మినీ శిల్పారామంతో భక్తులకు ఆహ్లాదం | - | Sakshi
Sakshi News home page

మినీ శిల్పారామంతో భక్తులకు ఆహ్లాదం

Jun 3 2025 6:57 AM | Updated on Jun 3 2025 6:57 AM

మినీ

మినీ శిల్పారామంతో భక్తులకు ఆహ్లాదం

భువనగిరి : యాదగిరి క్షేత్రానికి వచ్చే భక్తులు సేదదీరేందుకు మినీ శిల్పారామం ఎంతో అనువుగా ఉంటుందని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. భువనగిరి మండలం రాయగిరి చెరువు వద్ద ఏర్పాటు చేసిన మినీ శిల్పారామాన్ని సోమవారం ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్‌ హనుమంతరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ శిల్పారామం తరహాలో మినీ శిల్పారామం ఉందన్నారు. చేనేత, హస్తకళాకారులకు సైతం తాము తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముకునేందుకు మినీ శిల్పారామం మంచి వేదిక కానుందన్నారు. స్టాళ్లలో ఏర్పాటు చేసే చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి చేనేతను ప్రోత్సహించాలని సదర్శకులను కోరారు. అనంతరం బోటులో ప్ర యాణించారు. అదే విధంగా సురభి కళాకారుల ప్రదర్శనలు, చేనేత, హస్తకళల స్టాళ్లను తిలకించారు. ఈ కార్యక్రమంలో మినీ శిల్పారామం ప్రత్యేకాధికారి కిషన్‌రావు, నాయకులు పాల్గొన్నారు.

ఫ ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

మినీ శిల్పారామంతో భక్తులకు ఆహ్లాదం1
1/1

మినీ శిల్పారామంతో భక్తులకు ఆహ్లాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement