ప్రభుత్వం వద్దే నిధుల ఫైల్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం వద్దే నిధుల ఫైల్‌

Jun 6 2025 12:52 AM | Updated on Jun 6 2025 7:36 AM

ప్రభుత్వం వద్దే నిధుల ఫైల్‌

ప్రభుత్వం వద్దే నిధుల ఫైల్‌

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 11.39 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టి బస్వాపూర్‌ రిజర్వాయర్‌ 90 శాతం పనులు పూర్తయ్యాయి. నిర్వాసితులకు పరిహారం రూ.500 కోట్లు ఇవ్వాలి. ఇందులో సేకరించిన భూములకు రూ.250 కోట్లు, ముంపు గ్రామమైన బీఎన్‌ తిమ్మాపూర్‌ నిర్వాసితులకు ఆర్‌ఆండ్‌ఆర్‌ప్యాకేజీ కోసం రూ.250 కోట్లు ఇవ్వాలి. ఈ నిధులకు సంబంధించి ఫైల్‌ ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. రిజర్వాయర్‌ నిర్మాణానికి 4,238 ఎకరాల భూమి కోల్పోయిన తిమ్మాపూర్‌, జంగంపల్లి, రుస్తాపూర్‌, వడపర్తి, బస్వాపూర్‌ రైతులు ఎదురుచూస్తున్నారు. బీఎన్‌ తిమ్మాపూర్‌ ముంపు బాధితులకు రూ.30 కోట్లు ఇటీవల ప్రభుత్వ విడుదల చేసింది. ఇంకా రూ.69 కోట్లు చెల్లిస్తే 1.50 టీఎంసీ నీటితో బస్వాపూర్‌ రిజర్వాయర్‌ను నింపి రైతులకు అందించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement