
తైక్వాండో చాంపియన్షిప్లో బంగారు పతకం
నేరేడుచర్ల: తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం, ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన మొదటి ఇండో–నేపాల్ ఇంటర్నేషనల్ చాంపియన్షిప్–2025లో నేరేడుచర్ల పట్టణానికి చెందిన కొణతం గమన్రెడ్డి పాల్గొని బంగారు పతకం సాధించాడు. గమన్రెడ్డి హైదరాబాద్లోని అల్కాపూర్ టౌన్షిప్ స్కాలర్స్ అకాడమీలో ఐదో తరగతి చదువుతున్నాడు. గమన్రెడ్డి కోచ్ సుబ్బారావు శిక్షణలో ఎస్ఐటీఎస్ సంస్థలో ప్రత్యేక శిక్షణ పొందుతున్ననాడని అతడి తాత, నేరేడుచర్ల మాజీ సర్పంచ్ కొణతం సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గమన్రెడ్డి ఐదు బంగారు పతకాలు, మూడు వెండి పతకాలు సాధించాడని పేర్కొన్నారు. గమన్రెడ్డి బంగారు పతకం సాధించడంతో అతడి తల్లిదండ్రులు ఉదయ్కుమార్రెడ్డి–శోభన, నాయణమ్మ కొణతం విజయలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు.