
చైతన్యపరుచుదాం.. బడిబాట పట్టిద్దాం
భువనగిరి: బడీడు, బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడంతో పాటు విద్యార్థుల సంఖ్య పెంచేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. నేటి నుంచి ఈనెల 19వ తేదీ వరకు 14 రోజుల పాటు బడిబాట నిర్వహించనున్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీలు ఇంటింటికీ తిరిగి పిల్లలను, తల్లిదండ్రులను కలిసేలా ప్రణాళిక రూపొందించారు. డిజిటల్ తరగతులు, ఇంగ్లిష్ మీడియం, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, రెండు జతల యూనిఫాం అందజేస్తున్న విషయాన్ని ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే ఏప్రిల్ నెలలో నిర్వహించిన బడిబాట ద్వారా 4,040 మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించారు.
రోజువారీగా నిర్వహించే కార్యక్రమాలు
● 6వ తేదీన(నేడు) గ్రామ సభలు నిర్వహించారు. సభల్లో ఆవాస గ్రామాల ప్రజలందరినీ భాగస్వా ములు చేయాలి.
● 7న ప్రతి ఇంటినీ సందర్శించి బడీడు పిల్లలు, బడిబయటి పిల్లలను గుర్తించాలి.
● 8 నుంచి 10వ తేదీ వరకు కరపత్రాల ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహించడంతో పాటు మధ్యలో చదువు మానేసిన పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించాలి.
● 11న ఆరు నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించాలి.
● 12న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు పాఠశాలల్లో చేపట్టిన పనులను ప్రారంభించాలి. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటుబుక్స్, యూనిఫాం పంపిణీ.
● 13న సామూహిక అక్షరాభ్యాసం, బాలల సభ
● 16న ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీ దినోత్సవం నిర్వహణ
● 17న విలీన విద్య, బాలికా విద్యా దినోత్సవం..
● 18న తరగతుల డిజిటలైజేషన్పై అవగాహన, మొక్కల పెంపకం, ప్రాధాన్యతపై అవగాహన
● 19న బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహణ.
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపే లక్ష్యం
ఫ నేటి నుంచి బడిబాటకు శ్రీకారం
ఫ 19వ తేదీ వరకు కార్యక్రమాలు
ఫ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు