టెన్త్‌లో 7 వ స్థానం | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌లో 7 వ స్థానం

May 1 2025 1:48 AM | Updated on May 1 2025 1:48 AM

టెన్త

టెన్త్‌లో 7 వ స్థానం

గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025

సాక్షి,యాదాద్రి : పదో తరగతి పరీక్షలో యాదాద్రి భువనగిరి జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించింది. 97.80 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో ఏడో స్థానంలో నిలిచింది. గత ఏడాది 26 స్థానంలో నిలవగా.. ఈసారి 19 ర్యాకులు మెరుగుపడింది. జిల్లా ఆవిర్భావం తరువాత ఇదే అత్యధిక ఉత్తీర్ణత కావడం గమనార్హం. ఏప్రిల్‌ 3నుంచి 24వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల నుంచి 8,631 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 8,432 మంది (97.80శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.బాలురు 4,215 మందికి 4,111(97.5శాతం), బాలికలు 4,407 మందికి 4,321 (98శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా బాలికలు పైచేయి సాధించారు.

సత్తాచాటిన ప్రభుత్వ విద్యార్థులు

జిల్లాలోని వివిధ యాజమాన్యాల పరిధిలో 266 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 159 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇందులో ప్రైవేట్‌ 54 పాఠశాలలు ఉన్నాయి. 81 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించాయి. ఇంకా కస్తూర్బాగాంధీ విద్యాలయాలు 5, నాలుగు బీసీ గురుకులాలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. అదే విధంగా ఒకే ఒక విద్యార్థి ఉన్న సీఎస్‌ఐ గుండ్లగూడెం విద్యార్థి పాసయ్యాడు. వలిగొండ(బీబీనగర్‌)లోని జ్యోతిబా పూలే గురుకుల విద్యార్థినులు సాయి మేఘన 582, సాత్విక 578 మార్కులు సాధించారు.

పక్కా ప్రణాళికతో.. ఉత్తమ ఫలితం

రాష్ట్రస్థాయిలో యాదాద్రి భువనగిరి జిల్లా టాప్‌ టెన్‌లో నిలువడం వెనుక కలెక్టర్‌, విద్యాశాఖ అధికారుల కృషి ఎంతగానో ఉంది. గత ఏడాది జిల్లా ర్యాంకు రాష్ట్రస్థాయిలో 25 స్థానానికి పడిపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అటువంటి పరి స్థితి పునరావృతం కాకుండా కలెక్టర్‌ హనుమంతరావు చొరవతో విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పక్కాగా అమలు చేసింది. కలెక్టర్‌తో పాటు డీఈఓ సత్యనారాయణ, విద్యాశాఖతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు నిరంతరం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ప్రత్యేక తరగతులను పర్యవేక్షించారు. ఉపాధ్యాయులతో ప్రతి వారం జూమ్‌ మీటింగులు నిర్వహించి అప్రమత్తం చేశారు. అంతేకాకుండా కలెక్టర్‌ సొంత ఆలోచనతో విద్యార్థులకు మార్నింగ్‌ వేకప్‌ కాల్‌ చేయడం, విద్యార్థి ఇంటి తలుపుతట్టి కార్యక్రమాలను పక్కాగా అమలు చేశారు. కలెక్టర్‌, అదనపు కలెక్టర్లతో పాటు అధికారులు, ఉపాధ్యాయులు చదువులో వెనుకబడిన విద్యార్థులను దత్తత తీసుకున్నారు.కౌన్సెలింగ్‌ ఇస్తూ సబ్జెక్టుల వారీగా శ్రద్ధ తీసుకున్నారు.100 శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పరీక్షలకు సన్నద్ధం చేశారు.

జ్యోతిబా పూలే రెసిడెన్సియల్‌ స్కూల్‌, వలిగొండ

ఈఓగా బాధ్యతల స్వీకరణ

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ఈఓగా వెంకట్రావ్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

- IIలో

న్యూస్‌రీల్‌

ఫలితాల్లో మెరిసిన యాదాద్రి జిల్లా.. 97.80 శాతం ఉత్తీర్ణత

ఫ గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రస్థాయిలో 19 స్థానాలు మెరుగు

ఫ 159 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత

ఫ వలిగొండ జ్యోతి బా పూలే గురుకుల విద్యార్థినులకు అత్యధిక మార్కులు

ఫ ఫలించిన కలెక్టర్‌,

విద్యాశాఖ అధికారుల కృషి

ఎక్కువ మార్కులు సాధించిన 65 మంది విద్యార్థులకు సైకిళ్లు : కలెక్టర్‌

పరీక్షల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అత్యధిక మార్కులు సాధించిన 65 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేస్తానని కలెక్టర్‌ తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గాను బుధవారం తన చాంబర్‌లో ఇంచార్జి డీఈఓ, అదనపు కలెక్టర్‌, అధికారులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఇంచార్జ్‌ డీఈఓ ప్రశాంత్‌రెడ్డిని కలెక్టర్‌ సన్మానించి అభినందనలు తెలిపారు. ఎక్కువ మార్కులు సాధించి విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా త్వరలో సన్మానం చేస్తానని కలెక్టర్‌ ప్రకటించారు. ప్రత్యేక కార్యాచరణ అమలుకు ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయడం వల్లే ఉత్తమ ఫలితాలు సాధ్యమైనట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రానున్న విద్యాసంవత్సరం జిల్లాను మొదటి స్థానంలో నిలుపాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి (రెవె న్యూ), భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, డీఆర్‌డీఓ విజిలెన్స్‌ అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి ఎస్‌.జగన్‌, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

ఉత్తీర్ణత శాతం

పాఠశాల విద్యార్థులు ఉత్తీర్ణులు శాతం వందశాతం

ప్రభుత్వ స్కూళ్లు 231 209 90.5 -

జెడ్పీహెచ్‌ఎస్‌ 3,637 3,515 96.6 81

టీజీఎం 585 574 98.1 03

కేజీబీవీ 462 445 96.3 05

టీఎస్‌ఆర్‌ఈఐఎస్‌ 235 235 100 03

ఎస్టీ ఆశ్రమ 16 16 100 01

ఎంజేపీటీబీసీ 271 271 100 04

టీఎంఆర్‌ఈఐఎస్‌ 114 114 100 03

టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ 523 521 99.6 05

ఎయిడెడ్‌ 01 01 -100 01

ప్రైవేట్‌ స్కూళ్లు 2,556 2,531 99 54

జిల్లా ఆవిర్భావం తరువాత ఫలితాలు

సంవత్సరం ఉత్తీర్ణత శాతం జిల్లా స్థానం

2016–17 80.95 25

2017–18 82.98 19

2018–19 95.57 16

2019–20 100 కోవిడ్‌

2020–21 100 కోవిడ్‌

2021–22 93.61 13

2022–23 80.97 23

2023–24 90.44 25

2024–25 97.80 07

టెన్త్‌లో 7 వ స్థానం1
1/2

టెన్త్‌లో 7 వ స్థానం

టెన్త్‌లో 7 వ స్థానం2
2/2

టెన్త్‌లో 7 వ స్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement