
పేలిన ఆర్టీసీ బస్సు టైర్లు
ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలంలోని తుక్కాపురం స్టేజీ వద్ద బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ సెమి లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి ఆత్మకూరు(ఎం)మీదుగా మోత్కూరు వైపు వెళ్తుంది. మండలంలోని తుక్కాపురం స్టేజి వద్దకు వెళ్లగానే బస్సు వెనుక భాగంలోని రెండు టైర్లు పేలిపోయాయి. డ్రైవర్ బస్సును చాకచక్యంతో అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిని మరో బస్సులో పంపించారు.
ఫ డ్రైవర్ బస్సును అదుపు
చేయడంతో తప్పిన ప్రమాదం