
యాదగిరీశుడికి నిత్యపూజలు
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం నిత్య పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలను అర్పించారు. ఆలయ ప్రాకార మండపాల్లో నిత్యకల్యాణం, శ్రీ సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, బ్రహ్మోత్సవం నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన చేపట్టారు.
కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నల్లగొండ: కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సంక్షేమ పథకాలు సామాన్యులు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ డీఆర్డీఓ శేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని సురక్ష బీమా పథకం కింద ఖాతాదారుడు సంవత్సరానికి రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. ఖాతాదారులు 18 నుంచి 70 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలని తెలిపారు. ప్రధాని జీవన జ్యోతి బీమా పథకం కింద ఖాతాదారుడు సంవత్సరానికి రూ.436 చెల్లిస్తే ఏడాది కాలానికి గాను రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు.