేజీబీవీ ప్రత్యేకాధికారులు విజయలక్ష్మి, దుర్గ, ఆర్పీలు అన్నపూర్ణ, స్వరూప, వసంత తదితరులు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో నిత్యారాధనలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ, అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన చేశారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజ వాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
ఉచిత దర్శనం కల్పించాలని వినతి
భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో ప్రతి బుధవారం భువనగిరి పట్టణంతో పాటు భువనగిరి మండల వాసులకు ఉచిత దర్శన అకాశం కల్పించాలని భజరంగ్దళ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. అదే విధంగా ఆలయం వద్ద పాద రక్షలు, పార్కింగ్ చేసిన వాహనాలకు ఫీజు వసూలు చేయొద్దన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో భజరంగ్దళ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా కన్వీనర్ సందీప్, పట్టణ కన్వీనర్ నవీన్, నాయకులు అనిల్, శివరాజులు, సంపత్ పాల్గొన్నారు.

నేడు ట్రాఫిక్ ఆంక్షలు

నేడు ట్రాఫిక్ ఆంక్షలు