ప్రసాద తయారీ కేంద్రంలో చింతపండు చోరీ | - | Sakshi
Sakshi News home page

ప్రసాద తయారీ కేంద్రంలో చింతపండు చోరీ

May 29 2025 10:06 AM | Updated on May 29 2025 10:06 AM

ప్రసాద తయారీ కేంద్రంలో చింతపండు చోరీ

ప్రసాద తయారీ కేంద్రంలో చింతపండు చోరీ

యాదగిరిగుట్ట రూరల్‌: యాదగిరిగుట్ట పైన చింతపండు బస్తాలను ఆలయ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు దొంగతనానికి పాల్పడిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. యాదగిరిగుట్ట పైన ఉన్న ప్రసాదాల తయారీ కేంద్రానికి సంబంధించిన గోదాం నుంచి మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు 9 చింతపండు బస్తాలను (సుమారు 3క్వింటాళ్లు) గోదాంలో ఉన్న కన్వేయర్‌ బెల్టు ద్వారా బయటకు తీసుకొచ్చారు. ఈ బస్తాలను కారులో పెట్టి కొండ కిందకు తరలించే ఏర్పాట్లు చేస్తుండగా.. పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం రావడంతో ఇద్దరు వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు పట్టుకున్నారు. వారిద్దరు ప్రసాద విక్రయశాల విభాగంలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది సీహెచ్‌. గణేష్‌, పులిహోర మిషన్‌ ఆపరేటర్‌ పి. మధుగా గుర్తించి యాదగిరిగుట్ట పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

షోకాజ్‌ నోటీసులు జారీచేసిన ఈఓ..

చింతపండు బస్తాలు దొంగతనం జరిగిన విషయంపై ఈఓ ఎస్‌. వెంకట్రావ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ప్రసాదాల తయారీ గుమాస్తా పులెపాక నవీన్‌, పర్యవేక్షకుడు సత్యనారాయణకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

పేర్లు చెప్పొద్దని భయపెడుతున్నారు

చింతపండు దొంగతనంలో తమ పేర్లు చెప్పొద్దని అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులైన మధు, గణేష్‌ను కొందరు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వారి కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. ఆలయానికి చెందిన పంతుళ్లు క్రిష్ణమాచార్యులు (కన్నయ్య), సంతోష్‌ ప్రసాద విక్రయశాల విభాగం నుంచి చింతపండు తీసుకరమ్మని మధు, గణేష్‌కు సూచించారని వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. తమ పేర్లు చెప్పొద్దని రఘు అనే ఉన్నతాధికారి భరోసా ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.

పర్యవేక్షణ లోపం..

చింతపండు బస్తాలను తీసుకెళ్లడానికి కొండపైకి వెళ్లిన కారును ఏ విధంగా పైకి అనుమతించారో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారు ఎవరి రిఫరెన్స్‌తో కొండ పైకి వెళ్లిందనే విషయం ఆలయ అధికారులు చెప్పడం లేదు. అదేవిధంగా ప్రసాద విక్రయశాల విభాగంలో విలువైన సామగ్రి ఉన్నా తాళాలు లేకపోవడం ఆలయ అధికారుల నిర్లక్ష్యం, భద్రతా లోపం స్పష్టంగా కనబడుతోంది.

యాదగిరిగుట ్టఆలయం నుంచి కొండ కిందకు కారులో బస్తాలు తీసుకెళ్తుండగా ఇద్దరిని పట్టుకున్న పోలీసులు

నిందితులు ఆలయ అవుట్‌సోర్సింగ్‌

ఉద్యోగులుగా గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement