
వృద్ధులకూ తప్పని పరేషన్
కుక్కునూరు: కూటమి ప్రభుత్వం ఎండీయూ వాహనాలను రద్దు చేయడంతో వృద్ధులు రేష న్ కోసం పాట్లు పడుతున్నారు. 65 ఏళ్లు దాటి న వారికి ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందిస్తామన్న ప్రభుత్వ పెద్దల మాట నీటిమూట లుగా మారాయి. పలువురు రేషన్ డీలర్లు వృద్ధుల ఇళ్లకు వెళ్లి బయోమెట్రిక్ లో వేలిముద్రలు తీసుకోని చౌక డిపోకు వ చ్చి సరుకులు తీసుకువెళ్లాలని చెప్పినట్టు తెలిసింది. దీంతో వృద్ధులు మండుటెండలో రేషన్ కోసం డిపోల కు వెళుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే తమకు ఈ కష్టాలు ఉండేవి కావని గురువారం కుక్కునూరులో బియ్యం మూటలతో వెళుతున్న వృద్ధులు అన్నారు.