సోలాపూర్‌లో యాత్రికుల లగేజీ దోపిడీ | - | Sakshi
Sakshi News home page

సోలాపూర్‌లో యాత్రికుల లగేజీ దోపిడీ

May 31 2025 1:26 AM | Updated on May 31 2025 1:41 AM

సోలాప

సోలాపూర్‌లో యాత్రికుల లగేజీ దోపిడీ

ఏలూరు: టి.నరసాపురం మండలం మక్కినవారిగూడానికి చెందిన యాత్రికులు సోలాపూర్‌ సమీపంలో దోపిడీకి గురయ్యారు. యాత్రికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మక్కినవారిగూడానికి చెందిన 24మంది ఈ నెల 27న రైలులో షిర్డీ వెళ్లారు. 29వ తేదీ రాత్రి షిర్డీ నుంచి సోలాపూర్‌కు చెందిన శివ్‌బాబా ట్రావెల్స్‌ బస్సును మాట్లాడుకుని బస్సులో సోలాపూర్‌ బయలుదేరారు. వారి లగేజీ బ్యాగ్‌లను బస్సు డిక్కీలో ఉంచారు. 30వ తేదీ ఉదయం సోలాపూర్‌లో బస్సు దిగి డిక్కీ తెరిచి చూడగా, డిక్కీలో పెట్టిన దాదాపు 24 మందికి చెందిన బ్యాగులు మాయమయ్యాయి. వాటిలో దాదాపు విలువైన బట్టలతో పాటు రూ. 70 వేల నగదు ఉంటుందని యాత్రికులు తెలిపారు. బస్సు ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో డ్రైవర్‌ పలు చోట్ల ఆపి కిందకు దిగినట్లు యాత్రికులు చెబుతున్నారు.

దీంతో బస్సును సోలాపూర్‌లో పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి యాత్రికులు ఆందోళన చేశారు. ఈ ఘటనపై మక్కినవారిగూడెంకు చెందిన దొంతు లక్ష్మీనారాయణతో పాటు మరికొందరు కలిసి ఫిర్యాదు చేశారు. సాయంత్రానికి పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌ కాపీని యాత్రికులకు ఇచ్చారు. యాత్రికులంతా సోలాపూర్‌ చుట్టుపక్కల పర్యటించి జూన్‌ 1వ తేదీన 8 గంటలకు సోలాపూర్‌ నుంచి విజయవాడకు రైలు ఎక్కాల్సి ఉంది. రిజర్వేషన్‌ టిక్కెట్‌లు సైతం ఆ బ్యాగ్‌లోనే ఉన్నాయని, తిరుగు ప్రయాణానికి తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని యాత్రికులు తెలిపారు.

సోలాపూర్‌లో యాత్రికుల లగేజీ దోపిడీ 1
1/1

సోలాపూర్‌లో యాత్రికుల లగేజీ దోపిడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement