అధికారం శాశ్వతం కాదు | - | Sakshi
Sakshi News home page

అధికారం శాశ్వతం కాదు

Feb 14 2025 10:18 PM | Updated on Feb 14 2025 10:12 PM

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘అధికారం ఏ ఒక్కరికీ శాశ్వతం కాదు.. ఎమ్మె ల్యే అయి ఉండి హుందాగా ప్రవర్తించాల్సింది పోయి వీధిరౌడీలా ప్రవర్తిస్తావా? చింతమనేనీ.. ఇది సరికాదు... కూటమి నాయకులంతా ఇది గమనించాలి.. ’అంటూ వైఎస్సార్‌సీపీ ఏలూరు పార్లమెంట్‌ సమన్వయకర్త కారు మూరి సునీల్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ బుధవారం రాత్రి పెదపాడు మండలం వట్లూరులో మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఓ వివాహానికి హాజరుకాగా.. స్థానికులు ఆయనపై చూపిన ఆదరాభిమానాలను ఎమ్మెల్యే చింతమనేని చూసి తట్టుకోలేకపోయారన్నారు. ఆ అక్కసంతా అబ్బయ్యచౌదరి డ్రైవర్‌పై తీర్చుకున్నారని తెలిపారు. కారు దారిలో అడ్డంగా లేకపోయినా ఎందుకు అడ్డంగా పెట్టావంటూ తీ వ్ర పదజాలంతో దూషించడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. అక్కడకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు జానంపేట బాబు, వేమూరి జితేంద్ర, కృష్ణారావు, ప్రవీణ్‌లపై రాడ్డుతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అని సునీల్‌ ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యే వీధి రౌడీలా ప్రవర్తిస్తే సామాన్యులు ఎలా బతుకుతారని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత వీటన్నింటికీ స మాధానమిస్తామని, అన్ని లెక్కలూ సరిచేస్తామని సునీల్‌కుమార్‌ స్పష్టం చేశారు.

ఫ్లెక్సీలకు ముసుగులు

పాలకొల్లు అర్బన్‌: ‘గ్రా మాల్లో తొలగని ఫ్లెక్సీ లు.. ఎన్నికల నిబంధనలకు తూట్లు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి పంచాయతీ కార్యదర్శి ఎం.దిలీప్‌ స్పందించారు. గురువా రం పాలకొల్లు మండలం గవరపేటలోని మె యిన్‌రోడ్డు, ముఖ్య కూడళ్లలో ఫ్లెక్సీలకు క్లాత్‌తో ముసుగులు వేయించినట్టు చెప్పారు. ఎక్కడా ఫ్లెక్సీలు కట్టరాదని గ్రామంలో టాంటాం వేయించామన్నారు.

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు 89 మంది గైర్హాజరు

భీమవరం: ఇంటర్మీడియెట్‌ ప్రాక్ట్టికల్‌ పరీక్షలకు గురువారం 89 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్మీడియెట్‌ జిల్లా విద్యాశాఖా ధికారి ఎ.నాగేశ్వరరావు చెప్పారు. ఉదయం షిఫ్టులో 1,981 మందికి 1,889, మధ్యాహ్నం షిఫ్టులో 1,893 మందికి 1,833 మంది హాజరయ్యారని, ఎక్కడా మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని చెప్పారు.

కట్టుదిట్టమైన చర్యలు

భీమవరం (ప్రకాశంచౌక్‌): రాష్ట్ర ప్రభుత్వం బర్డ్‌ఫ్లూ నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని, ప్రజలు వదంతులను నమ్మవద్దని, జిల్లాల్లో కోళ్లు పూడ్చివేత ప్రక్రియ ఎస్‌ఓపీ ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర పశుసంవర్ధక, వైద్య ఆరోగ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో కలిసి కలెక్టర్లతో ఆయ న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. భీమవరం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్‌ చదలవాడ నాగరాణి హాజర య్యారు. బర్డ్‌ఫ్లూ సోకిన పశ్చిమగోదావరి జిల్లా వేల్పూరు, ఏలూరు జిల్లా బాదంపూడి, తూర్పుగోదావరి జిల్లా కానూరు, ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెం ప్రాంతాల్లోని ఐదు పౌల్ట్రీల్లో చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో వైరస్‌ నివారణకు తీసుకున్న చర్యలను కలెక్టర్‌ నాగరాణి వివరించారు.

ధాన్యం సేకరణకు ముందస్తు చర్యలు

ఏలూరు(మెట్రో): రానున్న 2024–25 రబీ పంట కాలంలో ధాన్యం సేకరణకు సంబంధించి రైతుల పంట వివరాలు పూర్తి పారదర్శకంగా చేపట్టి ఈకేవైసీ త్వరితగతిన పూర్తి చేయాలని జేసీ పి.ధాత్రిరెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో రబీ ధాన్యం సేకరణకు ముందస్తు ప్రణాళిక అమలులో భాగంగా అధికారులతో ఆమె సమీక్షించారు. రైతు సేవా కేంద్రాల ద్వా రా ధాన్యం విక్రయించేందుకు కావాల్సిన గోనె సంచులను రైస్‌ మిల్లర్లు ముందస్తుగానే పరిశీలించి సిద్ధం చేసుకోవాలన్నారు. ధాన్యం సేకరణపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

అధికారం శాశ్వతం కాదు 
1
1/1

అధికారం శాశ్వతం కాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement