ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం

May 29 2025 12:47 AM | Updated on May 29 2025 2:08 PM

పెంటపాడు: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు దుర్మరణం పాలైన ఘటన బుధవారం తాడేపల్లిగూడెం– భీమవరం రోడ్డులో ముదునూరు వద్ద జరిగింది. పెంటపాడు ఎస్సై స్వామి తెలిపిన వివరాలివి. గూడెం మండలం ఆరుగొలనుకు చెందిన అడ్డగర్ల సాయి రమేష్‌ (34) కరెంట్‌ పని చేస్తుంటాడు. బుధవారం పనినిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లి తిరిగి మోటార్‌ సైకిల్‌పై స్వగ్రామం వస్తుండగా ముదునూరు మలుపు వద్ద భీమవరం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో రమేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ

యలమంచిలి: అడవిపాలెం సచివాలయానికి సమీపంలో నిలుపుదల చేసి ఉన్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొనడంతో బోల్తా పడింది. ఆ శబ్థానికి చుట్టుపక్కల వారు భయబ్రాంతులకు గురయ్యారు. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ప్రమాదం జరిగిన సమయానికి ఎవరూ లేకపోవడం వలన పెను ప్రమాదం తప్పింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ విలేకరి ప్రమాద ఘటనను ఫొటో తీయగా లారీ డ్రైవర్‌ దౌర్జన్యానికి దిగాడు. దీనిపై అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఆ లారీకి కనీసం నెంబర్‌ ప్లేట్‌ లేకపోవడం విశేషం. నంబర్‌ ప్లేట్‌ లేని లారీతో కూటమి నాయకులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులతో పాటు మైనింగ్‌, రవాణా శాఖ అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలని కోరుతున్నారు.

ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ1
1/1

ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement