
పర్యావరణాన్ని కాపాడుకుందాం
భువనగిరిటౌన్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్వర్యంలో గురువారం భువనగిరిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల అవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు, సంస్థ కార్యదర్శి మాధవిలత మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మానవాళి మనుగడ ఉంటుందని, అందుకోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. నిషేధిత ప్లాస్టిక్ను వినియోగించవద్దన్నారు. ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు ఉంటాయని, పర్యావరణ దినోత్సవం సందర్భంగానే కాకుండా జీవన చర్యల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని పాటించాలని సూచించారు. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ముక్తిదా మాట్లాడుతూ నేటి తరానికి ప్రకృతి పర్యావరణంపై అవగాహన కల్పించాలని కోరా రు. ఈ కార్యక్రమంలో ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి యం.ఉషశ్రీ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్యాంసుందర్, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి జి.స్వాతి, న్యాయవాదులు చంద్రశేఖర్రెడ్డి, రాజిరెడ్డి, బొమ్మ వెంకటేశం,సాగర్, రాజేందర్రెడ్డి, న్యాయ సహాయ అడ్వకేట్లు ఎస్.జైపాల్, జి.శంకర్ తదితరులుపాల్గొన్నారు.