స్మార్ట్‌ డివైజ్‌.. ఎరువుఈజీ | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ డివైజ్‌.. ఎరువుఈజీ

Jun 5 2025 7:56 AM | Updated on Jun 5 2025 7:56 AM

స్మార

స్మార్ట్‌ డివైజ్‌.. ఎరువుఈజీ

సంస్థాన్‌నారాయణపురం: ఎరువుల అమ్మకాలు, చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి. ఇందుకోసం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం పాత పీవోఎస్‌ మిషన్‌ స్థానంలో నూతనంగా స్మార్ట్‌ పీవోఎస్‌ డివైజ్‌ను రూపొందించింది. వీటిని ఎరువుల డీలర్లకు అందజేస్తున్నారు. స్మార్ట్‌ డివైజ్‌ వల్ల ఎరువుల లెక్కలు కూడా పక్కాగా నమోదుకానున్నాయి.

పాత పీవోఎస్‌తో ఇక్కట్లు

పాత పీవోఎస్‌ మిషన్‌ డిస్‌ప్లే చిన్నగా ఉండేది. అందులో అక్షరాలు కూడా అతి చిన్నగా కనిపించేది. ఒక అక్షరం టచ్‌ చేస్తే మరో అక్షరం పడేది. అక్షరాలు టైప్‌ చేయాల్సి రావడంతో డీలర్ల కళ్లపై భారం పడటంతో సమస్యలు ఏర్పడేవి. ఒక అమ్మకం జరపడానికి చాలా సమయం తీసుకునేది. అంతేకాకుండా రైతుల వేలిముద్రలు పడకపోవడం, ఆధార్‌ కార్డుతో మొబైల్‌ లింక్‌ లేకపోవడం వల్ల ఓటీపీ రాకపోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యేవి. దీంతో రైతులు ఎరువుల కొనుగోలు చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తప్పని పరిస్థితిలో ఇతర వ్యక్తుల పేరున ఎరువులు కొనుగోలు చేసిన రైతులున్నారు. పీవోఎస్‌ మిషన్ల ద్వారా ఏర్పడుతున్న ఇబ్బందులు తాళలేక కొందరు డీలర్లు కంప్యూటర్‌ ద్వారా అమ్మకం చేసేవారు.

256 మంది డీలర్లకు కొత్త మిషన్ల పంపిణీ

జిల్లా వ్యాప్తంగా 256 మంది ఎరువుల డీలర్లు ఉన్నారు. ఇందులో ఆలేరు డివిజన్‌లో 90, భువనగిరి డివిజన్‌లో 136, యాదగిరిగుట్ట డివిజన్‌లో 30 మంది డీలర్లు ఉన్నారు. వీరందరికీ కృభుకో ఎరువుల కంపెనీ ఆధ్వర్యంలో అధికారులు నూతన స్మార్ట్‌ డివైజ్‌లను అందజేశారు. పాత పీవోఎస్‌ మిషన్‌ తీసుకొని స్మార్ట్‌ డివైజ్‌లు పంపిణీ చేశారు.

శిక్షణ ఇస్తే ఎంతో మేలు

ఎరువుల డీలర్లకు కొత్త స్మార్ట్‌ పీవోఎస్‌ డివైజ్‌లను అందజేసినప్పటికీ అందులోని అప్షన్‌లపై ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు. స్మార్ట్‌ డివైజ్‌లపై అవగాహనలేమి వల్ల డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. శిక్షణ ఇవ్వాలని కోరుతున్నారు.

పీవోఎస్‌ స్థానంలో నూతన విధానం

ఫ స్మార్ట్‌ పీవోఎస్‌ డివైజ్‌లో స్వైపింగ్‌,

ఆన్‌లైన్‌ పేమెంట్‌, కెమెరా ఆప్షన్‌

ఫ వేగవంతంగా చెల్లింపులు, సమయం ఆదా

ఫ రెతుల వేలిముద్రకు ఆధునిక ఫింగర్‌ ప్రింట్‌

ఫ డీలర్లకు తీరనున్న సమస్యలు

ఉపయోగాలు ఇవీ..

నూతనంగా రూపొందించిన స్మార్ట్‌ పీవోఎస్‌ డివైజ్‌కు పెద్ద డిస్ల్పేతో ఉంటుంది.

అక్షరాలు టైప్‌ చేయడంలో ఇబ్బందులు లేవు. డీలర్ల కంటిపై ప్రభావం పడదు.

చాలా తక్కువ సమయంలో రైతుకు ఎరువులు విక్రయించి, అతని నుంచి నగదు స్వీకరించవచ్చు.

ఆధునికత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన డివైజ్‌ కావడం వల్ల రైతుల వేలిముద్రలు ఇబ్బందులు పడకపోవడం అనేది ఉండదు.

మొబైల్‌ ఓటిపీ విధానం కూడా ఉంది.

నగదురహిత అమ్మకాలను అనుగుణంగా స్వై పింగ్‌, ఆన్‌లైన్‌ (ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం త దితర)చెల్లింపులు చేయడానికి అవకాశం ఉంది.

ఎరువుల లెక్క పక్కాగా ఉంటుంది. పక్కదారి పట్టడానికి అవస్కారం ఉండదు.

భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా డివజైన్‌కు కెమెరా కూడా ఏర్పాటు చేశారు.

సమయం ఆదా అవుతుంది

స్మార్ట్‌ డివైజ్‌తో ఎరువుల అమ్మకం చాలా సులభంగా ఉంది. పెద్ద టచ్‌ డిస్‌ప్లే ఉండటం వల్ల వివరాల నమోదులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంది. పాత పీవోఎస్‌ మిషన్‌తో చాలా ఇబ్బందులు పడ్డాం. కళ్లపై ప్రభావం పడేది. ఇప్పుడు అటువంటి సమస్య లేదు.

–డి.శ్రీనివాస్‌, ఎరువుల డీలర్‌, చౌటుప్పల్‌

సులభతరంగా ఉంటుంది

కొత్త స్మార్ట్‌ పీవోఎస్‌ డివైజ్‌ వల్ల ఎరువుల అమ్మకం సులభంగా కానుంది. తక్కువ సమయంలో పూర్తవుతుంది. రైతుల వేలిముద్రలు కూడా స్పష్టంగా తీసుకుంటుంది. డీలర్ల కళ్లపై ఎలాంటి ప్రభావం పడదు. డివైజ్‌ నిర్వహణ కూడా సులభంగా ఉంటుంది.

–నవీన్‌కుమార్‌రెడ్డి,

కృభుకో కంపెనీ సీనియర్‌ ఫీల్డ్‌ ఆధికారి

స్మార్ట్‌ డివైజ్‌.. ఎరువుఈజీ1
1/3

స్మార్ట్‌ డివైజ్‌.. ఎరువుఈజీ

స్మార్ట్‌ డివైజ్‌.. ఎరువుఈజీ2
2/3

స్మార్ట్‌ డివైజ్‌.. ఎరువుఈజీ

స్మార్ట్‌ డివైజ్‌.. ఎరువుఈజీ3
3/3

స్మార్ట్‌ డివైజ్‌.. ఎరువుఈజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement