
నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి
భూదాన్పోచంపల్లి: వానాకాలం పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) గోపాల్ అన్నారు. మంగళవారం భూదాన్పోచంపల్లి మండలం భీమనపల్లి రైతువేదికలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు విత్తన కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం‘ కార్యక్రమంలో భాగంగా రైతులకు కేఎన్ఎం 1638 వరి, ఎంజీజీ 385 పెసర విత్తన కిట్లను అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ నీలిమ, మండల వ్యవసాయాధికారిణి ఎ.శైలజ, ఏఈఓలు శ్వేత, ప్రియాంక, స్వప్న, నరేశ్, రాజేశ్, క్రాంతి, పవిత్రన్, రైతులు పాల్గొన్నారు.
ఫ జిల్లా వ్యవసాయాధికారి గోపాల్